అన్వేషించండి

Revant Reddy : ఓ మెట్టు దిగుతా అందరూ వచ్చేయండి - మాజీ కాంగ్రెస్ నేతలకు రేవంత్ పిలుపు !

మాజీ కాంగ్రెస్ నేతలందరూ మళ్లీ పార్టీలోకి రావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తనే అడ్డం అయితే ఓ మెట్టు దిగుతానని కూడా ఆఫర్ ఇచ్చారు.


Revant Reddy :   కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయంతో తెలంగాణలో పార్టీకి ఊపు తీసుకు  రావాలని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. పలువురు నేతలు మళ్లీ కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం ప్రారంభం కావడంతో నేరుగా రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. పార్టీని వీడిపోయిన వాళ్లందరూ తిరిగి రావాలని పిలుపునిచ్చారు. మాజీ ఎంపీలు వివేక్, విశ్వేశ్వర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి పార్టీలోకి రావాలన్నారు. ఈటల రాజేందర్ కూడా పార్టీలోకి రావాలని పిలుపునిచ్చారు.  వివేక్, ఈటల, కొండా లాంటి వాళ్ళు క్షణికావేశంలో బీజేపీలో చేరారని, బీజేపీ సిద్దాంతంతో సంబంధంలేనివాళ్ళు కొందరు బీజేపీని నమ్మి ఆ పార్టీలో చేరారన్నారు. 

తన వల్ల ఇబ్బంది అవుతుందనుకుంటో ఓ మెట్టు దిగుతానన్న రేవంత్ రెడ్డి 

సీఎం కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణ చేయాలనుకునే వాళ్ళు కాంగ్రెస్‌‌లోకి రావాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి తాను నాయకుడ్ని కాదని, సోనియా, ఖర్గేలే నాయకులన్నారు. తన వల్ల ఇబ్బంది అవుతుంది అనుకుంటే... ఒక మెట్టు కాదు పది మెట్లు దిగడానికి తాను సిద్ధమన్నారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరాలని అనుకుంటున్నారని ..అయితే రేవంత్ రెడ్డి సారీ చెబితే చేరడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. ఈ కారణంగానే రేవంత్ రెడ్డి తాను ఓ మెట్టు దిగడానికి సిద్ధమని చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే పార్టీ మార్పు వ్యాఖ్యలను రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలో ఖండించారు. 

వీహెచ్‌ కామెట్స్ సీరియస్‌గా తీసుకున్న నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ బీసీ నేతలు- 3 స్థానాలు కావాలంటూ డిమాండ్!
 
మోదీ బ్రాండ్‌కు కాలం చెల్లిందన్న రేవంత్ రెడ్డి ! 

కర్ణాటకలో చక్రం తిప్పాలని చూసిన కేసీఆర్ నడుములు విరగొట్టారని, కేసీఆర్, మోదీ వేరు వేరు కాదని రేవంత్ అన్నారు. జేడీఎస్‌ను గెలిపించాలని కేసీఆర్ ప్రయత్నించారని, కర్ణాటకలో బీజేపీ చేసిందే తెలంగాణలో బీఆర్ఎస్ చేస్తోందని ఆరోపించారు.  కర్ణాటక ఫలితాలను దేశవ్యాప్తంగా చర్చిస్తున్నారని మోదీ విధానాలకు వ్యతిరేకంగా కర్ణాటక ప్రజలు నిలబడ్డారని కొనియాడారు. కర్ణాటక ప్రజల మధ్య బీజేపీ చిచ్చు పెట్టిందని, మోదీ కుట్రలను కర్ణాటక ప్రజలు తిప్పికొట్టారన్నారు. కాంగ్రెస్ పార్టీతో ప్రత్యక్ష సంబంధం లేనివాళ్ళు కూడా కర్ణాటక ప్రజలను అభినందించారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

తెలంగాణకు అమెరికా వైద్య పరికరాల దిగ్గజం - రూ. 3 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్న మెడ్ ట్రానిక్స్ !

త్వరలో బీసీ గర్జన ! 
 
త్వరలోనే బీసీ పాలసీ ప్రకటిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.  బీసీ గర్జన నిర్వహించాలని పార్టీ ఆదేశించిందని, బీసీలకు వ్యతిరేకంగా గతంలో  బీజేపీ  ఉద్యమం చేసిందని మండిపడ్డారు.  మోదీని ప్రధాని చేస్తే బీసీల కడుపు నిండదన్నారు. పదవి పోయే ముందు బీజేపీకి బీసీలు గుర్తుకొస్తున్నారా? అని ప్రశ్నించారు. బీసీలకు ప్రాధాన్యత ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. మోదీని ఓడించడానికి కాంగ్రెస్ నాయకత్వం అవసరమని దేశంలోని అన్ని పార్టీలు అనుకుంటున్నాయన్నారు.                                                                      

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Padi kaushik Reddy: కాంగ్రెస్ ఎంపీలు రాధాకృష్ణన్‌కు ఓటేశారు - ఎంపీలే చెప్పారు - పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ ఎంపీలు రాధాకృష్ణన్‌కు ఓటేశారు - ఎంపీలే చెప్పారు - పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Quantum valley Designs: కొత్త సంవత్సరానికి క్వాంటమ్ వ్యాలీ సిద్ధం.. నాలుగునెలల్లో 3D ప్రింటింగ్‌తో నిర్మించనున్న భవనాలు... డిజైన్లు విడుదల
కొత్త సంవత్సరానికి క్వాంటమ్ వ్యాలీ రెడీ.. నాలుగునెలల్లో 3D ప్రింటింగ్‌తో నిర్మించనున్న భవనాలు... డిజైన్లు విడుదల
Vantara Case: వంతారాలో ఎలాంటి చట్ట ఉల్లంఘనలు జరగలేదు - సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక
వంతారాలో ఎలాంటి చట్ట ఉల్లంఘనలు జరగలేదు - సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక
TTD Key Decisions: ఏపీలో 1000 ఆలయాలు నిర్మాణం సహా బ్రహ్మోత్సవాలపై టీటీడీ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
ఏపీలో 1000 ఆలయాలు నిర్మాణం సహా బ్రహ్మోత్సవాలపై టీటీడీ కీలక నిర్ణయాలు ఇవే
Advertisement

వీడియోలు

India Pakistan Match Asia Cup 2025 | సెప్టెంబర్ 21న మళ్లీ భారత్, పాకిస్తాన్ మ్యాచ్!
ICC Award to Mohammad Siraj | సిరాజ్‌కి ఐసీసీ అవార్డ్
IND vs PAK Asia Cup 2025 | షేక్ హ్యాండ్ కాంట్రవర్సీలో పాక్‌కి షాకిచ్చిన ఐసీసీ
SL vs HK Match Asia Cup 2025 | 11 క్యాచ్ లు వదిలి మ్యాచ్ ఓడిపోయిన హాంగ్ కాంగ్
Mizoram Lifestyle Exploring Telugu Vlog | మిజోరం లైఫ్ స్టైల్ ఒక్కరోజులో చూసేద్దాం రండి.! | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Padi kaushik Reddy: కాంగ్రెస్ ఎంపీలు రాధాకృష్ణన్‌కు ఓటేశారు - ఎంపీలే చెప్పారు - పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ ఎంపీలు రాధాకృష్ణన్‌కు ఓటేశారు - ఎంపీలే చెప్పారు - పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Quantum valley Designs: కొత్త సంవత్సరానికి క్వాంటమ్ వ్యాలీ సిద్ధం.. నాలుగునెలల్లో 3D ప్రింటింగ్‌తో నిర్మించనున్న భవనాలు... డిజైన్లు విడుదల
కొత్త సంవత్సరానికి క్వాంటమ్ వ్యాలీ రెడీ.. నాలుగునెలల్లో 3D ప్రింటింగ్‌తో నిర్మించనున్న భవనాలు... డిజైన్లు విడుదల
Vantara Case: వంతారాలో ఎలాంటి చట్ట ఉల్లంఘనలు జరగలేదు - సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక
వంతారాలో ఎలాంటి చట్ట ఉల్లంఘనలు జరగలేదు - సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక
TTD Key Decisions: ఏపీలో 1000 ఆలయాలు నిర్మాణం సహా బ్రహ్మోత్సవాలపై టీటీడీ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
ఏపీలో 1000 ఆలయాలు నిర్మాణం సహా బ్రహ్మోత్సవాలపై టీటీడీ కీలక నిర్ణయాలు ఇవే
Telangana Group 1 Jobs: పిల్లల మీద పాలిటిక్స్ వద్దు, రూ.3 కోట్లు ఇచ్చారన్న ఆరోపణలు నిరూపించండి- గ్రూప్ 1 విజేత తండ్రి ఛాలెంజ్
పిల్లల మీద పాలిటిక్స్ వద్దు, రూ.3 కోట్లు ఇచ్చారన్న ఆరోపణలు నిరూపించండి- గ్రూప్ 1 విజేత తండ్రి ఛాలెంజ్
RGVపై మరోసారి కేసు నమోదు.. తన గౌరవాన్ని భంగం కలిగించారని విశ్రాంత మహిళా ఐపీఎస్ ఫిర్యాదు
RGVపై మరోసారి కేసు నమోదు.. తన గౌరవాన్ని భంగం కలిగించారని విశ్రాంత మహిళా ఐపీఎస్ ఫిర్యాదు
5 Star Safety Cars: ధర ₹10 లక్షల లోపే - అన్నీ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ గెలుచుకున్న టాప్‌ కార్లు, పూర్తి లిస్ట్
₹10 లక్షల్లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ సాధించిన కార్ల లిస్ట్‌ ఇదిగో
Chittoor Crime News: అల్లరి చేస్తోందని విద్యార్థిని తల పగలగొట్టిన టీచర్‌.. చిత్తూరులో దారుణం
అల్లరి చేస్తోందని విద్యార్థిని తల పగలగొట్టిన టీచర్‌.. చిత్తూరులో దారుణం
Embed widget