అన్వేషించండి

Congress Protest: కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లకుండా కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న పోలీసులు!

Congress Protest: కాళేశ్వరం ప్రాజెక్టు చూసేందుకు వెళ్లిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడే రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున నినదాలు చేయడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.

Congress Protest: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరిన సీఎల్పీ బృందాన్ని పట్టణంలోని మణుగూరు క్రాస్ రోడ్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ములుగు ఎమ్మెల్యే సీతక్క, పోదెం వీరయ్యలతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన కోసం వెళ్లారు.

కాంగ్రెస్ నేతల అడ్డగింత

ముందుగానే విషయం తెలుసుకున్న పోలీసులు... వందల సంఖ్యలో అక్కడికి వచ్చారు. ప్రాజెక్టుల సందర్శనకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. అయినప్పటికీ.. కాంగ్రెస్ శ్రేణులు వినకుండా ముందుకు పోయేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు అంతా అక్కడే రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. 

కాంగ్రెస్ నాయకుల ధర్నా

కాళేశ్వరం సందర్శనకు వెళ్తున్న నేతలను పోలీసులు అడ్డుకోవడంపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా సందర్శనకు వెళ్తే పోలీసులు అడ్డుకోవడం, నిరంకుశ చర్య అని విమర్శించారు. నిజాం నాటి పాలనను సీఎం కేసీఆర్ కొనసాగిస్తున్నారని ఆరోపించారు. పోలీసుల దౌర్జన్యం నశించాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నినదించారు. సీఎం డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పోలీసులపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఈ ధర్నా కారణంగా దాదాపు 3 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు గోల చేశారు. ఎలాగైనా సరే ట్రాపిక్ తొలగించాలని కోరడంతో.. పోలీసులు కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసి పాల్వంచ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే అరెస్టయిన వారిలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క, పోదెం వీరయ్యలు ఉన్నారు. 

భద్రతా కారణాల వల్లే అనుమతి నిరాకరణ

భద్రతా కారణాల వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు అనుమతి ఇవ్వడం లేదని పోలీసులు కాంగ్రెస్ నాయకులకు వెల్లడించారు. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం ప్రాజెక్టులకు ఎందుకు వెళ్లనివ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద జరుగుతున్న రహస్యం ఏమిటని నిలదీశారు. ప్రాజెక్టులో ఉన్న లోపాలు బయట పడతాయనే భయంతోనే... సీఎం కేసీఆర్ పోలీసులతో చెప్పి తమను అక్కడికి వెళ్లనీయకుండా చేశారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కల్వకుంట్ల కుటుంబానికి ఏటీఎంలా మారిందని, దాని నుండి ధనార్జనే లక్ష్యం చేసుకున్నారని నాయకులు విమర్శించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BRS: గులాబీ దళం రీలోడెడ్ - కేసీఆర్ ప్రక్షాళన పర్వం.. పాత నేతలకు చెక్, యువతకు జై!
గులాబీ దళం రీలోడెడ్ - కేసీఆర్ ప్రక్షాళన పర్వం.. పాత నేతలకు చెక్, యువతకు జై!
Telangana 10th Class Results: రేపు తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల, కేశవరావు చేతుల మీదుగా రిజల్ట్స్
రేపు తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల, కేశవరావు చేతుల మీదుగా రిజల్ట్స్
Special Leave for Police: తెలంగాణ పోలీసులకు డీజీపీ గుడ్‌న్యూస్.. ఆ 2 రోజులు సెలవులపై ఉత్తర్వులు జారీ
తెలంగాణ పోలీసులకు డీజీపీ గుడ్‌న్యూస్.. ఆ 2 రోజులు సెలవులపై ఉత్తర్వులు జారీ
KTR on Kavitha Party: చాలా పార్టీలు వస్తూంటాయి, పోతూంటాయి - కవిత పార్టీపై కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్
చాలా పార్టీలు వస్తూంటాయి, పోతూంటాయి - కవిత పార్టీపై కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్

వీడియోలు

RCB vs DC IPL 2026 Highlights | ఢిల్లీని వణికించిన ఆర్‌సీబీ బౌలర్లు
Virat Kohli 9000 Runs in IPL | ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ విశ్వరూపం
DC vs RCB IPL 2026 Powerplay | పవర్ ప్లే లో చేతులెత్తేసిన ఢిల్లీ
Mitchell Santner Ruled Out IPL 2026 | ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్
Lungi Ngidi Shifted to AIIMS in 11 Mins | లుంగి ఎంగిడి కోసం ఢిల్లీ పోలీసుల గ్రీన్ కారిడార్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS: గులాబీ దళం రీలోడెడ్ - కేసీఆర్ ప్రక్షాళన పర్వం.. పాత నేతలకు చెక్, యువతకు జై!
గులాబీ దళం రీలోడెడ్ - కేసీఆర్ ప్రక్షాళన పర్వం.. పాత నేతలకు చెక్, యువతకు జై!
Crime News: చిత్తూరు జిల్లాలో దారుణం, జర్నలిస్టును కత్తితో నరికి హత్య చేసిన రౌడీ షీటర్!
చిత్తూరు జిల్లాలో దారుణం, జర్నలిస్టును కత్తితో నరికి హత్య చేసిన రౌడీ షీటర్!
Punjab Crisis: పంజాబ్‌ ప్రభుత్వమూ బీజేపీ ఖాతాలోకి మారుతోందా? - అక్కడా విలీన వ్యూహం అమలు కాబోతోందా?
పంజాబ్‌ ప్రభుత్వమూ బీజేపీ ఖాతాలోకి మారుతోందా? - అక్కడా విలీన వ్యూహం అమలు కాబోతోందా?
Telangana 10th Class Results: రేపు తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల, కేశవరావు చేతుల మీదుగా రిజల్ట్స్
రేపు తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల, కేశవరావు చేతుల మీదుగా రిజల్ట్స్
Special Leave for Police: తెలంగాణ పోలీసులకు డీజీపీ గుడ్‌న్యూస్.. ఆ 2 రోజులు సెలవులపై ఉత్తర్వులు జారీ
తెలంగాణ పోలీసులకు డీజీపీ గుడ్‌న్యూస్.. ఆ 2 రోజులు సెలవులపై ఉత్తర్వులు జారీ
Infosys Campus: విశాఖలో ఇన్ఫోసిస్‌ క్యాంపస్.. 20 ఎకరాలు భూమి కేటాయింపు.. రూ.750 కోట్ల ప్రాజెక్టుతో 7 వేల జాబ్స్
విశాఖలో ఇన్ఫోసిస్‌ క్యాంపస్.. 20 ఎకరాలు భూమి కేటాయింపు.. రూ.750 కోట్ల ప్రాజెక్టుతో 7 వేల జాబ్స్
Congress Rahul: కాంగ్రెస్‌లో చేరడమే పెద్ద రిస్క్ - రాహుల్ గాంధీకే నేరుగా చెప్పిన విద్యార్థిని - వీడియో వైరల్
కాంగ్రెస్‌లో చేరడమే పెద్ద రిస్క్ - రాహుల్ గాంధీకే నేరుగా చెప్పిన విద్యార్థిని - వీడియో వైరల్
Andhra University:
"శతాయుష్మాన్ భవ" ఏయూను దీవించిన ప్రముఖులు! ఘనంగా ముగిసిన శతాబ్ది వసంతాల వేడుకలు! ప్రత్యేక ఆకర్షణగా సచిన్, త్రివిక్రమ్
Embed widget