అన్వేషించండి

Telangana Musi Project: ప్రభుత్వం వచ్చి రెండేళ్లయినా ముందడుగు పడని మూసి ప్రాజెక్ట్ - సీఎం రేవంత్ మాటలకే పరిమితమయ్యారా?

Musi project: తెలంగాణ మూసి ప్రాజెక్ట్ పరిస్థితి ఎక్కడిదక్కడే ఉంది. ఇతర దేశాల్లో నగరాల్లో పారే నదులను పరిశీలించి వచ్చినా పనులు మాత్రం పట్టాలెక్కలేదు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Telangana Musi project: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి రెండేళ్లు అవుతున్నా.. సీఎం రేవంత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టు ఇంకా మొదటి దశలోనే ఉంది. 2023 డిసెంబర్ 7న సీఎంగా  రేవంత్ రెడ్డి  బాధ్యతలు చేపట్టారు.  హైదరాబాద్ ను రివర్ సిటీగా మారుస్తామని లండన్, సియోల్ వంటి నగరాల్లో పర్యటించి వచ్చారు.  రెండేళ్లు గడుస్తున్నా ఈ ప్రాజెక్టుకు ఇంకా డీపీఆరే సిద్ధం కాలేదు.  

మురికి కాలువగా మారిన మూసీ నది 

మూసీ నది, హైదరాబాద్‌కు జీవనాధారం. కృష్ణా నదిలోకి కలిసే ఈ నది, 11వ శతాబ్దంలో కాకతీయుల కాలంలోనే ప్రసిద్ధి చెందింది. హైదరాబాద్ ఏర్పడినప్పటి నుంచి ఈ నది నగరం మధ్య నుంచి వెళ్తోంది. కానీ గత పాతికేళ్లుగా  కాలుష్యం, పట్టించుకోకపోవడం వల్ల ఇది  మురికి కాలువగా మారింది. 1997లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మూసీని కాంక్రీట్ డ్రైన్‌గా మార్చి, రివర్‌ఫ్రంట్ అభివృద్ధి చేసే ఆలోచన వచ్చింది. కానీ, అమలు కాలేదు.  2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత, కేసీఆర్ ప్రభుత్వం 2017 మార్చి 25న మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్  ను ఏర్పాటు చేసింది . ప్రీ-ఫీజిబిలిటీ స్టడీలు జరిగాయి, కానీ పెద్దగా అభివృద్ధి లేదు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ మూసీ ప్రక్షాళన ను ముఖ్య హామీగా చేసుకుంది. రేవంత్ రెడ్డి, సీయోల్ మోడల్‌తో మూసీని మార్చి, హైదరాబాద్‌ను ప్రపంచ నగరంగా చేస్తాం అని ప్రకటించారు. 

అధికారంలోకి రాగానే హడావుడి 

2023 డిసెంబర్ తర్వాత, ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకున్నట్లుగా కనిపించింది. 2024 జనవరి 2న, సీఎం రేవంత్ రెడ్డి HMDA  అధికారులతో సమీక్షలో 36 నెలల్లో మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధి చేయాలి  అని ఆదేశాలు జారీ చేశారు. అందులో పన్నెండు నెలలు గడిచిపోయాయి.  కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అసలు ప్లానేంటో కూడా ఎరికీ తెలియదు.  2024 అక్టోబర్‌లో 141 కోట్లతో 18 నెలల్లో DPR తయారు చేయాలని టెండర్ పిలిచారు.   DPR తర్వాత, 5 సంవత్సరాలు పెట్టుబడి సలహాలు ఇవ్వాలని ప్లాన్. 2025లో బడ్జెట్‌లో 1,500 కోట్లు కేటాయించారు. కానీ వాటితో ఏ పనులు చేయలేకపోయారు. 

కేంద్రం నిధులు ఇవ్వడం లేదని ఆరోపణలు   

ఇప్పటి వరకూ మూసీ నది ఒడ్డున  ప్రభుత్వ భూములను  MRDCLకు బదిలీ చేశారు  DPR ఇంకా పూర్తి కాలేదు . ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ నుంచి ఫండింగ్ ధృవీకరణ లేదు.  ఇంకా లిస్టెడ్  కాలేదు.   DPR లేకుండానే 734 ఎకరాల భూమి బదిలీ  చేశారు.    బ్యాంక్ లోన్లు వచ్చే వరకూ ప్రాజెక్టుకు ముందుకు తీసుకెళ్లడానికి ప్రబుత్వం వద్ద నిధులు లేవు.  కేంద్రం సహకరించడం లేదని ఆరోపణలు చేస్తున్నారు. మొత్తంగా, మూసీ ప్రాజెక్టు స్వప్నాలుతో మొదలై, వాస్తవాల వలయంలో చిక్కుకుంది. రెండేళ్లు గడిచినా, పారదర్శకత, పునరావాసం  అనే వాటిపై స్పష్టత లేదు.   కనీసం పనులు జరుగుతూ ఉంటే.. చేస్తున్నారని అనుకుంటారు. అసలు ప్రభుత్వానికే క్లారిటీ లేదని ప్రజలు అనుకునే ఎక్కడిదక్కడ ఆగిపోపోయింది. ఇక ముందైనా మూసి ప్రక్షాళనకు సీరియస్ గా ప్రయత్నాలు చేస్తారా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
The Raja Saab Live Updates: 'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Advertisement

వీడియోలు

Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam
WPL 2026 Mumbai Indians | ముంబై ఇండియన్స్ లో కీలక మార్పులు | ABP Desam
India vs South Africa Vaibhav Suryavanshi | మూడో వన్డేలో 233 పరుగుల తేడాతో విజయం
Shreyas Iyer Fitness Update Ind vs NZ | టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్!
Robin Uthappa about Team India | ఉత‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
The Raja Saab Live Updates: 'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Seethakka Surekha meets KCR: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
Jagan: రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
Geetu Mohandas: ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్
ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... ఫిమేల్ డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్!
Cheekatilo OTT Release Date: ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget