అన్వేషించండి

Revanth To Delhi : ఢిల్లీకి రేవంత్ - మూడు పెండింగ్ సీట్ల అభ్యర్థులను ఫైనల్ చేసే చాన్స్ !

Telangana News : మూడు పెండింగ్ సీట్ల అభ్యర్థులను ఖరారు చేసేందుకు రేవంత్ ఢిల్లీ వెళ్లారు. ఖమ్మం అభ్యర్థిగా ఎవరిని ఖరారు చేస్తారన్నది సస్పెన్స్ గా మారింది.

CM Revanth In Delhi :  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు.  ఏఐసీసీ పెద్దలతో ఆయన భేటీకానున్నారు. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి పార్టీ పెద్దలతో రేవంత్ భేటీ అవుతారు. ఈ భేటీలో అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది.   14 పార్లమెంట్‌ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. మరో మూడు స్థానాలను మాత్రం పెండింగ్‌లో పెట్టింది. ఖమ్మం, కరీంనగర్ అభ్యర్థులపై హస్తం నేతలు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు.                                        

ఖమ్మం సీటు కాంగ్రెస్‌లో హాట్ టాపిక్ గా మారింది. ఉమ్మడి ఖమ్మంలో మిత్రపక్షం సీపీఐతో కలిసి అన్ని చోట్ల విజయం సాధించారు.   ముగ్గురు మంత్రులు తమ కుటుంబసభ్యులకు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. తన తమ్ముడికి టికెట్ ఇస్తే గెలిపించే బాధ్యత తీసుకుంటానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ పెద్దలకి చెప్పినట్టు సమాచారం. ఇక తన సతీమణి నందినికి టికెట్ ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైకమాండ్‌ను కోరినట్లు తెలుస్తోంది.మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన కుమారుడు యుగంధర్‌కు ఖమ్మం సీటు ఇవ్వాలని కోరుతున్నారు. సీనియర్ వి.హనుమంతరావు కూడా ఖమ్మం టికెట్ కోసం అధిష్ఠానాన్ని కలిశారు.   సామాజిక సమీకరణలో భాగంగా ఎవరికి టికెట్‌ ఇస్తారనేది పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.                       

కరీంనగర్ ఎంపీ టికెట్‌ విషయంలోనూ కాంగ్రెస్ ఒక క్లారిటీకి రాలేకపోతోంది. కరీంనగర్ అభ్యర్థిగా పోటీ చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని అధిష్ఠానం కోరగా ఆయన నిజామాబాద్ నుంచి పోటీ చేస్తానని చెప్పడంతో కరీంనగర్ టికెట్ పెండింగ్ లో పడింది. మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, పార్టీ నేత వెల్చాల రాజేందర్‌రావు టికెట్ ఆశిస్తున్నారు.  కరీంనగర్‌లో వెలమ సామాజికవర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉండటంతో..ఆ సామాజిక వర్గానికి చెందిన రాజేందర్ రావు పేరు బలంగా వినిపిస్తోంది.                  

హైదరాబాద్ అభ్యర్థి విషయంలో కూడా కాంగ్రెస్ ఈక్వేషన్స్ మారిపోయాయి.  ఇటీవల కాంగ్రెస్‌కు ఎంఐఎం దగ్గర కావడంతో.. పెద్దగా పోటీ ఇవ్వని బలహీన నేతను దింపాలన్న ఆలోచన చేస్తున్నారు.  హిందూ అభ్యర్థిని బరిలోకి దింపితే..మజ్లిస్ రాష్ట్రం మొత్తం మద్దతిస్తుందన్న ఆలోచన చేస్తున్నారు.  ఢిల్లీ పర్యటనను ముగించుకుని వచ్చిన తర్వాత రేవంత్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. మొత్తం 17 లోక్ సభ స్థానాల్లో 10కి పైగా స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. శాసనసభ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది.             

 

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో విశాఖపట్నం వాసి మృతి, హైదరాబాద్ ఐబీ అధికారిని భార్య, పిల్లల ఎదుటే కాల్చి చంపిన ఉగ్రవాదులు
ఉగ్రదాడిలో విశాఖపట్నం వాసి మృతి, హైదరాబాద్ ఐబీ అధికారిని భార్య, పిల్లల ఎదుటే కాల్చి చంపిన ఉగ్రవాదులు
PM Modi : ఉగ్రదాడి కారణంగా సౌదీ అరేబియా పర్యటన రద్దు చేసుకున్న మోదీ
ఉగ్రదాడి కారణంగా సౌదీ అరేబియా పర్యటన రద్దు చేసుకున్న మోదీ
AP Liquor Scam: రాజ్ కసిరెడ్డికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని తొలుత న్యాయమూర్తి ప్రశ్న
రాజ్ కసిరెడ్డికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని తొలుత న్యాయమూర్తి ప్రశ్న
Pahalgam Terror Attack: కశ్మీర్ వెళ్లిన వైజాగ్‌ టూరిస్టులు మిస్సింగ్- ఉగ్రదాడితో బంధువుల్లో ఆందోళన 
కశ్మీర్ వెళ్లిన వైజాగ్‌ టూరిస్టులు మిస్సింగ్- ఉగ్రదాడితో బంధువుల్లో ఆందోళన 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

LSG vs DC Match Highlights IPL 2025 | లక్నో సూపర్ జెయింట్స్ పై 8వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయం | ABP DesamGujarat Titans Winning Strategy IPL 2025 | టాప్ లో ఉంటే చాలు..ఇంకేం అవసరం లేదంటున్న గుజరాత్ టైటాన్స్Trolling on Ajinkya Rahane vs GT IPL 2025 | బ్యాటర్ గా సక్సెస్..కెప్టెన్ గా ఫెయిల్..?GT vs KKR IPL 2025 Match Review | డిఫెండింగ్ ఛాంపియన్ దమ్ము చూపించలేకపోతున్న KKR

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో విశాఖపట్నం వాసి మృతి, హైదరాబాద్ ఐబీ అధికారిని భార్య, పిల్లల ఎదుటే కాల్చి చంపిన ఉగ్రవాదులు
ఉగ్రదాడిలో విశాఖపట్నం వాసి మృతి, హైదరాబాద్ ఐబీ అధికారిని భార్య, పిల్లల ఎదుటే కాల్చి చంపిన ఉగ్రవాదులు
PM Modi : ఉగ్రదాడి కారణంగా సౌదీ అరేబియా పర్యటన రద్దు చేసుకున్న మోదీ
ఉగ్రదాడి కారణంగా సౌదీ అరేబియా పర్యటన రద్దు చేసుకున్న మోదీ
AP Liquor Scam: రాజ్ కసిరెడ్డికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని తొలుత న్యాయమూర్తి ప్రశ్న
రాజ్ కసిరెడ్డికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని తొలుత న్యాయమూర్తి ప్రశ్న
Pahalgam Terror Attack: కశ్మీర్ వెళ్లిన వైజాగ్‌ టూరిస్టులు మిస్సింగ్- ఉగ్రదాడితో బంధువుల్లో ఆందోళన 
కశ్మీర్ వెళ్లిన వైజాగ్‌ టూరిస్టులు మిస్సింగ్- ఉగ్రదాడితో బంధువుల్లో ఆందోళన 
Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు భారీ షాక్‌- పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైసీపీ 
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు భారీ షాక్‌- పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైసీపీ 
Anantapur Politics: పెనుగొండ వైఎస్ఆర్‌సీపీలో గందరగోళం - ఉషాశ్రీచరణ్‌కు చెక్ పెడతారా?
పెనుగొండ వైఎస్ఆర్‌సీపీలో గందరగోళం - ఉషాశ్రీచరణ్‌కు చెక్ పెడతారా?
BJP Vishnu Meet AP CM: సమన్వయంతో మోదీ పర్యటన విజయవంతానికి సన్నాహాలు -ఢిల్లీలో సీఎంను కలిసిన బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు
సమన్వయంతో మోదీ పర్యటన విజయవంతానికి సన్నాహాలు -ఢిల్లీలో సీఎంను కలిసిన బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు
UPSC CSE Final Result 2024: సివిల్స్ ఫలితాల్లో పిఠాపురం కుర్రాడికి 94వ ర్యాంకు- తొలి ప్రయత్నంలోనే అద్భుతం
సివిల్స్ ఫలితాల్లో పిఠాపురం కుర్రాడికి 94వ ర్యాంకు- తొలి ప్రయత్నంలోనే అద్భుతం
Embed widget