అన్వేషించండి

Telangana Congress: టీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలకు ముహూర్తం ఫిక్స్, ఎప్పుడంటే?

Telangana Congress: టీ కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటనకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారు అయింది. ఈ నెల 15వ తేదీ తర్వాత జాబితాను విడుదల చేయనున్నట్లు మురళీధరన్ స్పష్టం చేశారు.

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటనపై కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్ క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 15 తర్వాత టీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని, రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. 70 సీట్లపై ఇవాళ చర్చ జరిగిందని,  కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ మరోసారి భేటీ అవుతుందని తెలిపారు. వామపక్షాలతో పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని, అభ్యర్థుల ఎంపికలో నేతల మధ్య ఎలాంటి విబేధాలు లేవని అన్నారు. కాంగ్రెస్‌లోకి చాలామంది వస్తున్నారని, ఒకరిద్దరు వెళ్లిపోయినా తాము బాధపడమని మురళీధరన్ తెలిపారు.

వెళ్లిపోయే వాళ్లపై తాము స్పందించమని, పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేయడంపై తమ పార్టీ వాళ్లు మాట్లాడరని మురళీధరన్ చెప్పారు. లిస్ట్ ఇంకా రాకముందే పొన్నాల ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. గెలుపు అవకాశాలు, విధేయత ఆధారంగా అభ్యర్థులను నిర్ణయిస్తామని, ఇప్పటివరకు 70 సీట్లతో జాబితా సిద్దంగా ఉందని అన్నారు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ త్వరలో మరోసారి సమావేశమై మిగిలిన అభ్యర్థుల ఎంపిక పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. మిత్రపక్షాలతో చర్చలు జరుగుతున్నాయని, చర్చల అనంతరం పూర్తి జాబితా ఒకేసారి ప్రకటిస్తామని అన్నారు. ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ప్రకారమే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, మైనార్టీలు, మహిళలు, బీసీలకు తగిన ప్రాధాన్యత ఇస్తామని మరళీధరన్ పేర్కొన్నారు.

బస్సు యాత్రకు ముందు అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని, వామపక్షాలతో సంప్రదింపులు జరిపిన తర్వాత అభ్యర్థుల జాబితా ఉంటుందని మురళీధరన్ తెలిపారు. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అయింది. దాదాపు రెండున్నర గంటల పాటు సమావేశమైంది. ఈ మీటింగ్‌లో 119 నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసింది. వివిధ సర్వే రిపోర్టులు, సామాజిక అంశాల ఆధారంగా టికెట్లను కేటాయించడంపై చర్చలు జరిపింది. అటు పొత్తులపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో వామపక్షాలను కలుపుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. కానీ వామపక్షాలతో పొత్తు వద్దని టీ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రేపు ఉభయ కమ్యూనిస్టు నేతలతో కేసీ వేణుగోపాల్ సమావేశం కానున్నారు. అనంతరం పొత్తుపై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. 

కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని ఇప్పటికే లెఫ్ట్ పార్టీలు కలిసి తీర్మానం చేసుకున్నాయి. దీంతో ఆ పార్టీలకు మిర్యాలగూడ, మునుగోడు, కొత్తగూడెం, భద్రాచలం టికెట్లను కాంగ్రెస్ కన్ఫామ్ చేసినట్లు ఇటీవల జోరుగా వార్తలొచ్చాయి. కానీ ఈ వార్తలను వామపక్ష నేతలు పూర్తిగా ఖండించారు. కాంగ్రెస్‌తో పొత్తు ఇంకా కుదరలేదని, చర్చలు మాత్రమే జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో కాంగ్రెస్‌తో వామపక్ష పార్టీలు కలిశాయి. దీంతో రాష్ట్రంలో కూడా లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. కానీ కొంతమంది నేతలు మాత్రం వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వామపక్షాలతో రేపు వేణుగోపాల్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీ తర్వాత తెలంగాణలో పొత్తులపై క్లారిటీ రానుంది. రాష్ట్రంలో దాదాపు 10 స్థానాల్లో వామపక్షాలకు బలమైన క్యాడర్ ఉంది. దీంతో ఆ పార్టీలతో పొత్తు వల్ల కొన్ని స్థానాల్లో లాభం జరుగుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget