అన్వేషించండి

CM Revanth Reddy: అక్కడైతే కేసీఆర్, హరీష్‌లను రాళ్లతో కొట్టి చంపేవాళ్లు - జలవివాదంపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు

Water Dispute: తెలంగాణకు నీటి అన్యాయం జరగడానికి కేసీఆరే కారణం అని రేవంత్ ఆరోపించారు. ప్రజాభవన్ లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కృష్ణా, గోదావరి నీటి అంశంపై ప్రజెంటేషన్ ఇచ్చారు.

Telangana CM Revanth Reddy: నీటి కేటాయింపులపై కేసీఆర్​ చేసిన సంతకం తెలంగాణ కొంప ముంచిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.  విమర్శించారు. గురువారం ప్రజాభవన్​ లో ప్రజా ప్రతినిధులకు కృష్ణా, గోదావరి బేసిన్​ అంశాలపై మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ఇచ్చాడు. దీని సీఎం హాజరై అనంతరం మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్​, చంద్రబాబు సీఎంలు అయ్యాకా నీటి అంశాలపై చాలా ఇబ్బందులు వచ్చాయని..  కృష్ణా నికర జలాలకు సంబంధించి ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల కేటాయింపు జరిగిందని గుర్తు చేశారు.  అందులో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు చాలని, రెండు రాష్ట్రాల సీఎంల చర్చలలో 34:66 నిష్పత్తికి కేసీఆర్​ ఒప్పందం చేసుకున్నారన్నారు. తొలుత ఒక సంవత్సరానికి అని చెప్పి ఆ తర్వాత వరుసగా పొడిగిస్తూ 2020లో ట్రిబ్యునల్ ఫైనల్ చేసేంత వరకూ ఇదే ఫార్ములా ఉంటుందని కేసీఆర్​ సంతకం చేశారని  వివరించారు.  దీంతో శాశ్వతంగా తెలంగాణకు నష్టం వాటిల్లిందని రేవంత్ మండిపడ్డారు.  

2004లో ఏర్పడిన  ట్రిబ్యునల్ విచారణకు సంబంధించి 2026 వచ్చినా తీర్పు రాలేదని అసహనం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఒప్పందంతో ఏపీకి మంచి అవకాశంగా కలిసొచ్చినట్లయిందని.. దీంతో ఈ నీటిపై ఆధారపడి ప్రాజెక్టులు కట్టుకుంటూ ఉన్నారని వెల్లడించారు. ఇ పరివాహక ప్రాంతం ఎంత ఉంటుందో అంత మేరకు నీట వాటా దక్కాలన్నది అంతర్జాతీయ సూత్రం అని చెప్పారు. దీని ఆధారంగా తెలంగాణకు 555 టీఎంసీలు  కావాలని చెప్పామన్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకుని పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును నిర్మించాల్సింది పోయి.. శ్రీశైలం నుంచి తీసుకునేందుకు డిజైన్ మార్చారన్నారు. దాని వల్ల తీవ్ర నష్టం జరిగిందని..ఎత్తిపోతల నిర్మిస్తేనే కమిషన్లు వస్తాయని కేసీఆర్ ఆ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. 

అసెంబ్లీ, లోక్​ సభ ఎన్నికలల్లో ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్​ఎస్​ ఓడిపోయిందని.. వరుస ఓటములతో ఆ పార్టీ మనుగడ కష్టమవుతోందని కేసీఆర్​ గుర్తించారని చెప్పారు. ఈ కారణంగా మళ్లీ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో జలవివాదాలు సృష్టించి పార్టీని కాపాడుకోవాలని కేసీఆర్​ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్​ ప్రభుత్వంపై లేనిపోని అపోహలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సీఎం రేవంత్​ రెడ్డి వెల్లడించారు.  రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని భావించే సంకుచిత స్వభావం ప్రతిపక్షాల్లో కనిపిస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను సరిదిద్దుతూ, కృష్ణా-గోదావరి జలాల విషయంలో తెలంగాణకు దక్కాల్సిన వాటాను సాధించేందుకు తాము ప్రయత్నిస్తుంటే, దానిపై విషప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రతిపక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వారి రాజకీయ దిగజారుడుతనానికి అద్దం పడుతున్నాయని దుయ్యబట్టారు.
 
2014 నుంచి సాగునీటి ప్రాజెక్టుల విషయంలో జరిగిన ఒప్పందాలు, కేటాయింపులపై లోతైన విశ్లేషణ చేశారు. గత పదేళ్లలో జరిగిన అవకతవకలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. "మేము ప్రజల పక్షాన పోరాడుతుంటే, ప్రతిపక్షాలు మాత్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయి. తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు" అని ఆయన స్పష్టం చేశారు. రైతుల రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, ఇందులో ఎటువంటి జాప్యం లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.  అబద్ధాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం మానుకోవాలని, విమర్శించే ముందు వాస్తవాలను తెలుసుకోవాలని ప్రతిపక్ష నేతలను హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలి తప్ప, రాష్ట్ర పురోగతిని అడ్డుకునేలా ఉండకూడదని ఆయన సూచించారు.

కేసీఆర్ అసెంబ్లీకి వస్తే అన్ని అంశాలపై చర్చిద్దామని చెప్పానన్నారు. కానీ కేసీఆర్ అసెంబ్లీకి వచ్చే ఉద్దేశం లేదన్నారు.అయినప్పటికీ తాము అన్ని డాక్యుమెంట్లు అసెంబ్లీలో పెడతామని ప్రకటించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Donald Trump Tariffs on India: నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Advertisement

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Donald Trump Tariffs on India: నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Embed widget