By: ABP Desam | Published : 04 Mar 2022 05:02 PM (IST)|Updated : 04 Mar 2022 05:03 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
మంత్రి శ్రీనివాస్ గౌడ్(ఫైల్ ఫొటో)
Minister Srinivas Goud: తెలంగాణలో సంచలనమైన మంత్రి శ్రీనివాస్గౌడ్(Minister Srinivas Goud) హత్యకు కుట్ర కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. మంత్రి తనను ఆర్థికంగా దెబ్బతీశారనే కోపంతో హత్యకు పథకం(Murder Plan) వేశామని రాఘవేంద్రరాజు నేరాన్ని అంగీకరించాడని పోలీసులు తెలిపారు. హత్య కుట్ర వెలుగులోకి రావడంతో ప్రభుత్వం మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు భద్రత పెంచింది. రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇటీవల హత్య కుట్ర కోణం బయట పడటంతో రెండు పైలట్ వాహనాలు, 20 మందితో మంత్రికి భద్రత కల్పించాలని సెక్యూరిటీ వింగ్ అధికారులను పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ కేసు రిమాండ్ రిపోర్ట్(Remand Report)లో సంచలన విషయాలు వెలుగుచూశాయి.
రూ. 15 కోట్లకు డీల్
మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రస్తుతం దిల్లీ(Delhi) పర్యటనలో ఉన్నారు. ఆయన హైదరాబాద్ కు తిరిగి రాగానే అదనపు భద్రతా కల్పిస్తారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ హత్యకు రూ.15 కోట్లకు డీల్ చేసుకున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఇప్పటికే 8 మంది నిందితులను పోలీసులు(Police) అరెస్టు చేశారు. వీరి నుంచి రెండు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. తనను ఆర్థికంగా దెబ్బతీసినందుకు మంత్రి హత్యకు ప్లాన్ చేసినట్లు నిందితుల్లో ఒకరైన రాఘవేంద్రరాజు నేరాన్ని అంగీకరించాడు. మంత్రి శ్రీనివాస్గౌడ్ తన వ్యాపారాలను మూసివేయించారని, ఆర్థికంగా దెబ్బతీశారని రాఘవేంద్రరాజు పోలీసులు తెలిపారు.
బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో నిందితుల్ని కస్టడీకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. వారం రోజుల పాటు నిందితుల్ని కస్టడీకి ఇవ్వాలని మేడ్చల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును వేర్వేరు కోణాల్లో విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. నిందితులు మాత్రం మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమను వేధించారని పోలీసులకు వెల్లడించారు. రిమాండ్ రిపోర్ట్లో ఏ1 రాఘవేంద్రరాజు తాను ఎందుకు హత్య చేయాలనుకున్నాడో పోలీసులకు వివరించాడు. రిమాండ్ రిపోర్ట్లో ఉన్న నిందితులు మున్నూరు రవి, యాదయ్య కూడా మంత్రి శ్రీనివాస్గౌడ్ బాధితులమేనని పోలీసులకు వెల్లడించారు. నిందితులకు, శ్రీనివాస్ గౌడ్కు మధ్య విభేదాలు కారణమని తెలుస్తున్నా, నిందితులకు బీజేపీ(Bjp) నేతలకు మధ్య సంబంధాలు ఉన్నట్లు టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కొంత మంది బీజేపీ నేతల పేర్లు తెరపైకి రావడంతో రాజకీయంగానూ రచ్చ మొదలైంది.
Also Read: Murder Sketch Politics : తెలంగాణ పోలీసులపై ఢిల్లీలో కేసులు - "మర్డర్ స్కెచ్" కేసులో కీలక మలుపు !
Beer Sales In Hyderabad: ఎండల వేళ బీర్లతోనే ఎంజాయ్మెంట్! ఈ నెల అమ్మకాలు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే
Breaking News Live Updates: నేడు సీఎం జగన్ కర్నూల్ పర్యటన, భారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన
KTR Davos Tour: నేడు స్విట్జర్లాండ్కు మంత్రి కేటీఆర్, 10 రోజులపాటు విదేశీ పర్యటన - షెడ్యూల్ ఇదీ
Weather Updates: ఏపీలో మరో 4 రోజులు వానలే! తెలంగాణలో నేడు ఈ జిల్లాలకు వర్ష సూచన
Petrol-Diesel Price, 17 May: వాహనదారులకు నేడు కాస్త ఊరట! తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఇక్కడ మాత్రం పైపైకి
Covid Update: దేశంలో తగ్గిన కరోనా కేసులు- 28 రోజుల తర్వాత 2 వేలకు లోపు!
Periods: పీరియడ్స్ సమయానికి రావడం లేదా? ఆయుర్వేదం చెబుతున్న చిట్కాలు ఇవిగో
Anantapuram Politics: ఉమ్మడి అనంతలో పొలిటికల్ హీట్- జేసీ ప్రభాకర్రెడ్డి వర్సెస్ పల్లె రఘునాథ్
Karate Kalyani Exclusive Interview:బిడ్డపై క్లారిటీ, ఇక ప్రాంక్ పైనే నా పోరాటం|ABP Desam