అన్వేషించండి

Rahul Gandhi Diwali Holidays: భారత్‌ జోడో యాత్రకు బ్రేక్ - దీపావళి విరామంతో ఢిల్లీ వెళ్లిన రాహుల్ గాంధీ

Bharat Jodo Yatra in Telangana: రాష్ట్రంలో పాదయాత్ర మొదలుపెట్టిన కొన్ని గంటలకే తెలంగాణలో తొలిరోజు భారత్ జోడో యాత్ర ముగించారు రాహుల్ గాంధీ. దీపావళి బ్రేక్ తీసుకుని ఢిల్లీకి పయనమయ్యారు.

Rahul Gandhi Bharat Jodo Yatra in Telangana: భారత్ జోడో యాత్రను ఏ శక్తి ఆపలేదని, దేశ సమైక్యత కోసమే ఈ యాత్ర చేస్తున్నానని ఏఐసీసీ అగ్రనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. దేశాన్ని విచిన్నం చేసేందుకు బీజేపీ, ఆరెస్సెస్ ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. నేటి ఉదయం తెలంగాణలోకి రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రవేశించింది. కృష్ణా మండలం కృష్ణా బ్రిడ్జి పై తెలంగాణ లోకి రాహుల్ భారత్ జోడో యాత్ర ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ జెండాను కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ అప్పగించారు.
తెలంగాణలో తొలిరోజు ముగిసిన రాహుల్ పాదయాత్ర
రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్రను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్టాల్లో రాహుల్ పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. ఏపీలోనూ రెండు రోజుల కిందట జోడో యాత్ర పూర్తి చేసుకున్న రాహుల్ గాంధీ మరోసారి షెడ్యూల్ లో భాగంగా కర్ణాటకలోని రాయచూర్ లో యాత్ర కొనసాగించారు. నేటి ఉదయం రాహుల్ గాంధీ తెలంగాణలో తన యాత్రను మొదలుపెట్టారు. అయితే రాష్ట్రంలో పాదయాత్ర మొదలుపెట్టిన కొన్ని గంటలకే తెలంగాణలో తొలిరోజు భారత్ జోడో యాత్ర ముగించారు రాహుల్. దీపావళి పండుగ సందర్భంగా పాదయాత్రకు 3 రోజులు బ్రేక్ ఇచ్చిన రాహుల్ గాంధీ ఈ 27న ఇక్కడి నుంచే యాత్ర మొదలు పెడతా అన్నారు.

తెలంగాణలో తొలి రోజు జోడో పాద యాత్ర ముగించుకున్న రాహుల్ గాంధీ గూడబల్లేరు నుంచి హెలికాప్టర్ లో హైదరాబాద్ శంషాబాద్ కు బయలుదేరారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి పయనమయ్యారు రాహుల్ గాంధీ. ‘రాసి పెట్టుకో... రాజ్యమా గుర్తు పెట్టుకో... హిమాలయ శిఖరం... మా నాయకత్వం.  జై బోలో – భారత్ జోడో. మహానేతకు మన తెలంగాణ తరఫున స్వాగతం’ అంటూ రాహుల్ గాంధీకి స్వాగతం పలుకుతూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. 

తెలంగాణాలో సుదీర్ఘంగా 16 రోజులపాటు 19 అసెంబ్లీ, 7 పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా 375 కిలోమీటర్ల మేరకు కొనసాగుతూ నవంబర్ 7న మహారాష్ట్రలో ప్రవేశించనుంది. 16 రోజుల యాత్రలో దీపావళికి మూడు రోజులు, నవంబర్ 4న ఒకరోజు సాధారణ బ్రేక్ తీసుకోనున్న రాహుల్ పాదయాత్ర, ఆపై 12 రోజులపాటు ప్రజలతో ముందుకు సాగనుంది. కొన్ని ప్రాంతాల్లో కార్నిర్ మీటింగులు, మరి కొన్ని ప్రాంతాల్లో ఉదయపు అల్పాహారం, మరి కొన్ని ప్రాంతాలలో నైట్ హాల్ట్ లు చేస్తూ రాహుల్ గాంధీ రోజుకు 20 నుండి 25 కిలోమీటర్ల మేరకు పాదయాత్రతో ముందుకు సాగనున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు కీలక ప్రకటన చేసిన టీటీడీ
తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు కీలక ప్రకటన చేసిన టీటీడీ
PM Kisan Scheme: రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
Revanth Reddy On Musi : మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
WhatsApp New Features: ఇన్‌స్టాగ్రామ్‌ను చూసి వాట్సాప్ వాత పెట్టుకుంటుందా? - స్టేటస్‌లో రెండు కొత్త ఫీచర్లు!
ఇన్‌స్టాగ్రామ్‌ను చూసి వాట్సాప్ వాత పెట్టుకుంటుందా? - స్టేటస్‌లో రెండు కొత్త ఫీచర్లు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nirmal Man Returned from Kuwait: కువైట్‌లో గోట్‌లైఫ్ బతుకు! ఒక్క పోస్ట్‌తో సేఫ్‌గా సొంతూరికిRajendra Prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదంManchu Vishnu on Nagarjuna Issue | నాగార్జున, సమంత, నాగచైతన్య వెంటే ఉంటాం | ABP DesamUdhaynidhi Stalin on Pawan Kalyan Comments | పవన్ కళ్యాణ్ కామెంట్స్ కి ఉదయనిధి కౌంటర్లు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు కీలక ప్రకటన చేసిన టీటీడీ
తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు కీలక ప్రకటన చేసిన టీటీడీ
PM Kisan Scheme: రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
Revanth Reddy On Musi : మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
WhatsApp New Features: ఇన్‌స్టాగ్రామ్‌ను చూసి వాట్సాప్ వాత పెట్టుకుంటుందా? - స్టేటస్‌లో రెండు కొత్త ఫీచర్లు!
ఇన్‌స్టాగ్రామ్‌ను చూసి వాట్సాప్ వాత పెట్టుకుంటుందా? - స్టేటస్‌లో రెండు కొత్త ఫీచర్లు!
OG Update: 'ఓజి' ఇండస్ట్రీ హిట్, రాసి పెట్టుకోండి... రిలీజ్‌కి ముందే హైప్ పెంచుతున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్
'ఓజి' ఇండస్ట్రీ హిట్, రాసి పెట్టుకోండి... రిలీజ్‌కి ముందే హైప్ పెంచుతున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్
World War III : మూడో ప్రపంచయుద్ధం వస్తే ఈ దేశాలు చాలా సేఫ్ - ముందే పాస్‌పోర్టులు, వీసాలు రెడీ చేసుకుంటే మంచిదేమో ?
మూడో ప్రపంచయుద్ధం వస్తే ఈ దేశాలు చాలా సేఫ్ - ముందే పాస్‌పోర్టులు, వీసాలు రెడీ చేసుకుంటే మంచిదేమో ?
Tirumala News: తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించండి- ప్రతి భక్తుడి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి- టీటీడీకి చంద్రబాబు కీలక సూచన
తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించండి- ప్రతి భక్తుడి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి- టీటీడీకి చంద్రబాబు కీలక సూచన
Best Budget Cars: రూ.7.5 లక్షల్లో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్ కార్లలో మామూలు పోటీ లేదుగా!
రూ.7.5 లక్షల్లో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్ కార్లలో మామూలు పోటీ లేదుగా!
Embed widget