అన్వేషించండి

Rythu Bandhu Funds: రైతు బంధు నిధులు విడుదల, తొలిరోజు 22.55 లక్షల ఖాతాల్లో ఎంత జమ చేశారంటే !

Rythu Bandhu Funds Credited to Farmer Accounts: రైతు బంధు పథకం కింద నేడు తొలిరోజు రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో రూ.642.52 కోట్లు జమ అయ్యాయి.

Rythu Bandhu Funds Released: తెలంగాణలో రైతు బంధు సంబురం మొదలైంది. పంట పెట్టుబడి రాయితీ సాయం పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రారంభించింది. రైతు బంధు పథకం కింద నేడు తొలిరోజు రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో రూ.642.52 కోట్లు జమ అయ్యాయి. ఎకరాలను బట్టి ప్రతి రోజు కొందరు రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. నేడు 22,55,081 (22 లక్షల 55 వేల 81) మంది రైతులకు పెట్టుబడి సాయం వారి ఖాతాల్లో జమ చేశారు.

నేడు 22,55,081 (22 లక్షల 55 వేల 81) మంది రైతులకు పెట్టుబడి సాయం వారి ఖాతాల్లో జమ చేశారు. వ్యవసాయ శాఖ ద్వారా అందుతున్న సూచనలు పాటించాలని అన్నదాతలకు మంత్రి సూచించారు. ఇదివరకే రైతు బంధు నిధులు విడుదలపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయశాఖ, ఆర్థిక శాఖ అధికారులు సమన్వయంతో రైతు బంధు నగదు ఖాతాల్లో జమ చేయాలన్న ఆదేశాలను నేటి నుంచి అమలుచేస్తున్నారు. రైతు బంధులు నిధులు విడుదల చేసి, రైతుల ఖాతాల్లో నగదు జమ చేయడంపై సీఎం కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావుకు మంత్రి నిరంజన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
Also Read: మండుతున్న టమాటా ధరలు, త్వరలో రూ.100 మార్క్ దాటడం కన్ఫామ్! కారణం ఏంటంటే

రైతు బంధు పండుగ మొదలైంది..
రైతుల ఖాతాల్లో వానా కాలం పెట్టుబడి రైతు బంధు నగదు జమ మొదలైంది. దీనిపై స్పందిస్తూ ఆర్ధికశాఖ మంత్రి హరీశ్​రావు హర్షం వ్యక్తం చేశారు. మరోమారు రైతుబంధు పండగ ప్రారంభమైందని ట్వీట్ చేశారు. లక్షల మంది రైతులు ఇవాళ్టి నుంచి రైతుబంధు ద్వారా పంట పెట్టుబడి సాయం అందుతుందన్నారు. సీఎం కేసీఆర్ రైతుల శ్రేయస్సును ఆకాంక్షించి రైతు బంధు అందిస్తున్నారని తొలిరోజు రూ.645.52 కోట్లు అన్నదాతల ఖాతాల్లో జమ అయిందన్నారు. ఎకరా సాగుభూమి ఉన్న రైతుల ఖాతాల్లో నగదు జమ అయిందని ట్వీట్ లో పేర్కొన్నారు. 

ఈ సారి 1.5లక్షల మంది పోడు రైతులకు సైతం రైతుబంధు అందించాలని కేసీఆర్ నిర్ణయించారు.  కొత్తగా 5 లక్షల లబ్దిదారులు రైతు బంధు సాయం అందుకోనున్నారు. 1.54కోట్ల ఎకరాలకుగానూ అర్హులైన రైతుల ఖాతాల్లో మొత్తం రూ.7720.29కోట్లు జమకానున్నాయి.  సుమారు 4 లక్షల పోడు భూములకు రైతు బంధు లభించనుంది. 10 వ విడత వరకు రూ.65,190 కోట్లు జమ చేశారు. గతం కన్నా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై రూ.300 కోట్ల అదనపు భారం పడనుంది.  11వ విడత పూర్తయ్యేసరికి అర్హులైన రైతలన్నలకు పంట నగదు సాయం అందుతుందని మంత్రి తెలిపారు.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget