అన్వేషించండి

Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ ముందుకు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్, పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లు

Debate on Project panchayatraj amendment act 2025 | పురపాలక, పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టి స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

Telangana Assembly Sessions | హైదరాబాద్‌: తెలంగాణలో శాసనసభ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు, అవకతవకలపై వాస్తవాలు తేల్చేందుకు తాము ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను తెలంగాణ ప్రభుత్వం ఆదివారం నాడు సభలో ప్రవేశపెట్టింది. సభకు హాజరైన ఎమ్మెల్యేలకు జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదిక పెన్‌డ్రైవ్‌లో ఇచ్చారు.

మృతిచెందిన నేతలకు సభ సంతాపం

ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారు రాజిరెడ్డి మృతిపట్ల సభ సంతాపం తెలిపింది. 2009 నుంచి 2014 వరకు ఉప్పల్ ఎమ్మెల్యేగా చేశారు. కాప్రా మున్సిపాలిటీ చైర్మన్‌గా సైతం ఆయన సేవలు అందించారు. 2012లో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులుగా చేశారు. మే 8న బండారు రాజిరెడ్డి కన్నుమూశారని తెలిసిందే. ఖమ్మం జిల్లా వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ సభ సంతాపం తెలిపింది. మాజీ ఎమ్మెల్యే మృపట్ల సభ్యులు ప్రగాడ సానుభూతి తెలిపారు. గతంలో ఆయన ప్రభుత్వ టీచర్‌గా చేశారు. ఎంపీటీసీగా, సర్పంచ్, ఎమ్మెల్యేగా సేవలు అందించారు.

బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం..

పురపాలక, పంచాయతీరాజ్‌ చట్టసవరణ బిల్లుతో పాటు అల్లోపతిక్‌ ప్రైవేట్‌ మెడికల్‌ కేర్‌ (Medical Care) ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. తెలంగాణ పురపాలక చట్టం 2019 నిబంధన సవరణ బిల్లుపై సభలో చర్చ ప్రారంభించారు. దీనిపై చర్చ జరుగుతున్నందున ఆర్డినెన్స్‌ కుదరదని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. పురపాలక చట్టం 2019 నిబంధన సవరణ చట్టం తెచ్చినట్లు ఆయన చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. రిజర్వేషన్లలో 50 శాతం పరిమితిని ఎత్తివేస్తూ రాష్ట్ర కేబినెట్ శనివారం నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జీవో జారీ చేస్తామని  పేర్కొన్నారు. ఈ మార్పుల కోసమే పురపాలక, పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లు తెచ్చినట్లు తెలిపారు.

సమగ్ర సర్వే నివేదిక, ఏకసభ్య కమిషన్ సిఫార్సులతో నిర్ణయం

మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ‘హైదరాబాద్ మేయర్, డిప్యూటీ మేయర్ సహా మున్సిపాలిటీలలో పదవుల్లో ఎస్సీ, ఎస్టీలు, ఇతర వెనుకబడిన జాతులకు సీట్లు కేటాయించడం, మూడో వంతు సీట్లు మహిళలకు కేటాయించాలని పురపాలక, పంచాయతీరాజ్ చట్టసవరణ బిల్లు 2025 తీసుకొచ్చాం. రాష్ట్ర జనాభా ఆధారంగా ఆయా కులాలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ సమగ్ర సర్వే విషయాలను పరిగణనలోకి తీసుకుని వారికి తగిన ప్రాతినిథ్యం కల్పిస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేక కమిషన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2024లో చేసిన సీపెక్, సమగ్ర సర్వేను లోతుగా విశ్లేషించి ఏర్పాటు చేసిన ఏక సభ్య కమిషన్ వెనుకబడిన తరగతుల వెనుకబాటు కొనసాగుతుందని తెలిపింది. అందుకే వెనుకబడిన తరగతులకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని సిఫారసు చేసింది. 

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం పురపాలికలు, మున్సిపాలిటీలు, స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతులకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సైంటిఫిక్ సర్వే చేసి రిజర్వేషన్లు కల్పిస్తున్నాం. బలహీనవర్గాలకు రిజర్వేషన్లు కల్పించి వారి అభ్యున్నతికి పాటుపడదాం. ఇతర సభ్యులు తమ విలువైన సూచనలు ఇస్తే వాటని పరిశీలిస్తామని’ చెప్పారు.

విపక్షాలు అభ్యంతరం..

6 నెలల్లోనే బీసీ రిజర్వేషన్లు అమలు ఎందుకు చేయకపోయారని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు. బీసీలకు రిజర్వేషన్లు వస్తే సంతోషించే తొలి వ్యక్తిని తానేనన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలిపిన తాము అఖిలపక్షం ఏర్పాటు చేసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని చెబితే ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. మంత్రి శ్రీధర్ బాబుకు వాస్తవాలు తెలియవు అని విమర్శించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

India Monsoon Delay 2026:వాన కోసం ఎదురు చూడాల్సిందే! నైరుతి రుతుపవనాల రాక ఎప్పుడు? వాతావరణ శాఖ ఏమంటోంది? 
వాన కోసం ఎదురు చూడాల్సిందే! నైరుతి రుతుపవనాల రాక ఎప్పుడు? వాతావరణ శాఖ ఏమంటోంది? 
Kavitha Politics: ఈసారి పళ్లు రాలగొడతాం, విగ్రహాలు పగలగొట్టి ఆంధ్రకు పార్సిల్ చేస్తాం: కవిత వార్నింగ్
ఈసారి పళ్లు రాలగొడతాం, విగ్రహాలు పగలగొట్టి ఆంధ్రకు పార్సిల్ చేస్తాం: కవిత వార్నింగ్
Kalvakuntla Kavitha: జగన్ MAVIGUN బాంబు! ఏపీ సీఎం సీటు కిందకు నీళ్లు రాకుండా చూసుకో: కవిత సంచలన వ్యాఖ్యలు
జగన్ MAVIGUN బాంబు! ఏపీ సీఎం సీటు కిందకు నీళ్లు రాకుండా చూసుకో: కవిత సంచలన వ్యాఖ్యలు
Indiramma Housing Scheme: లక్ష ఇండ్లకు సామూహిక గృహప్రవేశాలు.. నేడు ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
లక్ష ఇండ్లకు సామూహిక గృహప్రవేశాలు.. నేడు ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
Masterplan Behind RCB's IPL 2026 Victory | ఆర్సీబీ విజయానికి కారణం ఇదే
Reason for GT Lost The IPL 2026 Final | గుజరాత్ పతనం వెనుక అసలు నిజాలు
RCB Celebrations With Family IPL 2026 | ఫ్యామిలీతో ఆర్సీబీ ప్లేయర్స్ సెలబ్రేషన్
RCB Wins IPL 2026 Final | రెండోసారి ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకున్న ఆర్సీబీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Rajya Sabha Seat Congress: షర్మిలకు రాజ్యసభ - కాంగ్రెస్ గేమ్‌ ప్లాన్‌ ఏంటి? జగన్‌కు చెక్ పెట్టడానికా.. లేక దోస్తీకా?
షర్మిలకు రాజ్యసభ - కాంగ్రెస్ గేమ్‌ ప్లాన్‌ ఏంటి? జగన్‌కు చెక్ పెట్టడానికా.. లేక దోస్తీకా?
EPFO 3.0 PF withdrawal via ATM:ఏటీఎం నుంచి పీఎఫ్‌ విత్‌డ్రా చేస్తే పింఛన్ తగ్గుతుందా?
ఏటీఎం నుంచి పీఎఫ్‌ విత్‌డ్రా చేస్తే పింఛన్ తగ్గుతుందా?
Rains In AP and Telangana: ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలుచోట్ల వర్షాలు.. అక్కడ పిడుగుల వార్నింగ్
ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలుచోట్ల వర్షాలు.. అక్కడ పిడుగుల వార్నింగ్
ABP India at 2047: అభివృద్ధి చెందిన భారత్ దిశగా అడుగులు.. జూన్ 3న ఏబీపీ నెట్‌వర్క్ ఇండియా @ 2047 కాన్‌క్లేవ్
అభివృద్ధి చెందిన భారత్ దిశగా అడుగులు.. జూన్ 3న ఏబీపీ నెట్‌వర్క్ ఇండియా @ 2047 కాన్‌క్లేవ్
Maruti Suzuki May Sales Record: అద‌ర‌గొట్టిన మారుతి సుజుకి.. మేలో ఆల్ టైమ్ హైయెస్ట్ మంత్లీ సేల్స్ తో సరికొత్త రికార్డ్
అద‌ర‌గొట్టిన మారుతి సుజుకి.. మేలో ఆల్ టైమ్ హైయెస్ట్ మంత్లీ సేల్స్ తో సరికొత్త రికార్డ్
Shocking FASTag Scam: ఫాస్ట్‌ట్యాగ్ స్కామ్ పై మున్నాభాయ్ యాక్టర్ అశ్విన్ ముష్రాన్ సంచలన పోస్ట్: అకౌంట్ లో రూ. 3000 ఉన్నా రూ. 200 పెనాల్టీ.. 
ఫాస్ట్‌ట్యాగ్ స్కామ్ పై మున్నాభాయ్ యాక్టర్ అశ్విన్ ముష్రాన్ సంచలన పోస్ట్: అకౌంట్ లో రూ. 3000 ఉన్నా రూ. 200 పెనాల్టీ.. 
Dhurandhar Washma Butt Chai Shop Real Location: ధురంధర్‌ సినిమా ఎఫెక్ట్‌! లడఖ్‌లో టీ కొట్టు కిటకిట! అసలు రీజన్ ఏంటంటే?
ధురంధర్‌ సినిమా ఎఫెక్ట్‌! లడఖ్‌లో టీ కొట్టు కిటకిట! అసలు రీజన్ ఏంటంటే?
India Monsoon Delay 2026:వాన కోసం ఎదురు చూడాల్సిందే! నైరుతి రుతుపవనాల రాక ఎప్పుడు? వాతావరణ శాఖ ఏమంటోంది? 
వాన కోసం ఎదురు చూడాల్సిందే! నైరుతి రుతుపవనాల రాక ఎప్పుడు? వాతావరణ శాఖ ఏమంటోంది? 
Embed widget