అన్వేషించండి

Revanth Reddy About KCR: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కేసీఆర్‌కు ఇష్టం లేదు- సీఎం రేవంత్ రెడ్డి సంచలనం

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి మాజీ సీఎం కేసీఆర్ పార్టీ సిద్ధంగా లేదని, మా నిర్ణయాన్ని స్వాగతించింటే కేసీఆర్ పెద్దరికం పెరిగేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

42 percent reservation for BCs | హైదరాబాద్: బీసీలకు జనాభా ఆధారంగా న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించాలన్నది తెలంగాణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. విద్యా, ఉద్యోగ అవకాశాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడంతోపాటు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా 42 శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు ప్రభుత్వం ఇప్పటికే రెండు బిల్లులను అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్‌కు పంపినట్టు తెలిపారు. అయితే, రాష్ట్ర గవర్నర్‌ ఆ బిల్లులను ఆమోదించకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి పంపారని వెల్లడించారు. ఆ రిజర్వేషన్ బిల్లులు గత ఐదు నెలలుగా రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నాయని రేవంత్ రెడ్డి వివరించారు. 

పురపాలక, పంచాయతీరాజ్‌ చట్టాలలో సవరణలపై శాసనసభలో చర్చ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. " బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్ధంగా లేరని, వందేళ్లుగా చేయని పనిని మేం చేస్తున్నందుకు మమ్మల్ని అభినందించి ఉంటే కేసీఆర్ పెద్దరికం పెరిగి ఉండేదని వ్యాఖ్యానించారు. మీరు చేసిన తప్పులకు ప్రజలు ఇప్పటికే శిక్ష విధించారని, అయినా మారకపోతే ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా కూడా మిగల్చరని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

గుదిబండగా మారిన బీఆర్ఎస్ తెచ్చిన చట్టం

స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం అవుతున్నాయన్న కారణంతో కొందరు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు జరిపేందుకు ఆదేశించడంతో పాటు, రిజర్వేషన్లను నిర్ణయించాలని సైతం స్పష్టం చేసింది. 2018లో కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన పంచాయతీరాజ్ చట్టం, 2019లో వచ్చిన మున్సిపల్ చట్టం ప్రకారం 50 శాతం రిజర్వేషన్ పరిమితి ఉంది. బీఆర్ఎస్ తెచ్చిన చట్టమే నేడు వెనుక బడిన తరగతుల వారికి గుదిబండగా మారింది. ఈ చట్టాల్లో స్పష్టత లేకపోవడంతో మేము ఆర్డినెన్స్‌ తీసుకొచ్చాం. అయితే, గవర్నర్ ఆ ఆర్డినెన్స్‌ను అమలు చేయడానికి బదులుగా రాష్ట్రపతికి పంపారు. బీఆర్ఎస్ నేతలు గవర్నర్‌ను తప్పుదోవ పట్టించడం వల్లే ఇది జరిగిందని’ అన్నారు.

రిజర్వేషన్లు పెంచడం కేసీఆర్‌కు ఇష్టం లేదన్న రేవంత్ రెడ్డి 
"బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ఢిల్లీలో అఖిలపక్షాన్ని సమీకరించలేదు. మేము ఐదు సార్లు ఈ విషయంలో ప్రధానిని కోరుతూ లేఖలు రాశాం, కానీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. దాంతో జంతర్‌మంతర్‌లో ధర్నా చేశాం. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి 100 మంది ఎంపీలు మద్దతు ఇచ్చారు. కానీ, బీఆర్ఎస్‌ రాజ్యసభ ఎంపీలు స్పందించలేదు. గంగుల కమలాకర్‌ కూడా హాజరుకాలేదు. వారి పార్టీ నేత బలహీనవర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఇవాళ కూడా సభలో గందరగోళం సృష్టిస్తూ బిల్లు ఆమోదం పొందకుండా అడ్డుకుంటున్నారు. ప్రజలే అధికారానికి అధారం. మేము ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాం. సహకరించకపోతే, ప్రజలే మీకు సరైన బుద్ధి చెబుతారు" అని సీఎం రేవంత్‌ రెడ్డి హితవు పలికారు.

కొన్ని పార్టీలు అసత్య ప్రచారంతో బలహీన వర్గాలలో అనుమానాలు కలిగించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ సభను వేదికగా చేసుకొని బలహీన వర్గాల హక్కులను దెబ్బతీయడం సరైంది కాదు. గంగుల కమలాకర్ తప్పుడు సమాచారం ఇవ్వడం బాధాకరం. ప్రజల్లో అపోహలు కలగకుండా జాగ్రత్త వహించాలి. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల సాధనకు తీసుకున్న చర్యలను సీఎం ఈ సందర్భంగా వెల్లడించారు.

"మొదట బీసీ కమ్యూనిటీ వివరాల సేకరణ బాధ్యతను రాష్ట్ర బీసీ కమిషన్‌కు అప్పగించాం. బీసీ కమిషన్ ద్వారా కాకుండా ప్రత్యేకంగా డెడికేషన్ కమిషన్ ద్వారా సమాచార సేకరణ జరగాలని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య హైకోర్టులో రిట్ పిటిషన్ (నెం. 30381/2024) వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వానికి డెడికేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు వచ్చిన వెంటనే ప్రభుత్వంగా చిత్తశుద్ధితో స్పందించి కమిషన్‌ను ఏర్పాటు చేశాం" అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ఆ రాష్ట్రాల తరహాలో సమస్యలు రావొద్దు

డెడికేషన్ కమిషన్ ఆధ్వర్యంలో కుల సర్వేను సమగ్రంగా నిర్వహించి, బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా చర్యలు తీసుకున్నట్టు సీఎం వెల్లడించారు. బీహార్, రాజస్థాన్‌లలో రిజర్వేషన్ల అమలులో ఎదురైన అడ్డంకులను గమనించి, "అలాంటి సమస్యలు తెలంగాణలో రాకూడదన్నదే మా దృష్టి. అందుకే అధికారుల కమిటీలు, మంత్రులు వెళ్లి ఇతర రాష్ట్రాల అనుభవాలను అధ్యయనం చేశారు" అని వివరించారు. న్యాయపరమైన పరిణామాలను విశ్లేషించిన తరువాతనే డెడికేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

"ఈ ప్రక్రియను 2024 ఫిబ్రవరి 4న ప్రారంభించి, ఈ ఫిబ్రవరి 4న పూర్తి చేశాం. కేవలం 365 రోజుల్లో చట్టబద్ధంగా ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాం. ఇప్పుడు స్థానిక సంస్థల్లో బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని మే చిత్తశుద్ధితో పని చేస్తున్నాం" అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
HYDRA Ranganath: హైడ్రా చుట్టూ వివాదాల వలయం - హైకోర్టు ఆదేశాలనూ లెక్క చేయడం లేదా? ఆర్మీ జోక్యం ఎందుకు?
హైడ్రా చుట్టూ వివాదాల వలయం - హైకోర్టు ఆదేశాలనూ లెక్క చేయడం లేదా? ఆర్మీ జోక్యం ఎందుకు?
Breaking News: మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు..!
మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు..!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: YS Jagan సూటి ప్రశ్న
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: వైఎస్ జగన్ ప్రశ్న
Revanth Reddy: ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
IND VS ZIM 2nd T20 Result Update: శ్రేయ‌స్ ఖాతాలో తొలి సిరీస్.. రెండో టీ20లో జింబాబ్వే చిత్తు, స‌త్తా చాటిన ఇషాన్, తిల‌క్, అభిషేక్, య‌శ్, ప్రిన్స్
శ్రేయ‌స్ ఖాతాలో తొలి సిరీస్.. రెండో టీ20లో జింబాబ్వే చిత్తు, స‌త్తా చాటిన ఇషాన్, తిల‌క్, అభిషేక్ శర్మకు 3 వికెట్లు
Dharmendra Pradhan Resignation Reasons: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
Pawan Kalyan Seed Balls: డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
Dharmendra Pradhan Resignation News: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
Azadi 501 Series Trailer : ఇండియాస్ బిగ్గెస్ట్ టెక్ స్కామ్ సిరీస్ - ఇంట్రెస్టింగ్‌గా ఆజాదీ 501 ట్రైలర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఇండియాస్ బిగ్గెస్ట్ టెక్ స్కామ్ సిరీస్ - ఇంట్రెస్టింగ్‌గా ఆజాదీ 501 ట్రైలర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Team India Equals Own World Record :  వ‌ర‌ల్డ్ రికార్డును స‌మం చేసిన టీమిండియా.. అత్య‌ధిక సార్లు ఆ ఘ‌న‌తను సాధించిన జ‌ట్టుగా శ్రేయ‌స్ సేన‌.. పొట్టి ఫార్మాట్లో అత్య‌ధికంగా..
వ‌ర‌ల్డ్ రికార్డును స‌మం చేసిన టీమిండియా.. అత్య‌ధిక సార్లు ఆ ఘ‌న‌తను సాధించిన జ‌ట్టుగా శ్రేయ‌స్ సేన‌.. పొట్టి ఫార్మాట్లో అత్య‌ధికంగా..
Embed widget