అన్వేషించండి

Breaking News: మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా సెప్టెంబరు 21న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

LIVE

Key Events
Breaking News: మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

Background

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా సెప్టెంబరు 21న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

20:34 PM (IST)  •  21 Sep 2021

పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటన

ఏపీ ప్రభుత్వం పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించింది. వచ్చే నెల 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు మొత్తం 6 రోజులు సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 9 రెండో శనివారం, 10 ఆదివారం, 17వ తేదీ ఆదివారం కావడంతో మొత్తం 9 రోజులు దసరా సెలవులు. తిరిగి పాఠశాలలను 18వ తేదీన తెరుస్తారు. 

20:11 PM (IST)  •  21 Sep 2021

కార్వీ కేసులో మరో అరెస్టు

కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ కేసులో హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పెట్టుబడిదారుల షేర్లను 9 డొల్ల కంపెనీలకు మళ్లించినట్లు సీసీఎస్ పోలీసుల దర్యాప్తులో తేలింది. సెబీకి సమాచారం ఇవ్వకుండా షేర్లు బ్యాంకుల్లో తనఖా పెట్టి దాదాపు రూ.1,500 కోట్లు కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ రుణంగా తీసుకుంది. బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను వైస్ ప్రెసిడెంట్ శ్రీకృష్ణ 9 డొల్ల కంపెనీలకు మళ్లించినట్లు సీసీఎస్ పోలీసులు గుర్తించారు. ఈ మేరకు శ్రీకృష్ణను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ఇప్పటికే కార్వీ సంస్థ ఛైర్మన్ పార్థసారథి, సీఈవో కృష్ణహరి, సీవోవో రాజీవ్ సింగ్‌తో పాటు కంపెనీ సెక్రటరీ శైలజను అరెస్టు చేశారు. 

20:04 PM (IST)  •  21 Sep 2021

మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణలోని మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మద్యం దుకాణాల్లో గౌడ కులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం దుకాణాలను ప్రభుత్వం కేటాయించింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 2021-23 సంవత్సరాలకు ఈ రిజర్వేషన్లు అమల్లో ఉండనున్నాయి.

18:34 PM (IST)  •  21 Sep 2021

ఆ ముగ్గురు కళాకారులకు రూ.10 వేల పింఛన్ 

ప్రముఖ కళాకారులు గుస్సాడీ కనక రాజ్, దర్శనం మొగిలయ్య, భరత్ భూషణ్ లకు నెలకు పది వేల ఆర్థిక సహాయం అందించనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు 2021 జూన్ నుండి నగదు మొత్తాన్ని రాష్ట్ర సాంస్కృతిక శాఖ విడుదల చేసింది. ఈ ముగ్గురి కళాకారులకు ప్రత్యేకంగా జీవితాంతం నెలకు రూ.10 వేలు అందిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి నెలకు పది వేల రూపాయల చొప్పున ప్రత్యేక పింఛనులను విడుదల చేసినట్టు సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తెలిపారు.

 

18:20 PM (IST)  •  21 Sep 2021

కేటీఆర్ పరువునష్టం దావా కేసులో మధ్యంతర ఉత్తర్వులు జారీ

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్‌ వేసిన పరువునష్టం దావాపై సిటీ సివిల్‌ కోర్టులో విచారణ ముగిసింది. పరువు నష్టం దావాలో ఇంజక్షన్ ఆర్డర్‌పై వాదనలు ముగిశాయి. కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. డ్రగ్స్‌ కేసుతో ముడిపెట్టి రేవంత్‌రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ పిటిషన్‌ లో పేర్కొన్నారు. తప్పుడు ఆరోపణలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.  ఈ కేసులో రేవంత్ రెడ్డికి నోటీసులు జారీచేసింది. డ్రగ్స్ కేసుకు సంబంధించి కేటీఆర్ పై వ్యాఖ్యలు చేయొద్దని తెలిపింది. 

16:33 PM (IST)  •  21 Sep 2021

ములుగు ఎమ్మెల్యే సీతక్కకు అస్వస్థత

 ములుగు ఎమ్మెల్యే సీతక్క అస్వస్థతకు గురయ్యారు. బీపీ పడిపోవడంతో ఆమె కళ్లు తిరిగి కిందపడిపోయారు. వెంటనే అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు సీతక్కను ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెకు ప్రథమ చికిత్స అందించారు. వైద్యులు సీతక్కకు వైద్యం అందించిన తర్వాత ఆమె కాస్త కుదుటపడ్డారు. 

15:22 PM (IST)  •  21 Sep 2021

రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద టీఆర్ఎస్, కాంగ్రెస్‌ కార్యకర్తల బాహాబాహీకి దిగారు. రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్‌ శ్రేణులు కర్రలు విసిరారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. రాళ్లు, కర్రలతో ఇరు పార్టీల కార్యకర్తలు దాడిచేసుకున్నారు. 

14:56 PM (IST)  •  21 Sep 2021

వైఎస్ షర్మిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ బోడుప్పల్‌లోని ఎగ్జిబిషన్‌ మైదానంలో నిరుద్యోగ దీక్ష చేపట్టారు. వైఎస్‌ షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను మేడిపల్లి పోలీసుస్టేషన్‌కు తరలించారు. షర్మిల దీక్షకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. షర్మిల అరెస్టును నిరసిస్తూ కార్యకర్తలు అడ్డుపడటంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

13:27 PM (IST)  •  21 Sep 2021

భూములు రిజిస్టర్ కాకుండా కలెక్టర్ ఏమైనా జీవో ఇచ్చారా?: జేసీ ప్రభాకర్ రెడ్డి


అనంతపురం జిల్లా తాడిపత్రి సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి... అధికారులతో వాగ్వాదానికి దిగారు. చాలా మంది పేద రైతులు వ్యవసాయం చేయలేక భూములు అమ్ముతున్నారని దానిని కూడా అడ్డుకుంటే ఎలా అంటూ అధికారులను ప్రశ్నించారు. పేద రైతుల కోసం ఎంతవరకైనా పోరాడుతానని జెసీ స్పష్టం చేశారు. తాడిపత్రి మండలం తెరన్నపల్లి  భూములు రిజిస్టర్ కావాలంటే ఈవోఆర్ డీ కి ఎకరాకు మూడు లక్షల డబ్బు ఇవ్వాల్సిందే అని చెప్పారని, డబ్బులు ఇవ్వకుంటే రిజిస్ట్రేషన్ జరుగకుండా చేస్తానని ఈవో ఆర్ డి భూమి యజమానులను బెదిరించారని అన్నారు. భూములు రిజిస్టర్ కాకుండా కలెక్టర్ ఏమైనా  జీవో ఇచ్చారా అని జేసీ ప్రశ్నించారు.

11:50 AM (IST)  •  21 Sep 2021

షర్మిల దీక్ష వద్ద కూలీల ఆందోళన

మేడ్చల్‌ జిల్లా పీర్జాదిగూడలో షర్మిల నిరుద్యోగ దీక్ష ఇవాళ జరగనున్న సంగతి తెలిసిందే. ఆ ప్రదేశంలో కొంత మంది కూలీలు ఆందోళనకు దిగారు. షర్మిల చేపట్టనున్న దీక్షకు తమను తీసుకొచ్చి డబ్బు ఇవ్వట్లేదని వారు ఆరోపించారు. దీక్షలో కూర్చుంటే రూ.400 ఇస్తామని చెప్పి తమను పిలుచుకొని వచ్చారని, ఇప్పుడు ఆ డబ్బు ఇవ్వడం లేదని నిరసన చేశారు. ఇవాళ పీర్జాదిగూడలో షర్మిల చేపట్టబోయే నిరసన దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వని సంగతి తెలిసిందే.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: తెలంగాణ ప్రజలకు అలర్ట్ - భానుడి ఉగ్రరూపం, ఈ జిల్లాలో వడగాల్పులు
తెలంగాణ ప్రజలకు అలర్ట్ - భానుడి ఉగ్రరూపం, ఈ జిల్లాలో వడగాల్పులు
Chandrababu: 'రూ.10 ఇచ్చి రూ.100 లాగేస్తున్నారు' - 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి సీఎంను చూడలేదని చంద్రబాబు తీవ్ర విమర్శలు
'రూ.10 ఇచ్చి రూ.100 లాగేస్తున్నారు' - 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి సీఎంను చూడలేదని చంద్రబాబు తీవ్ర విమర్శలు
Andhra Pradesh: దటీజ్ సీఎం జగన్, రెండేళ్ల ముందే రాజ్యసభ అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ అధినేత
దటీజ్ సీఎం జగన్, రెండేళ్ల ముందే రాజ్యసభ అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ అధినేత
Revanth Reddy vs KTR: కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు! - ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్‌కు సిగ్గుండాలి! చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు - ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

CM Revanth Reddy on Phone Tapping | ఫోన్ ట్యాపింగు కేసులో KTR పై CM Revanth Reddy సంచలన వ్యాఖ్యలుKadiyam Srihari Joins Congress | కాంగ్రెస్ నేతలతో కడియం భేటీ..మరి పాతమాటల సంగతేంటీ.? | ABP DesamPrabhakar Chowdary Followers Angry | ప్రభాకర్ చౌదరికి టీడీపీ దక్కకపోవటంపై టీడీపీ నేతల ఫైర్ | ABPTDP Ex MLA Prabhakar Chowdary | అనంతపురం అర్బన్ టికెట్ దక్కకపోవటంపై ప్రభాకర్ చౌదరి ఆగ్రహం| ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: తెలంగాణ ప్రజలకు అలర్ట్ - భానుడి ఉగ్రరూపం, ఈ జిల్లాలో వడగాల్పులు
తెలంగాణ ప్రజలకు అలర్ట్ - భానుడి ఉగ్రరూపం, ఈ జిల్లాలో వడగాల్పులు
Chandrababu: 'రూ.10 ఇచ్చి రూ.100 లాగేస్తున్నారు' - 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి సీఎంను చూడలేదని చంద్రబాబు తీవ్ర విమర్శలు
'రూ.10 ఇచ్చి రూ.100 లాగేస్తున్నారు' - 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి సీఎంను చూడలేదని చంద్రబాబు తీవ్ర విమర్శలు
Andhra Pradesh: దటీజ్ సీఎం జగన్, రెండేళ్ల ముందే రాజ్యసభ అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ అధినేత
దటీజ్ సీఎం జగన్, రెండేళ్ల ముందే రాజ్యసభ అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ అధినేత
Revanth Reddy vs KTR: కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు! - ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్‌కు సిగ్గుండాలి! చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు - ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
Manchu Manoj Comments: ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Anantapur TDP: అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
Embed widget