అన్వేషించండి

Viral News: ‘హైదరాబాద్‌కు మారడం వల్ల నెలకు రూ.40 వేలు ఆదా చేస్తున్నా’, టెకీ ట్వీట్ వైరల్‌

Viral News: సిలికాన్ సిటీ బెంగళూరు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఐటీ పరిశ్రమకు దేశ రాజధానిగా వెలుగొందుతోంది. అక్కడ వాతావరణం, కల్చర్ అందరిని సులువుగా ఆకర్షిస్తాయి.

Viral News: సిలికాన్ సిటీ బెంగళూరు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఐటీ పరిశ్రమకు దేశ రాజధానిగా వెలుగొందుతోంది. అక్కడ వాతావరణం, కల్చర్ అందరిని సులువుగా ఆకర్షిస్తాయి. అయితే అక్కడ జీవన వ్యయం (కాస్ట్ ఆఫ్ లివింగ్) కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇంటి అద్దెల విషయానికి వస్తే చుక్కలు కనిపిస్తాయని తెలుస్తుంది. చిన్న సూది నుంచి ఇంట్లో కూరగాయల వరకు ప్రతీది అధిక ధరలు పలుకుతాయి. అరకొర ఆదాయంతో సామాన్య, సన్న, చిన్న ఉద్యోగాలు చేసేవారు బెంగళూరులో బ్రతకడం అంటే కష్టమనే చాలా మంద అంటారు.

బెంగుళూరులో ఐటీ పరిశ్రమ పుణ్యమా అంటూ ఇంటి అద్దె నుంచి మొదలు అన్నింటి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అదే భాగ్యనగరంలో అన్నీ అందుబాటులో ఉంటాయనే ప్రచారం సైతం బాగా జరుగుతోంది. తక్కువ ధరకే ఇళ్లు అద్దెకు దొరుకుతాయని, నిత్యాసరాలు తక్కువ ధరకు లభిస్తాయి. పైగా బెంగళూరు ఏమాత్రం తీసినపోని వసతులు ఉన్నాయి. ఐటీ పరిశ్రమతో పాటు, మెట్రో, ఇతర రవాణా సౌకర్యాలు ఉన్నాయి. బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్‌లో జీవన వ్యయం తగ్గడం, ఎక్కువగా ఆదా చేసుకునే అవకాశం ఉందని పలువురు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు.

ఇటీవల పృధ్వీ రెడ్డి అనే వ్యక్తి ఓ ఐటీ ఉద్యోగి బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు ఉద్యోగం మారాడు. ఫలితంగా రూ.40,000 ఆదా చేయగలుగుతున్నానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు బెంగళూరు, హైదరాబాద్ లను పోల్చుతూ తమ అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు. పృధ్వీ రెడ్డి (@prudhvir3ddy) తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో.. ఉద్యోగ రీత్యా కుటుంబాన్ని బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు మార్చినట్లు చెప్పారు. ఫలితంగా నెలకు రూ.40,000 ఆదా చేస్తున్నట్లు పేర్కొనడం వైరల్ అవుతోంది. ఆ డబ్బుతో ఓ ఫ్యామిలీ ప్రశాంతంగా జీవించవచ్చునని అతను చెప్పడం నెటిజన్లను ఆకర్షించింది. తాజాగా పృధ్వీ రెడ్డి తన పోస్టులో ‘బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు మారాం. నెలకు రూ.40 వేలు ఆదా అయ్యాయి. ఆ డబ్బుతో ఒక కుటుంబం ప్రశాంతంగా జీవించవచ్చు.’ అంటూ హైదరాబాద్ గురించి తన అభిప్రాయాన్ని షేర్ చేశారు. కొందరు అతను చెప్పినది నిజమేనని అంగీకరిస్తే మరికొందరు వ్యతిరేకించారు.

బెంగళూరులో జీవన వ్యయం చాలా ఎక్కువ అని ఇటీవల చాలా నివేదికలు తెలిపాయి. ఓ మధ్యతరగతి వ్యక్తి, బ్యాచిలర్‌ జీవించడానికి నెలకు రూ.25,000 కావాలని అంచాన వేసింది. జంటలకు అయితే రూ.50,000 ఉండాలని, నలుగురు అంతకంటే ఎక్కువమంది ఉంటే రూ.70,000 ఆదాయం కావాల్సిందేనట. ఇతర నగరాలతో పోలిస్తే ఈ ఖర్చు చాల ఎక్కువే. మధ్య తరగతి వారు ఉద్యోగ రీత్యా తామొక చోట.. తమ ఫ్యామిలీ ఒక చోట ఉంచే పరిస్థితి ఉండదు. కాబట్టి తమకు అనువుగా ఉన్న చోటకు షిఫ్ట్ అవ్వడం తప్ప వేరే మార్గం లేదు. బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కొంచెం తక్కువని కొన్ని సర్వేలు చెబుతున్నాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
Allu Cinemas: 'అల్లు సినిమాస్'లో అపశృతి... ప్రేక్షకులకు సినిమా మధ్యలో షాక్
'అల్లు సినిమాస్'లో అపశృతి... ప్రేక్షకులకు సినిమా మధ్యలో షాక్
TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Embed widget