అన్వేషించండి

బిహార్‌ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్‌ 2025

(Source:  Poll of Polls)

Telangana Elections 2023 : కామారెడ్డి రైతుల భూములు కాపాడటానికే కేసీఆర్‌పై పోటీ - గెలిపించాలని రేవంత్ విజ్ఞప్తి

Telangana Elections 2023 : కామారెడ్డి రైతుల భూములు కాపాడటానికే తాను కామారెడ్డిలో పోటీ చేస్తున్నానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. కేసీఆర్‌కు ఓటు వేయడం అంటే పాముకు పాలు పోసినట్లేనన్నారు.

 

Telangana Elections 2023 :   కేసీఆర్ మాయమాటలు, కేటీఆర్ నక్కజిత్తులు నమ్మి బీఆర్ఎస్‌కు ( BRS ) ఓటు వేస్తే మోసపోవడం ఖాయం అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ను గెలిపిస్తే కామారెడ్డిలో వేల కోట్ల విలువైన భూములను కబ్జా చేస్తారని హెచ్చరించారు. మంగళవారం కామారెడ్డిలో నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. కామారెడ్డిలో ( Kamareddy ) ఓటుకు రూ.10 వేలు ఇచ్చి ఓట్లను కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ చూస్తోందని ఆరోపించారు.  కేసీఆర్ ఇచ్చే రూ.10 వేలకు ఆశపడి బీఆర్ఎస్‌కు ఓటు వేయవద్దన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వని కేసీఆర్‌కు ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. ఐదేళ్లుగా కేసీఆర్ సర్కార్ రుణమాఫి పూర్తి చేయలేదని ధ్వజమెత్తారు. అందుకే కామారెడ్డి ప్రజలు తెలంగాణ దశ దిశను మార్చే తీర్పును ఇవ్వాలని కోరారు.

పదేళ్లుగా సీఎంగా ఉన్న కేసీఆర్, ఇక్కడి ఎమ్మెల్యే మిమ్మల్ని మోసం చేశారని..   పేదలకు డబుల్ బెడ్రూంలు ఇవ్వలే, భూములకు పట్టాలు ఇవ్వలే... నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలే..  కానీ ఇప్పుడొచ్చి ఆయనకు ఓటు వేయలని అడుగుతున్నారన్నారు.  పదేళ్లలో గుర్తురాని అమ్మగారి ఊరు కొనాపూర్ ఆయనకు ఇప్పుడు గుర్తొచ్చిందట.. ఏనాడూ గల్ఫ్ కార్మికులను, బీడీ కార్మికులను ఆదుకోలేదన్నారు.  సిద్దిపేట, సిరిసిల్ల కాదని కేసీఆర్ కామారెడ్డిలో పోటీకి దిగడానికి కారణం..  ఇక్కడి రైతుల భూములు గుంజుకునెందుకేనన్నారు.  ఎన్నికలున్నాయనే మాస్టర్ ప్లాన్ ను తాత్కాలికంగా రద్దు చేశారని.. ఎన్నికల తరువాత మళ్ళీ మీ భూములను గుంజుకుంటడాడని ారోపించారు.                    

కేసీఆర్ ను నమ్మదమంటే.. పాముకు పాలు పోసి పెంచినట్లేనన్నారు. కేసీఆర్ పాము లాంటి వాడు... ఓటు వేశారో.. మిమ్మల్ని కాటు వేస్తాడని హెచ్చరించారు.  కామారెడ్డి భూములను కంచె వేసి కాపాడేందుకే నేను ఇక్కడ పోటీకి దిగానని..  కేసీఆర్ గెలిచినా.. ఓడినా ఫామ్ హౌస్ లొనే పడుకుంటాడని గుర్తు చేశారు.  కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు.  ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని హమీ ఇచ్చారు .తెలంగాణను దోచుకోవాలంటే భయపడేలా కామారెడ్డి ప్రజలు కేసీఆర్‌కు శిక్ష విధించాలన్నారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.                  

 వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారిని ఆదుకుంటామన్నారు. బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని, రైతులు పండించే పంటకుగిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీ హామీలను అమలు చేస్తామని చెప్పారు. కామారెడ్డిలో అన్ని గ్రామాలను తిరిగి మీ అందరి కష్టసుఖాలను తెలుసుకోవాల్సి ఉన్నప్పటికీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాలేకపోయాన్నారు. భవిష్యత్ కామారెడ్డిలో గ్రామగ్రామంలో పర్యటించి ప్రజలను కలుస్తానని ప్రజల కష్టాల్లో తోడుగా ఉంటాన్నారు. అందరు కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.         

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vizag IT Campus: విశాఖ కాపులుప్పాడలో మరో ఐటీ క్యాంపస్ ఏర్పాటు, 2 వేల మందికి ఉపాధి
విశాఖ కాపులుప్పాడలో మరో ఐటీ క్యాంపస్ ఏర్పాటు, 2 వేల మందికి ఉపాధి
Konda Surekha: నాగార్జున ఫ్యామిలీపై వ్యాఖ్యలకు చింతిస్తున్నాను.. అర్ధరాత్రి కొండా సురేఖ సంచలన పోస్ట్
నాగార్జున ఫ్యామిలీపై వ్యాఖ్యలకు చింతిస్తున్నాను.. కొండా సురేఖ సంచలన పోస్ట్
Jubilee Hills By-election: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో ఓటేసేందుకు ఆసక్తి చూపని ఓటర్‌! విజయం ఎవరి ధీమా వాళ్లదే!
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో ఓటేసేందుకు ఆసక్తి చూపని ఓటర్‌! విజయం ఎవరి ధీమా వాళ్లదే!
YS Jagan:  వ్యక్తిగతంగా హాజరవుతా - వారం గడువు ఇవ్వండి - సీబీఐ కోర్టును కోరిన జగన్
వ్యక్తిగతంగా హాజరవుతా - వారం గడువు ఇవ్వండి - సీబీఐ కోర్టును కోరిన జగన్
Advertisement

వీడియోలు

Bihar Election 2025 Exit Poll Results | బీహార్‌లో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వమే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆశ్చర్యకర ఫలితాలు | ABP Desam
PM Modi First Reaction on Delhi Blast | ఢిల్లీ బ్లాస్ట్ పై మోదీ ఫస్ట్ రియాక్షన్
Drone in Jubilee Hills Bypoll | ఎన్నికల్లో ఇదే మొదటిసారి డ్రోన్ ప్రయోగం
White Collar Terror Delhi Car Blast | దేశంలో నాలుగు ఘటనలు..నాలుగు చోట్లా వైద్యులే..భారీ కుట్రకు ప్లాన్ చేస్తోంది ఎవరు.?
White Collar Terror Attack Delhi Car Blast | దేశంలో నాలుగు ఘటనలు..నాలుగు చోట్లా వైద్యులే..భారీ కుట్రకు ప్లాన్ చేస్తోంది ఎవరు.?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag IT Campus: విశాఖ కాపులుప్పాడలో మరో ఐటీ క్యాంపస్ ఏర్పాటు, 2 వేల మందికి ఉపాధి
విశాఖ కాపులుప్పాడలో మరో ఐటీ క్యాంపస్ ఏర్పాటు, 2 వేల మందికి ఉపాధి
Konda Surekha: నాగార్జున ఫ్యామిలీపై వ్యాఖ్యలకు చింతిస్తున్నాను.. అర్ధరాత్రి కొండా సురేఖ సంచలన పోస్ట్
నాగార్జున ఫ్యామిలీపై వ్యాఖ్యలకు చింతిస్తున్నాను.. కొండా సురేఖ సంచలన పోస్ట్
Jubilee Hills By-election: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో ఓటేసేందుకు ఆసక్తి చూపని ఓటర్‌! విజయం ఎవరి ధీమా వాళ్లదే!
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో ఓటేసేందుకు ఆసక్తి చూపని ఓటర్‌! విజయం ఎవరి ధీమా వాళ్లదే!
YS Jagan:  వ్యక్తిగతంగా హాజరవుతా - వారం గడువు ఇవ్వండి - సీబీఐ కోర్టును కోరిన జగన్
వ్యక్తిగతంగా హాజరవుతా - వారం గడువు ఇవ్వండి - సీబీఐ కోర్టును కోరిన జగన్
Death Hoax: ఎవరి మరణం గురించి అయినా పుకారు వచ్చినప్పుడు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అది ఏ విషయాన్ని సూచిస్తుంది?
ఎవరి మరణం గురించి అయినా పుకారు వచ్చినప్పుడు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అది ఏ విషయాన్ని సూచిస్తుంది?
Bihar News: బిహార్‌లో ఎగ్జిట్‌ ఫలితాలతోనే కాంగ్రెస్‌కు షాక్‌- పార్టీకి రాజీనామా చేసిన షకీల్‌ అహ్మద్‌
బిహార్‌లో ఎగ్జిట్‌ ఫలితాలతోనే కాంగ్రెస్‌కు షాక్‌- పార్టీకి రాజీనామా చేసిన షకీల్‌ అహ్మద్‌
Komalee Prasad: చీరలో కోమలీ... చూపులతో చంపేస్తోన్న చిన్నది
చీరలో కోమలీ... చూపులతో చంపేస్తోన్న చిన్నది
Delhi Blasts Case: షషీనా బయటకు ప్రాణాలు పోసే డాక్టర్ - కానీ లోపలి క్యారెక్టర్ మాత్రం భయంకరమైన టెర్రరిస్టు !
షషీనా బయటకు ప్రాణాలు పోసే డాక్టర్ - కానీ లోపలి క్యారెక్టర్ మాత్రం భయంకరమైన టెర్రరిస్టు !
Embed widget