అన్వేషించండి

Modi on Coal Mines :సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణపై తప్పుదోవ పట్టిస్తుంది ఎవరు?

తెలంగాణలో బొగ్గు గనుల ప్రైవేటీకరణపై ప్రధాని మోదీ క్లారిటీ ఇచ్చారా?. బొగ్గు గనుల ప్రైవేటీకరణపై తప్పుదోవ పట్టిస్తుంది ఎవరు?

తెలంగాణలో బొగ్గు గనుల ప్రైవేటీకరణపై ప్రధాని మోదీ క్లారిటీ ఇచ్చారు. కానీ ఏపీలో మాత్రం మౌనంగా ఉన్నారు. విన్నపాలు వినిపించినా వినపడన్నట్లు ఎందుకు ఉన్నారు? రాష్ట్ర విభజన సమయంలో ఏర్పడిన గాయాలను ఎందుకు తొలగిపోయాలా చేయడం లేదు?  అన్న ప్రశ్నలు ఏపీ రాజకీయాల్లో వినిపిస్తున్నాయి. రామగుండం ఎరువుల ఫ్యాకర్టీని జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్‌ తీరుపై మండిపడ్డారు. బొగ్గు గనుల్లో కేంద్రానికి 49 శాతం వాటా మాత్రమే ఉందని స్పష్టం చేస్తూ ప్రైవేటీకరణ దిశగా కేంద్రం ఆలోచన చేయడం లేదని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వమే అనవసరంగా ప్రజలు,ఉద్యోగులను తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు. ఈ మాటల ద్వారా బొగ్గు గనుల ప్రైవేటీకరణ లేదన్నది అర్థమయ్యేలా చెప్పడమే కాదు ఉద్యోగులకు కూడా భరోసా ఇచ్చినట్లైంది. తెలంగాణలో గతకొంతకాలంగా కేసీఆర్ వర్సెస్‌ మోదీ ఫైట్‌ నడుస్తోంది. అధికార టీఆర్‌ఎస్‌ అవినీతి పాలన అంతుచూస్తామని అప్పుడు ఇప్పుడు కూడా మోదీతో పాటు బీజేపీ పార్టీ చెబుతూ వస్తోంది. అందులో భాగంగానే లిక్కర్‌ స్కామ్‌, గ్రానైట్, మైనింగ్ స్కామ్‌ లను వెలుగులోకి తెచ్చి కేసీఆర్ కుటుంబ అవినీతి పాలన ఇదంటూ చెప్పే ప్రయత్నం చేసింది.

ఎమ్మెల్యేల కోనుగోళ్ల వ్యవహారాన్ని టీఆర్‌ ఎస్‌ బయటపెట్టి దేశమంతటా కాషాయం కుట్రలు చూడండని సినిమా చూపించింది. ఇలా నువ్వానేనా అన్న రేంజ్‌ లో కేసీఆర్-మోదీ యుద్ధం సాగుతోంది. ఎలాగైనా సరే తెలంగాణలో కమలం వికసించేలా చేయాలన్న ఉద్దేశంతోనే ప్రధాని మోదీ బొగ్గు గనుల ప్రైవేటీకరణపై క్లారిటీ ఇచ్చారు. కానీ ఏపీ విషయంలో మాత్రం అధికారపార్టీనే కాదు విపక్షాలు కూడా పోరాటాన్ని చూపించలేకపోతున్నాయి. ప్రత్యేకహోదా, స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై ప్రజలు, ఉద్యోగులు పోరాటం చేస్తుంటే రాజకీయ ప్రయోజనం చూసుకున్నాయో కానీ కేంద్రంపై ఎవ్వరూ ఒత్తిడి చేయలేకపోయారు. స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగులు గట్టిగా ఉంటేనే మా పార్టీ మద్దతు ఇస్తుందని జనసేన అధినేత చెప్పారే కానీ, విశాఖ ఉక్కు -ఆంధ్రుల హక్కు అన్న విషయం  గుర్తుంచుకొని పార్టీ తరపున గట్టిగా పోరాటం చేసి ఉంటే , టెక్నాలజీని తెచ్చి అంతర్జాతీయంగా హైదరాబాద్‌ పేరుని వినపడేలా చేశానని చెప్పుకునే చంద్రబాబు ప్రత్యేకహోదా విషయంలో తగ్గకుండా ఉండి ఉంటే ఈరోజు ఏపీ ప్రజల భవిష్యత్‌ బాగుండేదన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అంతేకాదు మోదీ విశాఖ పర్యటనలో ఉద్యోగులు, కమ్యూనిస్ట్‌ లు, ప్రజాసంఘాలు తప్పించి ఎవ్వరూ కూడా గట్టిగా ప్రధానికి నిరసన సెగ చూపించలేకపోవడం వల్లే  ప్రధాని మౌనంగా ఉన్నారని చెబుతున్నారు.

ప్రస్తుతానికి తెలంగాణలో అధికారం కోసం చూస్తోన్న బీజేపీ అక్కడి రాజకీయాల్లో బలంగా మారేందుకే ప్రస్తుతం బొగ్గు గనుల ప్రైవేటీకరణ అంశాన్ని వాయిదా వేసిందని భావిస్తున్నారు. ఒకవేళ బీజేపీ అంచనా వేస్తున్న విధంగా తెలంగాణలో ఆపార్టీ బలమైన ప్రతిపక్షంగా మారినా, లేదంటే అధికారంలోకి డబుల్‌ ఇంజిన్‌ తో వచ్చినా బొగ్గు గనుల ప్రైవేటీకరణ గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోతుందని రాజకీయవిశ్లేషకులు కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణంగా పలు విషయాలను ప్రస్తావిస్తున్నారు.గత ఎనిమిదేళ్ల అనుభవాలను గుర్తు చేసుకుంటున్నారు.  గ్యాస్‌ సబ్సిడీ ఎత్తివేయడం, పథకాలు కుదించడం, ప్రభుత్వ ఆస్తులను చాలావరకు ప్రైవేటీకరణ చేసిన విషయాలను గుర్తు చేస్తున్నారు. కాబట్టి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత చాలా పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయమంటున్నారు రాజకీయవిశ్లేషకులు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Gachibowli DLF Road Closed 90 Days: మూడు నెలల పాటు గచ్చిబౌలి రోడ్ మూసివేత - పోలీసులు సూచించిన ప్రత్యామ్నాయాలు ఇవిగో
మూడు నెలల పాటు గచ్చిబౌలి రోడ్ మూసివేత - పోలీసులు సూచించిన ప్రత్యామ్నాయాలు ఇవిగో
Patancheru Real Estate: ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
Kodangal Duplicate Votes: కొడంగల్‌లో 11 వేల కర్ణాటక వాసుల ఓట్లు - కవిత సంచలన ఆరోపణలు
కొడంగల్‌లో 11 వేల కర్ణాటక వాసుల ఓట్లు - కవిత సంచలన ఆరోపణలు

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
Kakinada KIET College Invitation To CM Vijay: కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
Patancheru Real Estate: ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
NBK111 Update : బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
AIADMK MLA MR Vijayabhaskar Resigns: టీవీకే విజయ్ ప్లాన్‌కు అల్లాడిపోతున్న అన్నాడీఎంకే - మరో ఎమ్మెల్యే రాజీనామా - లైన్‌లో ఇంకా ఉన్నారా?
టీవీకే విజయ్ ప్లాన్‌కు అల్లాడిపోతున్న అన్నాడీఎంకే - మరో ఎమ్మెల్యే రాజీనామా - లైన్‌లో ఇంకా ఉన్నారా?
Kodangal Duplicate Votes: కొడంగల్‌లో 11 వేల కర్ణాటక వాసుల ఓట్లు - కవిత సంచలన ఆరోపణలు
కొడంగల్‌లో 11 వేల కర్ణాటక వాసుల ఓట్లు - కవిత సంచలన ఆరోపణలు
ENE Sequel Release Date : ఓవైపు కుర్రాళ్లు రెడీ... మరోవైపు నవ్వుల తుపాన్ - ఈ నగరానికి ఏమైంది? సీక్వెల్ రిలీజ్ డేట్ ఫిక్స్
ఓవైపు కుర్రాళ్లు రెడీ... మరోవైపు నవ్వుల తుపాన్ - ఈ నగరానికి ఏమైంది? సీక్వెల్ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget