అన్వేషించండి

PM Modi in Mahabubnagar: తెలంగాణలో వారి చేతుల్లో కారు స్టీరింగ్! ఈరోజు రాత్రి బీఆర్ఎస్, కాంగ్రెస్ కు నిద్రపట్టదు: ప్రధాని మోదీ

PM Modi Speech At Public Meeting in Mahabubnagar: తెలంగాణలో కారు స్టీరింగ్ ఎవరి చేతిలో ఉందో రాష్ట్ర ప్రజలకు తెలుసు.. కేవలం ఆ రెండు కుటుంబాల పాలనతోనే అభివృద్ధి జరగడం లేదని ప్రధాని మోదీ ఆరోపించారు.

PM Modi Speech At Public Meeting in Mahabubnagar: 
మహబూబ్ నగర్: తెలంగాణలో కారు స్టీరింగ్ ఎవరి చేతిలో ఉందో రాష్ట్ర ప్రజలకు తెలుసు.. కేవలం ఆ రెండు కుటుంబాల పాలన (బీఆర్ఎస్, ఎంఐఎం) కారణంగానే అభివృద్ధి జరగడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. కేవలం కమీషన్ల కోసమే ఈ కుటుంబాల పాలన జరుగుతోందని, మార్పు రావాలంటే బీజేపీని గెలిపించాలని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బీఆర్ఎస్, ఎంఐఎం నేతలు కుటుంబ వ్యవస్థగా, ప్రైవేట్ సంస్థగా మార్చేశారు.. ఇందులో సీఈఓ, డైరెక్టర్లు మొత్తం కుటుంబసభ్యులు ఉంటే.. చిన్న ఉద్యోగాల కోసం బయటివాళ్లను తీసుకుంటున్నారని ఆరోపించారు. మోదీ హామీ ఇచ్చారంటే నెరవేరుస్తారని, ఆ నమ్మకంతోనే పాలమూరులో బీజేపీ ప్రజాగర్జన సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారని చెప్పారు. ఈ సభతో తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి మోదీ నాంది పలికారు.

తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం రూ.13,500 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభం చేశానన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు బీజేపీకి మద్దతు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే, అవినీతి రహిత ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. మాట నిలబెట్టుకునే బీజేపీకి పట్టం కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాణి రుద్రమదేవి లాంటి వీర వనితలు పుట్టిన గడ్డ తెలంగాణ అని పేర్కొన్న ప్రధాని.. నారీ శక్తి కోసం మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించి వారి అవకాశాలు పెంచుతామన్నారు. మీ జీవితాలలో వెలుగులు నింపేందుకు ఢిల్లీలో ఒకరు ఉన్నారని గుర్తుంచుకోవాలన్నారు.

దేశం అభివృద్ధి చెందాలంటే జాతీయ రహదారులు ఎక్కువగా ఉండాలని, 2014కు ముందు కేవలం 2,500 కి.మీ జాతీయ రహదారి రాష్ట్రంలో ఉందన్నారు. కేవలం ఈ పదేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం అంతే మొత్తంలో రహదారులు నిర్మించిందన్నారు. దాంతో వ్యాపారులు, ఉద్యోగులతో పాటు పలు రంగాల వారికి దోహద పడిందన్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించే పంటకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర కల్పించింది. కాంగ్రెస్ హయాంలో కేవలం రూ.3,400 కోట్లకు మాత్రమే గిట్టుబాటు ధరతో కొనుగోలు చేయగా.. ఎన్డీఏ సర్కార్ రూ.27,000 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ సర్కార్ హంగామా చేస్తోంది, అవినీతికి పాల్పడిందని ప్రధాని మోదీ ఆరోపించారు. సభకు వచ్చిన స్పందన చూస్తే ఈరోజు రాత్రి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతలకు నిద్ర పట్టదన్నారు.

రుణమాఫీ పేరుతో రైతులను మోసింది బీఆర్ఎస్ సర్కార్, దానివల్ల అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతులకు అవసరమయ్యే ఎరువుల కోసం రూ.6 వేల కోట్లు ఖర్చుతో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ తెరిచామని పేర్కొన్నారు. తెలంగాణలో పసుపు రైతుల కోసం పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించాం. భారతదేశంలో అధిక పసుపు తెలంగాణ ఉత్పత్తి చేస్తోంది, రైతులకు ఆదుకునేందుకు జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. కళలు, సంస్కృతికి తెలంగాణ వేదిక. దక్షిణాఫ్రికా అధ్యక్షుడికి ఇక్కడ కళతో చేసిన గిఫ్ట్ ఇస్తే ప్రపంచ వ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతోంది. ఆదివాసీల కోసం విశ్వకర్మ యోజన పథకాన్ని తీసుకొచ్చామని గుర్తుచేశారు. ఆధునిక ఉపకరణాలు అందించడంతో పాటు ఉత్పత్తులకు మార్కెట్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలోని ములుగు జిల్లాలో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నాం. రూ.900 కోట్లతో ఏర్పాటు చేయనున్న వర్సిటీకి సమ్మక్క సారక్కగా నామకరణం చేశామన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: నా జీవితంలో ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి: చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
CM Chandrababu: నా జీవితంలో ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి: చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
Gutha Sukhender Reddy: కుల గణన చారిత్రాత్మకం- ఓటర్ల జనాభాకు, సర్వే లెక్కలకు అసలు పొంతన లేదు: గుత్తా సుఖేందర్ రెడ్డి
కుల గణన చారిత్రాత్మకం- ఓటర్ల జనాభాకు, సర్వే లెక్కలకు అసలు పొంతన లేదు: గుత్తా సుఖేందర్ రెడ్డి
SSMB 29: మహేష్ మూవీ కోసం రెండు టైటిల్స్... జక్కన్న మనసు మాత్రం ఆ టైటిల్ మీదేనా?
మహేష్ మూవీ కోసం రెండు టైటిల్స్... జక్కన్న మనసు మాత్రం ఆ టైటిల్ మీదేనా?
Crime News: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, 7 మంది తెలుగు భక్తులు మృతి - కుంభమేళాకు వెళ్లొస్తుంటే విషాదం
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, 7 మంది తెలుగు భక్తులు మృతి - కుంభమేళాకు వెళ్లొస్తుంటే విషాదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Attack on Chilkur Balaji Temple Rangarajan | రామరాజ్యం స్థాపించటానికి వచ్చాం అంటూ దాడి | ABP DesamVishwak sen on Prudhviraj Controversy | 11 గొర్రెలు కాంట్రవర్సీపై విశ్వక్ సారీ | ABP DesamAllu Aravind on Ram Charan | రామ్ చరణ్ పై వ్యాఖ్యల వివాదం మీద అల్లు అరవింద్ | ABP DesamPresident Murmu in Maha kumbh 2025 | మహా కుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: నా జీవితంలో ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి: చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
CM Chandrababu: నా జీవితంలో ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి: చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
Gutha Sukhender Reddy: కుల గణన చారిత్రాత్మకం- ఓటర్ల జనాభాకు, సర్వే లెక్కలకు అసలు పొంతన లేదు: గుత్తా సుఖేందర్ రెడ్డి
కుల గణన చారిత్రాత్మకం- ఓటర్ల జనాభాకు, సర్వే లెక్కలకు అసలు పొంతన లేదు: గుత్తా సుఖేందర్ రెడ్డి
SSMB 29: మహేష్ మూవీ కోసం రెండు టైటిల్స్... జక్కన్న మనసు మాత్రం ఆ టైటిల్ మీదేనా?
మహేష్ మూవీ కోసం రెండు టైటిల్స్... జక్కన్న మనసు మాత్రం ఆ టైటిల్ మీదేనా?
Crime News: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, 7 మంది తెలుగు భక్తులు మృతి - కుంభమేళాకు వెళ్లొస్తుంటే విషాదం
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, 7 మంది తెలుగు భక్తులు మృతి - కుంభమేళాకు వెళ్లొస్తుంటే విషాదం
Rana Daggubati: తెలుగులో రిలీజ్ కాని రానా దగ్గుబాటి మూవీ... సమంత నటించిన ఆ ఫ్లాప్ సినిమా పేరేంటో తెలుసా?
తెలుగులో రిలీజ్ కాని రానా దగ్గుబాటి మూవీ... సమంత నటించిన ఆ ఫ్లాప్ సినిమా పేరేంటో తెలుసా?
Romantic Destinations : రొమాంటిక్ డెస్టినేషన్స్.. మీ ప్రేయసితో కలిసి వెళ్లేందుకు ఇండియాలో బెస్ట్ ప్లేస్​లు ఇవే
రొమాంటిక్ డెస్టినేషన్స్.. మీ ప్రేయసితో కలిసి వెళ్లేందుకు ఇండియాలో బెస్ట్ ప్లేస్​లు ఇవే
Viral Video: ఇదేందయ్యా ఇది.. మ్యాచ్ లో ఫీల్డింగ్ చేసిన కోచ్.. నెటిజన్ల ట్రోల్ 
ఇదేందయ్యా ఇది.. ఇంటర్నేషనల్ మ్యాచ్ లో ఫీల్డింగ్ చేసిన కోచ్.. నెటిజన్ల ట్రోల్ 
Sankranthiki Vasthunam: 'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్ పై హింట్ ఇచ్చిన వెంకటేష్... రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్ పై హింట్ ఇచ్చిన వెంకటేష్... రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
Embed widget