అన్వేషించండి

Telangana Congress: టీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలకు ముహూర్తం ఫిక్స్, ఎప్పుడంటే?

Telangana Congress: టీ కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటనకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారు అయింది. ఈ నెల 15వ తేదీ తర్వాత జాబితాను విడుదల చేయనున్నట్లు మురళీధరన్ స్పష్టం చేశారు.

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటనపై కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్ క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 15 తర్వాత టీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని, రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. 70 సీట్లపై ఇవాళ చర్చ జరిగిందని,  కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ మరోసారి భేటీ అవుతుందని తెలిపారు. వామపక్షాలతో పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని, అభ్యర్థుల ఎంపికలో నేతల మధ్య ఎలాంటి విబేధాలు లేవని అన్నారు. కాంగ్రెస్‌లోకి చాలామంది వస్తున్నారని, ఒకరిద్దరు వెళ్లిపోయినా తాము బాధపడమని మురళీధరన్ తెలిపారు.

వెళ్లిపోయే వాళ్లపై తాము స్పందించమని, పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేయడంపై తమ పార్టీ వాళ్లు మాట్లాడరని మురళీధరన్ చెప్పారు. లిస్ట్ ఇంకా రాకముందే పొన్నాల ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. గెలుపు అవకాశాలు, విధేయత ఆధారంగా అభ్యర్థులను నిర్ణయిస్తామని, ఇప్పటివరకు 70 సీట్లతో జాబితా సిద్దంగా ఉందని అన్నారు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ త్వరలో మరోసారి సమావేశమై మిగిలిన అభ్యర్థుల ఎంపిక పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. మిత్రపక్షాలతో చర్చలు జరుగుతున్నాయని, చర్చల అనంతరం పూర్తి జాబితా ఒకేసారి ప్రకటిస్తామని అన్నారు. ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ప్రకారమే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, మైనార్టీలు, మహిళలు, బీసీలకు తగిన ప్రాధాన్యత ఇస్తామని మరళీధరన్ పేర్కొన్నారు.

బస్సు యాత్రకు ముందు అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని, వామపక్షాలతో సంప్రదింపులు జరిపిన తర్వాత అభ్యర్థుల జాబితా ఉంటుందని మురళీధరన్ తెలిపారు. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అయింది. దాదాపు రెండున్నర గంటల పాటు సమావేశమైంది. ఈ మీటింగ్‌లో 119 నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసింది. వివిధ సర్వే రిపోర్టులు, సామాజిక అంశాల ఆధారంగా టికెట్లను కేటాయించడంపై చర్చలు జరిపింది. అటు పొత్తులపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో వామపక్షాలను కలుపుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. కానీ వామపక్షాలతో పొత్తు వద్దని టీ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రేపు ఉభయ కమ్యూనిస్టు నేతలతో కేసీ వేణుగోపాల్ సమావేశం కానున్నారు. అనంతరం పొత్తుపై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. 

కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని ఇప్పటికే లెఫ్ట్ పార్టీలు కలిసి తీర్మానం చేసుకున్నాయి. దీంతో ఆ పార్టీలకు మిర్యాలగూడ, మునుగోడు, కొత్తగూడెం, భద్రాచలం టికెట్లను కాంగ్రెస్ కన్ఫామ్ చేసినట్లు ఇటీవల జోరుగా వార్తలొచ్చాయి. కానీ ఈ వార్తలను వామపక్ష నేతలు పూర్తిగా ఖండించారు. కాంగ్రెస్‌తో పొత్తు ఇంకా కుదరలేదని, చర్చలు మాత్రమే జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో కాంగ్రెస్‌తో వామపక్ష పార్టీలు కలిశాయి. దీంతో రాష్ట్రంలో కూడా లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. కానీ కొంతమంది నేతలు మాత్రం వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వామపక్షాలతో రేపు వేణుగోపాల్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీ తర్వాత తెలంగాణలో పొత్తులపై క్లారిటీ రానుంది. రాష్ట్రంలో దాదాపు 10 స్థానాల్లో వామపక్షాలకు బలమైన క్యాడర్ ఉంది. దీంతో ఆ పార్టీలతో పొత్తు వల్ల కొన్ని స్థానాల్లో లాభం జరుగుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
BSNL Best Prepaid Plan: జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
BSNL Best Prepaid Plan: జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
Embed widget