అన్వేషించండి

Telangana CEO Vikas Raj: నేడు తెలంగాణలో 38 కేసులు నమోదు, భారీ బందోబస్తుతో స్ట్రాంగ్ రూమ్స్‌కు ఈవీఎంలు: వికాస్ రాజ్

Telangana CEO Vikas Raj | తెలంగాణలో సాయంత్రం 5 గంటల వరకు 61.16 శాతం ఓటింగ్ నమోదైంది. ఇంకా క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఓటింగ్ శాతం మరింత పెరగనుంది.

Telangana Elections 2024 Polling percentage | హైదరాబాద్: తెలంగాణలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరిగింది. సమస్యాత్మక ప్రాంతాలు 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన తరువాత తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని, శాంతి భద్రత సమస్యలు తలెత్తలేదని చెప్పారు. ఎన్నికల సందర్భంగా తలెత్తిన ఘటనలు, ఫిర్యాదులతో సోమవారం 38 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఓటింగ్ ముగిసిన తరువాత ఈవీఎంలను రాత్రి ఒకటి, రెండు గంటల వరకు తరలించి భద్రపరచనున్నట్లు తెలిపారు. ఒకవేళ పోలింగ్ కేంద్రం వద్దే కౌంటింగ్ సెంటర్ ఉన్నట్లయితే అక్కడే స్ట్రాంగ్ రూమ్ లకు ఈవీఎంలు తరలిస్తామన్నారు.

వికాస్ రాజ్ ఇంకా మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో ఓటర్ల నుంచి మంచి స్పందన వచ్చింది. గత ఐదారు నెలలుగా సిబ్బంది ఎన్నికల ప్రక్రియను నిర్వహించి తమ బాధ్యతల్ని విజయవంతంగా పూర్తి చేశారు. భారీ బందోబస్తుతో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ లకు తరలించి భద్రపరచనున్నారు. పోలింగ్ శాతం ఎంత నమోదు అవుతుందో ఇప్పుడే చెప్పలేం. ఈరోజు అర్ధరాత్రి లేక మంగళవారం ఉదయం పోలింగ్ శాతంపై క్లారిటీ వస్తుంది. గతంలోలాగే హైదరాబాద్ లో ఈ ఎన్నికల్లోనూ అతి తక్కువ శాతం పోలింగ్ నమోదైనట్లు’ పేర్కొన్నారు. 

మధ్యాహ్నం నుంచి ఓటింగ్ కేంద్రాలకు పోటెత్తారు..
మధ్యాహ్నం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు అధికంగా వచ్చారు. ఈవీఎంలలో సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించాం. మంగళవారం ఉదయం 11 గంటలకు స్క్రూటినీ చేసిన తరువాత రీ పోలింగ్ అవసరమా లేదా తేలుతుంది. అత్యధికంగా మెదక్ లో 71.33 శాతం, అత్యల్పంగా హైదరాబాద్ లో 39.17 శాతం పోలింగ్ జరిగిందన్నారు. పోలింగ్ శాతంపై మంగళవారం స్పష్టత వస్తుందన్నారు. 

మార్చి నుంచి ఇప్పటివరకూ రూ.330 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఈసీఐ పోర్టల్ ద్వారా 415 ఫిర్యాదులు రాగా, 1950 టోల్ ఫ్రీ ద్వారా 21 ఫిర్యాదులు, సీ విజిల్ ద్వారా 225 ఫిర్యాదులు వచ్చాయన్నారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
Breaking News: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
Revanth Reddy: హిట్లర్ స్ఫూర్తితోనే హైడ్రా - దక్షిణాదికి బీజేపీ అన్యాయం - రేవంత్ సంచలన వ్యాఖ్యలు
హిట్లర్ స్ఫూర్తితోనే హైడ్రా - దక్షిణాదికి బీజేపీ అన్యాయం - రేవంత్ సంచలన వ్యాఖ్యలు

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War Latest News: ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Kalvakuntla Kavitha: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
Jayamundi Bhayamela Manasa OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
IND VS AFG 1st Test Day 1 Update: తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
Chiranjeevi : మెగా 158లో కూలీ లేడీ విలన్ - క్రేజీ ఆఫర్ కొట్టేసిన కన్నడ బ్యూటీ
మెగా 158లో కూలీ లేడీ విలన్ - క్రేజీ ఆఫర్ కొట్టేసిన కన్నడ బ్యూటీ
Andhra Pradesh Rains: ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం
ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం
Embed widget