అన్వేషించండి

Telangana Congress Second list: 64 స్థానాల్లో అభ్యర్థులపై సుదీర్ఘ కసరత్తు - దసరా తర్వాతే కాంగ్రెస్ రెండో జాబితా

Telangana Congress Second list: తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా దసరా పండుగ తర్వాతే విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థులు రెండో జాబితా దసరా తర్వాతే విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 55 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎంపిక చేయగా, మిగిలిన 64 స్థానాలపై సుదీర్ఘ కసరత్తు చేస్తోంది. శనివారం ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధ్యక్షతను స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్, ఇతర నేతలు, సభ్యులు దాదాపు 4 గంటలు సమావేశమయ్యారు. మొత్తం 119 నియోజకవర్గాల్లో నాలుగైదు నియోజకవర్గాల్లోనే చిక్కుముడి పడినట్లు సమాచారం. ఈ స్థానాల్లో సీనియర్ నేతలు టికెట్ల కోసం గట్టిగా ఆశిస్తుండగా, ఇతర నేతలు కూడా పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర స్క్రీనింగ్, సీఈసీ ఎటూ తేల్చుకోలేకపోయినట్లు తెలుస్తోంది. దీంతో రాహుల్ గాంధీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి ఆయన సమక్షంలోనే ఈ స్థానాల అభ్యర్థులను ఖరారు చేయనున్నారు.

లోతుగా విశ్లేషణ 

తొలి జాబితాలో ప్రకటించిన 55 మందిలో పార్టీలోకి కొత్తగా వచ్చిన 12 మందికి టికెట్లు దక్కడం, సర్వేలో మెరుగైన ఫలితాలున్నా, ఇతరులకు టికెట్లు కేటాయించడం వంటి అంశాలను ఏఐసీసీ తీవ్రంగా పరగిణిస్తోంది. సామాజిక సమీకరణలు, తాజా రాజకీయ పరిణామాలు, ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల బలాబలాలను పరిగణలోకి తీసుకుని, అధికార బీఆర్ఎస్ ను ఎదుర్కొనేలా అభ్యర్థుల ఎంపిక కోసం స్క్రీనింగ్ కమిటీ లోతుగా విశ్లేషిస్తోంది. వీలైనంత త్వరగా ప్రక్రియ పూర్తి చేసి కేంద్ర ఎన్నికల కమిటీకి పంపాలని భావిస్తోంది.

టికెట్ల కోసం పోటీ అధికం

వనపర్తి, సూర్యాపేట, సత్తుపల్లి తదితర నియోజకవర్గాల్లో అభ్యర్థులకు టికెట్ల విషయంలో గట్టి పోటీ ఉంది. వనపర్తి టికెట్ ను పార్టీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ చిన్నారెడ్డితో పాటు మరో ఇద్దరు ఆశిస్తున్నారు. అలాగే, నిజామాబాద్ అర్బన్ స్థానంలో మైనార్టీ వర్గానికే టికెట్ ఇవ్వాలని జాతీయ నాయకత్వం భావిస్తుండగా, అక్కడ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ తో పాటు మరికొందరు టికెట్ ఆశిస్తున్నారు. ఎల్బీ నగర్ టికెట్ ను మధుయాష్కీ ఆశిస్తుండగా, తమకే ఇవ్వాలని స్థానిక నేతలు ఒత్తిడి తెస్తున్నారు.

లోపాలు లేకుండా

కాంగ్రెస్ తొలి జాబితాలో 55 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగా, అత్యధికంగా 17 సీట్లు రెడ్డిలకు, బీసీలకు 12, ఎస్సీలకు 12, ఎస్టీలకు 2, ముస్లింలకు 3 దక్కాయి. ఆరు సీట్లు మహిళలకు కేటాయించగా, ఆయా చోట్ల టికెట్లు ఆశించి భంగపడ్డ సీనియర్ నేతలు అసంతృప్తికి లోనయ్యారు. కొందరు ఏకంగా పార్టీనే వీడి వెళ్లారు. ఈ క్రమంలో ఓ కమిటీ ఏర్పాటు చేసిన హస్తం పార్టీ అసంతృప్తులను బుజ్జగించింది. తొలి జాబితా తర్వాత లోపాలు సరిదిద్దుకుంటూ ఎక్కడా పొరపాట్లకు తావు లేకుండా రెండో జాబితాను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఆ నేతలకు బుజ్జగింపు బాధ్యత

మిర్యాలగూడతో పాటు భద్రాచలం, మధిర, పాలేరు, ఇబ్రహీంపట్నం కేటాయించాలని సీపీఎం జాబితా సమర్పించింది. అయితే, మిర్యాలగూడ కేటాయింపుపై స్పష్టత వచ్చినా, రెండో సీటుపై సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో సీపీఎంతో చర్చలు జరిపే బాధ్యతను రేవంత్ రెడ్డి, భట్టి, ఉత్తమ్ లకు అప్పగించారు. సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు స్థానాలు కేటాయించాలన్న కాంగ్రెస్ ప్రతిపాదనకు ఆ పార్టీ అంగీకరించడంతో, ఆ టికెట్లు ఆశించిన కాంగ్రెస్ నేతలను బుజ్జగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

కేటీఆర్ పై రేవంత్ విమర్శలు

మరోవైపు, మంత్రి కేటీఆర్ తప్పుడు ప్రచారాల్లో రాటు దేలారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ సునామీ చూసి ఫేక్ ప్రచారాలకు తెర లేపారని ధ్వజమెత్తారు. కర్ణాటకలో అధికారం చేపట్టిన 100 రోజుల్లోనే ఇచ్చిన గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేసిందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ రూ.కోట్లు కుమ్మరించినా, తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

 

 

 

 

 

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Feel The Jail: నేరం చేయకుండా జైలుకెళ్లాలని ఉందా? ఖైదీగా మారాలనుందా? - డబ్బులు కట్టి ఉండొచ్చు..ఇవిగో డీటైల్స్
నేరం చేయకుండా జైలుకెళ్లాలని ఉందా? ఖైదీగా మారాలనుందా? - డబ్బులు కట్టి ఉండొచ్చు..ఇవిగో డీటైల్స్
Extramarital Affair: పదో తరగతి ప్రేమ - పెళ్లయ్యాక వివాహేతర బంధం - క్లైమాక్స్ చాలా వయోలెంట్ !
పదో తరగతి ప్రేమ - పెళ్లయ్యాక వివాహేతర బంధం - క్లైమాక్స్ చాలా వయోలెంట్ !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Bandi Sanjay Son POCSO Case: కుమారుడి పోక్సో కేసు - బండి సంజయ్ రాజకీయ ఎదుగుదలకు ఇది శాపమా?
కుమారుడి పోక్సో కేసు - బండి సంజయ్ రాజకీయ ఎదుగుదలకు ఇది శాపమా?

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget