అన్వేషించండి

Congress: అసెంబ్లీ రౌడీ సినిమా తరహాలో బీజేపీ, టీఆర్ఎస్ డ్రామాలు.... ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టైనా ప్రతీ గింజ కొనిపిస్తాం... రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో పండిన ప్రతీ గింజ కొనే వరకు కాంగ్రెస్ ఉద్యమం ఆగదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రేపటి నుంచి కల్లాలోకి కాంగ్రెస్ ఉద్యమం చేపడుతున్నామని స్పష్టం తెలిపారు.

వరి ధాన్యం కొనుగోలు, రైతుల సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. వ్యవసాయ కమిషనర్ కు రైతుల సమస్యలపై వినతి పత్రం ఇద్దామని వస్తే అధికారులు ఎక్కడా కనిపించడంలేదన్నారు. ధాన్యం కొనుగోళ్లు, రైతుల సమస్యలపై తెలంగాణ కాంగ్రెస్ భారీ నిరసన చేశారు. హైదరాబాద్ పబ్లిక్‌ గార్డెన్స్‌ నుంచి వ్యవసాయ కమిషనరేట్‌ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహా, సీతక్క పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర సర్కార్ లు.. జేఏసీ(జాయింట్ ఆక్టింగ్ కమిటీ)గా ఏర్పడి రైతులను మోసం చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. 3 లక్షల కోట్లు అప్పులు చేసి ప్రాజెక్టులు కట్టామన్నా చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం... పండించిన పంటకు గిట్టబాటు ధర కల్పించకపోవడం సిగ్గు చేటు అన్నారు.  సీఎం కేసీఆర్ రైతుల పక్షాన ధర్నా చేయడంలేదని ఎద్దేవా చేశారు. ఏసీలతో ధర్నాలు, దీక్షలు చేస్తారా అని ప్రశ్నించారు. రైతుల పక్షాన పోరాటం చేయాలంటే రైతుల వద్దకెళ్లి ధర్నా చేయాలన్నారు. 

Also Read: కేంద్ర ప్రభుత్వాన్ని సాఫ్ సీదా అడుగుతున్నం.. వడ్లు కొంటరా? కొనరా?.. కేసీఆర్ సూటి ప్రశ్నCongress: అసెంబ్లీ రౌడీ సినిమా తరహాలో బీజేపీ, టీఆర్ఎస్ డ్రామాలు.... ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టైనా ప్రతీ గింజ కొనిపిస్తాం... రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ధైర్యముంటే అసెంబ్లీలో తీర్మానం చేయాలి

బండి సంజయ్, కిషన్ రెడ్డి, కేసీఆర్ దిల్లీ వెళ్లి ప్రధాని మోదీని నిలదీయాలని రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ ఇద్దరూ కలిసి డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్, బీజేపీల తీరు అసెంబ్లీ రౌడీ సినిమా తరహాలో ఉందన్నారు. ఒకరినొకరు కొట్టుకున్నట్లు చేసి ప్రజలను చంపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సహారా కుంభకోణంలో కేసీఆర్ ను కేంద్రమే కాపాడుతుందని రేవంత్ ఆరోపించారు. ఈ నెల 29 నుంచి పార్లమెంట్ సమావేశాలు మొదలు కాబోతున్నాయన్నాయని, ఈ సమావేశాల్లో కేసీఆర్ స్టాండ్ ఏమిటో చెప్పాలన్నారు. కేసీఆర్ కు ధైర్యముంటే ధాన్యం కొనుగోలుపై అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు.

Also Read: ఈ యుద్ధం ఆరంభమే.. అంతం కాదు, ఇక ఉప్పెనలాగా.. అవసరమైతే వాళ్లనీ కలుపుకుపోతాం: కేసీఆర్Congress: అసెంబ్లీ రౌడీ సినిమా తరహాలో బీజేపీ, టీఆర్ఎస్ డ్రామాలు.... ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టైనా ప్రతీ గింజ కొనిపిస్తాం... రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ప్రతీ గింజ కొనే వరకు ఉద్యమం

ముందు ఖరీఫ్ ధాన్యం కొంటారా లేదో చెప్పకుండా యాసంగి పంట గురించి ధర్నాలు చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. అదానీ, అంబానీల కోసమే ప్రధాని మోదీ సర్కార్ పనిచేస్తోందని విమర్శించారు. రేపటి నుంచి కల్లాలోకి కాంగ్రెస్ ఉద్యమం చేపడతామన్నారు. 23వ తేదీ వరకు కల్లాల్లో  కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేపడతామన్నారు. తాను కామారెడ్డి కల్లాల్లోకి వెళ్లి రైతులతో కలిసి ధర్నా చేస్తానన్నారు. 23వ తేదీ వరకు సీఎం కేసీఆర్ కు సమయం ఇస్తున్నామని అప్పటికీ రైతుల సమస్యలపై స్పష్టం ఇవ్వకపోతే 23వ తేదీ తర్వాత రైతులతో కలిసి ప్రగతి భవన్ ముట్టడిస్తామన్నారు. రాష్ట్రంలో పండిన ప్రతీ గింజ కొనే వరకు కాంగ్రెస్ ఉద్యమం ఆగదని రేవంత్ స్పష్టం చేశారు. ధాన్యం కొనకపోతే ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడతామన్నారు. 

Also Read:  బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయబోం... ఆ కారణంతోనే పంజాబ్ లో కొంటున్నాం... ధాన్యం సేకరణపై కేంద్రం స్పష్టత

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Khanapur Municipal Chairman: ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో గందరగోళం.. ఆదివారానికి వాయిదా 
ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో గందరగోళం.. ఆదివారానికి వాయిదా 
Gajwel Attack: రేవంత్ ఫోటో లేదని గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుపై ఎటాక్ - రౌడీ రాజ్యమని బీఆర్ఎస్ ఆగ్రహం
రేవంత్ ఫోటో లేదని గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుపై ఎటాక్ - రౌడీ రాజ్యమని బీఆర్ఎస్ ఆగ్రహం
Basra Development: బాసర ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లు - సోమవారం పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
బాసర ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లు - సోమవారం పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
Kyathanpally and Ibragimpatnam: ఇబ్రహీంపట్నం, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీల్లో నాటకీయ పరిణామాలు! రెండింటిని కైవశం చేసుకున్న బీఆర్‌ఎస్‌!
ఇబ్రహీంపట్నం, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీల్లో నాటకీయ పరిణామాలు! రెండింటిని కైవశం చేసుకున్న బీఆర్‌ఎస్‌!

వీడియోలు

TVK Vijay Puducherry Campaign | పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో విజయ్ కి ఫ్యాన్స్ గిఫ్ట్స్ | ABP Desam
Virat Kohli Nags Interview RCB IPL 2026 | ఐపీఎల్ రూల్స్ విరుద్ధంగా ఆడేస్తున్న ఆర్సీబీ | ABP Desam
Priyansh Arya 39 vs CSK IPL 2026 | పవర్ ప్లే లో రఫ్పాడించి మ్యాచ్ ను పంజాబ్ వైపు తిప్పేశాడు | ABP Desam
Sanju Samson Failures CSK IPL 2026 | తొలి రెండు మ్యాచుల్లోనూ సంజూ విఫలం | ABP Desam
CSK vs PBKS Match Highlights IPL 2026 | సీఎస్కేపై 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 RR Vs GT Result Updates: రాజ‌స్థాన్ థ్రిల్లింగ్ విక్ట‌రీ.. టోర్నీలో వ‌రుసగా రెండో గెలుపు.. సత్తా చాటిన బిష్ణోయ‌, సుద‌ర్శ‌న్, టైటాన్స్ కు రెండో ఓట‌మి
రాజ‌స్థాన్ థ్రిల్లింగ్ విక్ట‌రీ.. టోర్నీలో వ‌రుసగా రెండో గెలుపు.. సత్తా చాటిన బిష్ణోయ‌, సుద‌ర్శ‌న్, టైటాన్స్ కు రెండో ఓట‌మి
Khanapur Municipal Chairman: ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో గందరగోళం.. ఆదివారానికి వాయిదా 
ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో గందరగోళం.. ఆదివారానికి వాయిదా 
Basra Development: బాసర ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లు - సోమవారం పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
బాసర ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లు - సోమవారం పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
Tiger In Polavaram: వీడియోలు తీస్తుంటే వెనక్కి తగ్గిన పెద్దపులి: పోలవరం నిర్వాసిత గ్రామాల్లో హై అలర్ట్!
వీడియోలు తీస్తుంటే వెనక్కి తగ్గిన పెద్దపులి: పోలవరం నిర్వాసిత గ్రామాల్లో హై అలర్ట్!
Tyson Naidu OTT : టైసన్ నాయుడుకు బిగ్ ఓటీటీ డీల్! - బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్‌లోనే...
టైసన్ నాయుడుకు బిగ్ ఓటీటీ డీల్! - బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్‌లోనే...
Telugu Desam Party:'గీత దాటితే సస్పెండ్ చేస్తా'' మరోసారి అధినేత వార్నింగ్‌'! మాకు నమ్మకం లేదు 'బాబు' అంటున్న తమ్ముళ్లు!
'గీత దాటితే సస్పెండ్ చేస్తా'' మరోసారి అధినేత వార్నింగ్‌'! మాకు నమ్మకం లేదు 'బాబు' అంటున్న తమ్ముళ్లు!
Gajwel Attack: రేవంత్ ఫోటో లేదని గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుపై ఎటాక్ - రౌడీ రాజ్యమని బీఆర్ఎస్ ఆగ్రహం
రేవంత్ ఫోటో లేదని గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుపై ఎటాక్ - రౌడీ రాజ్యమని బీఆర్ఎస్ ఆగ్రహం
IPL 2026 DC Vs MI Result Update: ఢిల్లీకి వ‌రుస‌గా రెండో విజ‌యం.. ముంబైని చిత్తు చేసిన క్యాపిట‌ల్స్, రాణించిన రిజ్వి, నిస్సాంక‌, MI కి నిరాశ‌
ఢిల్లీకి వ‌రుస‌గా రెండో విజ‌యం.. ముంబైని చిత్తు చేసిన క్యాపిట‌ల్స్, రాణించిన రిజ్వి, నిస్సాంక‌, MI కి నిరాశ‌
Embed widget