అన్వేషించండి

Bhubharati scam arrests: ధరణి రిజిస్ట్రేషన్లలో ఎడిట్ దగా - కోట్ల కుంభకోణం బట్టబయలు - 15 మంది అరెస్ట్!

Telangana: భూభారతి లోపాలను అడ్డం పెట్టుకుని స్కాం చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. రూ. 3.90 కోట్ల కుంభకోణంలో పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు.

Bhubharathi :  ధరణి , భూభారతి రిజిస్ట్రేషన్లను అడ్డు పెట్టుకుని ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. జనగామ, యాదాద్రి జిల్లాల్లో సంచలనం సృష్టించిన ఈ రూ. 3.90 కోట్ల కుంభకోణంలో ప్రమేయం ఉన్న 15 మంది నిందితులను జనగామ పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరో తొమ్మిది మంది పరారీలో ఉన్నారు. ఈ ముఠా నుండి రూ. 63.19 లక్షల నగదుతో పాటు సుమారు కోటి రూపాయల విలువైన ఆస్తి పత్రాలు, కారు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, 17 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ వివరాలను వెల్లడించారు. 

 టెక్నాలజీతో  చలాన్  మాయాజాలం                              

 కుంభకోణంలో ప్రధాన నిందితులైన పసునూరి బసవరాజు, జెల్లా పాండు యాదగిరిగుట్టలో ఆన్‌లైన్ సర్వీస్ సెంటర్లు నిర్వహిస్తూ ఈ మోసానికి తెరలేపారు. వీరు వెబ్‌సైట్‌లోని  ఇన్‌స్పెక్ట్ ఎలిమెంట్, ఎడిట్ అప్లికేషన్  ఆప్షన్లను ఉపయోగించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలాన్ రుసుమును సాఫ్ట్‌వేర్ ద్వారా తగ్గించేవారు. రైతుల వద్ద నుంచి పూర్తి మొత్తాన్ని వసూలు చేసి, ప్రభుత్వానికి మాత్రం తక్కువ మొత్తాన్ని చెల్లిస్తూ నకిలీ రసీదులను సృష్టించేవారు. ఈ నకిలీ చలాన్లను స్థానిక ఎమ్మార్వో , రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సమర్పించి రిజిస్ట్రేషన్లు పూర్తి చేయించేవారు. సులభంగా డబ్బు సంపాదించే క్రమంలో వీరు మీ-సేవ కేంద్రాలు, మధ్యవర్తులతో కలిసి ఈ దందా సాగించారు.

 1,080 డాక్యుమెంట్లు.. 22 కేసులు                                           

నిందితులు ఇప్పటివరకు జనగామ, యాదాద్రి జిల్లాల్లో సుమారు 1,080 డాక్యుమెంట్లకు సంబంధించి ఇలాంటి అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో మధ్యవర్తులకు, ఆన్‌లైన్ సెంటర్ల నిర్వాహకులకు 10 నుండి 30 శాతం వరకు కమిషన్లు ఇచ్చి ముఠాగా ఏర్పడ్డారు. ఈ భారీ కుంభకోణంపై ఇప్పటివరకు యాదాద్రి జిల్లాలో 15 కేసులు, జనగామ జిల్లాలో 7 కేసులు కలిపి మొత్తం 22 కేసులు నమోదయ్యాయి. అరెస్ట్ అయిన వారిలో పసునూరి బసవరాజు, జెల్లా పాండుతో పాటు గణేష్ కుమార్, శ్రీనాథ్, వెంకటేష్, శ్రావణ్ వంటి పలువురు నిందితులు ఉన్నారు.

 పోలీసుల చాకచక్యం - కమిషనర్ అభినందనలు                    

సాంకేతిక పరిజ్ఞానాన్ని అడ్డుపెట్టుకుని సాగుతున్న ఈ వ్యవస్థీకృత నేరాన్ని ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన జనగామ డీసీపీ  , ఏఎస్పీ  , ఇన్‌స్పెక్టర్లు  , ఇతర సిబ్బందిని పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు. పరారీలో ఉన్న మిగిలిన తొమ్మిది మంది నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే ఇలాంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు హెచ్చరించారు. రైతులు కూడా ఇటువంటి మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని, అధికారిక రసీదులను సరిచూసుకోవాలని సూచించారు.      

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం మధు రిడ్జ్ పార్క్ అపార్ట్‌మెంట్ స్థలం అక్కర్లేదు: సీఎం రేవంత్ రెడ్డి
గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం మధు రిడ్జ్ పార్క్ అపార్ట్‌మెంట్ స్థలం అక్కర్లేదు: సీఎం రేవంత్ రెడ్డి
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
Rangareddy Crime News: సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన
సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన
Hyderabad Police Raids QNet: క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
Advertisement

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
Strait of Hormuz: హర్మూజ్ జలసంధి దాటాలంటే 2 మిలియన్ డాలర్ల టోల్ టాక్స్.. ఇరాన్ కీలక ప్రకటన
హర్మూజ్ జలసంధి దాటాలంటే 2 మిలియన్ డాలర్ల టోల్ టాక్స్.. ఇరాన్ కీలక ప్రకటన
AMNS Steel Plant in Anakapalli: నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
Dhurandhar 2 Collections : 700 కోట్ల క్లబ్‌లో ధురంధర్ 2 - ఇండియన్ సినీ హిస్టరీలో సెకండ్ ప్లేస్‌... బాహుబలి, RRR రికార్డ్స్ బ్రేక్
700 కోట్ల క్లబ్‌లో ధురంధర్ 2 - ఇండియన్ సినీ హిస్టరీలో సెకండ్ ప్లేస్‌... బాహుబలి, RRR రికార్డ్స్ బ్రేక్
Rangareddy Crime News: సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన
సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన
Hyderabad Police Raids QNet: క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
Embed widget