అన్వేషించండి

Revanth Reddy: జోరు వానలో హోరెత్తించిన రేవంత్ రెడ్డి.. రావిర్యాల గడ్డ మీద కేసీఆర్ ను ఏమన్నారంటే..

సీఎం కేసీఆర్ పే రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రగతి భవన్ లో పిడుగు పడ్డది.. కేసీఆర్ గుండెల్లో గునపం దిగిందని వ్యాఖ్యానించారు. 


తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 9న ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లిలో దళిత దండోరాను నిర్వహించింది. దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరాను మోగించనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటించారు.  ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఇవాళ రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో సభ నిర్వహించారు. ఓ వైపు వర్షం పడుతున్న రేవంత్ రెడ్డి సభలో మాట్లాడుతూనే ఉన్నారు.  మరోవైపు కార్యకర్తలు రేవంత్ ప్రసంగాన్ని ఉత్సాహంగా విన్నారు.

టీఆర్ఎస్ పార్టీని పాతాళానికి తొక్కుతాం: రేవంత్ రెడ్డి
ఇంద్రవెల్లిలో ఓ అడుగు వేశాం.. ఇంకో అడుగు ర్యాలిలో వేశాం.. ఇంకో అడుగు కేసీఆర్ నెత్తి మీద పెట్టి తొక్కుతాం. టీఆర్ఎస్ పార్టీని పాతాళానికి తొక్కుతామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాడనికి వరుణుడు వచ్చాడని రేవంత్ రెడ్డి అన్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా మెుత్తం తీసి కేసీఆర్ కు పంపించండి.. నిఖార్సైన కార్యకర్తలు వానలో కూడా ఉన్నారని రేవంత్ రెడ్డి అన్నారు. సోనియా గాంధీ నిర్ణయంతో ప్రగతి భవన్ లో పిడుగు పడ్డది.. కేసీఆర్ గుండెల్లో గునపం దిగిందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నెల రోజుల నుంచి ఆగం ఆగం అవుతున్నారన్నారు. దళిత, గిరిజనులకు సంక్షేమ పథకాలు, కాదని.. విద్య ఉపాధి కావాలని రేవంత్ అన్నారు. 10 లక్షలు దేనికి సరిపోతాయని అడిగారు.  ఇంట్లో సెలవు తీసుకుని రావాలని కాంగ్రెస్ కార్యకర్తలు పిలుపునిచ్చారు. 19 నెలలు కష్టపడితే.. అధికారం మనదేనని రేవంత్ అన్నారు.

ప్రణబ్​ ముఖర్జి వచ్చినప్పుడు, మాజీ గవర్నర్ నరసింహన్​ కనిపించినప్పుడు కేసీఆర్​ వాళ్ల కాళ్లు మొక్కాడని రేవంత్ రెడ్డి అన్నారు. ​దళిత రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ వచ్చినప్పుడు కనీసం నమస్కారం కూడా చేయలేదని పేర్కొన్నారు. మొదటి సీఎస్​ రాజీవ్​ శర్మ, తర్వాత సీఎస్​ ఎస్కే జోషి, మొదటి డీజీపీ అనురాగ్​ శర్మ పదవులను పొడిగించారని.. ఇప్పుడు ప్రభుత్వ సలహాదార్లుగా నియమించుకున్నారని రేవంత్ అన్నారు. కాని ఒక దళిత బిడ్డ ప్రదీప్​ చంద్ర సీఎస్​ అయితే ఒకటే నెలకు రిటైర్మెంట్​ ఇచ్చారని ఆరోపించారు. భూపాలపల్లి కలెక్టర్​గా ఉన్న మురళి పేదళ్ల గురించి మాట్లాడితే.. అతన్ని అవమానించారని రేవంత్ అన్నారు. ఆయన రాజీనామా చేసి బయటకు వెళ్లారన్నారు. పాలమూరు బిడ్డ ప్రవీణ్​ కుమార్​ 6 ఏళ్ల పదవీ కాలం ఉండగానే రాజీనామా చేశారని.. డీజీపీ స్థాయికి వెళ్లేవారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.


కృష్ణా నది ఉప్పొంగినట్లు కాంగ్రెస్‌ సభకు ప్రజలు వచ్చారని  రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమకారులు మరో 18 నెలల్లో కేసీఆర్‌ను గద్దె దించాలని ఆవేశంగా ఉన్నారన్నారు. తెలంగాణ కోసం చనిపోయిందెవరో ప్రజలు ఆలోచించాలని రేవంతే చెప్పారు. కాంగ్రెస్‌ సభలు చూసి కేసీఆర్‌ గుండెల్లో గునపం దిగినట్లు ఉందన్నారు. దళితబంధు కింద ఇచ్చే రూ.10 లక్షలు ఎవరి భిక్షం కాదని.. ప్రజలు పన్నుల రూపంలో ఇచ్చిన సొమ్మునే మళ్లీ వాళ్లకు ఇస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ 4 కోట్ల ప్రజల భవిష్యత్ హుజూరాబాద్​ బిడ్డల చేతిలో ఉందని చెప్పారు.

ఇంకా నేతలు ఏం మాట్లాడారంటే..


తెలంగాణలో సామాజిక న్యాయం జరగట్లేదు: బట్టి
తెలంగాణలో సామాజిక న్యాయం జరగట్లేదని బట్టి విక్రమార్క అన్నారు. ఏడేళ్ల క్రితం తీసుకొచ్చిన ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను కేసీఆర్ సర్కార్ ఖర్చు చేయలేదని బట్టి అన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న దళిత వ్యతిరేక విధానలపై పెద్ద ఎత్తున పోరాడాలన్నారు.

కేసీఆర్ హఠావో... తెలంగాణ బచావో
 ఏడేళ్ల కాలంలో ఎలా దోపిడికి గురవుతున్నామో గుర్తుచేసుకోవాలని కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ అన్నారు. ఫార్మాకంపెనీలతో రంగారెడ్డి జిల్లాను నాశనం చేస్తున్నారన్నారు. మహేశ్వరంలో గెలిపించిన ఎమ్మెల్యే... ఏం చేశారో చూశామని.. పక్కనే గెలిపించిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎలాంటి పనులు చేస్తున్నారో తెలుస్తున్నాయని మధుయాష్కీ విమర్శించారు.

ఇప్పుడెలా ఉన్నామని చూసుకోవాలి: దామోదర రాజనర్సింహ

తెలంగాణ చరిత్ర పోరాటాల చరిత్ర, తెలంగాణ చరిత్ర త్యాగాల చరిత్ర అని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. తెలంగాణ వచ్చాక అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ దళిత, గిరిజనులకు చేసిందేమీ లేదని విమర్శించారు. రాజకీయంగా, సామాజికంగా ఎలా ఉన్నామని ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. 

 ఆంధ్రా వాళ్లతో కేసీఆర్ కుమ్మక్కయ్యారు

ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి అని చెప్పి కేసీఆర్ మోసం చేశాడని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. మూడు ఎకరాల భూమి అని చెప్పి.. 10 లక్షలని ఇప్పుడు చెబుతున్నాడని విమర్శించారు. కేసీఆర్ మాటలకు మోసపోవద్దని వేడుకుంటానని చెప్పారు. కృష్ణా జలాలను ఆంధ్రకు పంపిస్తు్న్నారని.. వాళ్లతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. దక్షిణ తెలంగాణను నాశనం చేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగాలు కూడా ఇవకుండా నిరంకుశ, అవినీతి పాలన కొనసాగిస్తున్నారని నాగం జనార్దన్ రెడ్డి చెప్పారు.

ఎన్నికలకో పథకం

కేసీఆర్ లా పూటకో పదం, ఎన్నికలకో పదం .. ఎక్కడ రాజకీయ లబ్ధి జరుగుద్దో అక్కడికి కాంగ్రెస్ వెళ్లలేదని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేవుళ్లను తీసుకొచ్చి రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటున్నాయని విమర్శించారు. తెలంగాణ సాధించుకున్నాక.. స్వాతంత్ర్య్రం రాకముందు ఎదుర్కొన్న సమస్యలనే.. ఇప్పుడు మళ్లీ ఎదుర్కొంటున్నారన్నారు. కొన్ని రోజుల నుంచి.. కేసీఆర్ బయట కనిపిస్తున్నాడని.. అంతకుమందు రాజులా.. ఇంట్లో కూర్చొని పాలించాడని విమర్శించారు. మందకృష్ణ మాదిగను జైళ్లో పెట్టడం దారుణమన్నారు. హుజూరాబాద్ లో తప్ప ఎక్కడా దళిత బంధు పథకం అడగొద్దని దాడులు చేస్తున్నారన్నారు. దళిత,గిరిజన బిడ్డలపై కేసులు పెట్టి హింసిస్తున్నారన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CPM leader impeached: జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
Santosh Nagar Steel Bridge: ఇలా పనులు చేస్తే కార్మికులకే కాదు రోడ్డున పోయే వారికీ నో గ్యారంటీ - హైదరాబాద్‌లో ఇంత ప్రమాదకరదృశ్యాలను ఎప్పుడూ చూసి ఉండరు !
ఇలా పనులు చేస్తే కార్మికులకే కాదు రోడ్డున పోయే వారికీ నో గ్యారంటీ - హైదరాబాద్‌లో ఇంత ప్రమాదకరదృశ్యాలను ఎప్పుడూ చూసి ఉండరు !
Khammam demolitions Kerala politics: ఖమ్మం కూల్చివేతలపై కేరళ సీఎం ట్వీట్ - కాంగ్రెస్‌ రియాక్షన్ ఇదే
ఖమ్మం కూల్చివేతలపై కేరళ సీఎం ట్వీట్ - కాంగ్రెస్‌ రియాక్షన్ ఇదే
Jubilee Hills traffic: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఫ్లైఓవర్ పనులు ప్రారంభం - ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఇవిగో ప్రత్యామ్నాయ రూట్స్
కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఫ్లైఓవర్ పనులు ప్రారంభం - ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఇవిగో ప్రత్యామ్నాయ రూట్స్

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CPM leader impeached: జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
Pawan Kalyan Meets CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
Jubilee Hills traffic: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఫ్లైఓవర్ పనులు ప్రారంభం - ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఇవిగో ప్రత్యామ్నాయ రూట్స్
కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఫ్లైఓవర్ పనులు ప్రారంభం - ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఇవిగో ప్రత్యామ్నాయ రూట్స్
Iran Israel War 2026: ఓమన్ తీరంలో ముగ్గురు భారతీయ నావికుల మృతి; 20 మందికిపైగా గాయాలు !
ఓమన్ తీరంలో ముగ్గురు భారతీయ నావికుల మృతి; 20 మందికిపైగా గాయాలు !
Rajinikanth - Shah Rukh Khan: కమల్ తర్వాత షారుఖ్‌తో... అనిరుధ్ డ్రీమ్ కాంబో - రజనీతో మల్టీస్టారర్ సెట్టయ్యేనా?
కమల్ తర్వాత షారుఖ్‌తో... అనిరుధ్ డ్రీమ్ కాంబో - రజనీతో మల్టీస్టారర్ సెట్టయ్యేనా?
టీ20లో టీమిండియా నెంబర్ 1 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. రోహిత్ శర్మను వెనక్కి నెట్టిన SKY
టీ20లో టీమిండియా నెంబర్ 1 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. రోహిత్ శర్మను వెనక్కి నెట్టిన SKY
Ugadi Panchangam 2026: పరాభవ నామ సంవత్సరం సింహ రాశి ఉగాది ఫలితాలు! ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు ఎలా ఉండబోతోంది?
పరాభవ నామ సంవత్సరం సింహ రాశి ఉగాది ఫలితాలు! ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు ఎలా ఉండబోతోంది?
Santosh Nagar Steel Bridge: ఇలా పనులు చేస్తే కార్మికులకే కాదు రోడ్డున పోయే వారికీ నో గ్యారంటీ - హైదరాబాద్‌లో ఇంత ప్రమాదకరదృశ్యాలను ఎప్పుడూ చూసి ఉండరు !
ఇలా పనులు చేస్తే కార్మికులకే కాదు రోడ్డున పోయే వారికీ నో గ్యారంటీ - హైదరాబాద్‌లో ఇంత ప్రమాదకరదృశ్యాలను ఎప్పుడూ చూసి ఉండరు !
Embed widget