అన్వేషించండి

PM Modi: తెలంగాణలో డబుల్‌ఆర్ ట్యాక్స్ వసూళ్లు, దాంతో ఢిల్లీలో కప్పం - జహీరాబాద్‌లో మోదీ

Telangana News: జహీరాబాద్ లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు పరస్ఫరం సహకరించుకుంటూ తోడు దొంగలుగా ఉంటున్నారని మోదీ అన్నారు.

PM Modi Comments in Zaheerabad: ఈ పదేళ్లలో దేశం ఎంత ముందుకు వెళ్లిందో దేశ ప్రజలు అంతా చూశారని, అంతకుముందు కాంగ్రెస్ పాలనలో అంత అవినీతి ఉందో కూడా అందరూ చూశారని ప్రధాని మోదీ అన్నారు. భారత్ ను కాంగ్రెస్ పార్టీ అవినీతి ఊబిలోకి నెట్టేసిందని అన్నారు. ‘‘కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉన్నా పంచ సూత్రాలతో పాలన చేస్తుంది. కాంగ్రెస్ పంచసూత్రాలు అంటే అవినీతి, అబద్ధాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు, మాఫియా, కుటుంబ రాజకీయాలు’’ అని ప్రధాని మోదీ అన్నారు. జహీరాబాద్ లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. 

తెలంగాణలో డబుల్ ఆర్ ట్యాక్ వసూలు చేస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. డబుల్ ఆర్ ట్యాక్ వసూలు చేసి ఢిల్లీలో కప్పం కడుతున్నారని.. వెంటనే ఆ డబుల్ ఆర్ ట్యాక్స్‌ను అడ్డుకోవాలని ప్రధాని మోదీ పిలుపు ఇచ్చారు. వ్యాపారులు, కాంట్రాక్టర్లు దొడ్డిదారిలో డబుల్ ఆర్ ట్యాక్స్ కడుతున్నారని ఆరోపించారు. పొరపాటున కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే మన పైన సంపద పన్ను కూడా వేస్తారని.. అలా మన సంపదలో 55 శాతాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పారు. మొన్నటి వరకూ తెలంగాణను బీఆర్ఎస్ పార్టీ దోచుకుంటే.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దోచుకుంటుందని అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అవినీతి కుంభకోణం. బీఆర్ఎస్ పాలనలో ఓటుకు నోటు కేసును తొక్కి పెట్టారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు వేర్వేరు కాదు.. అవి రెండు ఒకటే పార్టీలు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం కుంభకోణంపై కాంగ్రెస్ మాట్లాడింది. అధికారంలోకి రాగానే కాళేశ్వరం కుంభకోణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తొక్కి పెట్టింది. అలా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పరస్ఫరం సహకరించుకుంటూ తోడు దొంగలుగా ఉంటున్నారు. 

రైతులను బీజేపీ భగవత్ స్వరూపులుగా పరిగణిస్తోంది. 100 రోజుల్లో రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి కూడా ఇవ్వలేదు. 

అయోధ్యలో రామ మందిర నిర్మాణం 500 ఏళ్లుగా భారతీయుల కల. అక్కడ అయోధ్య మందిరం నిర్మాణం మోదీ వల్లనో, బీజేపీ వల్లనో కాలేదు. మీ ఓటు వల్లనే సాధ్యం అయింది. ఇటు హైదరాబాద్ లో పండుగలు జరుపుకోవాలంటే ఎన్నో ఆంక్షలు ఉన్నాయి. ఓ వర్గం ఓట్ల కోసమే హైదరాబాద్ లో పండుగలపై ఆంక్షలు విధిస్తున్నారు’’ అని ప్రధాని మోదీ అన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
Vaammo Vaayyo Song Lyrics : ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
Vaammo Vaayyo Song Lyrics : ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
Venezuela : వెనిజులా రాజధాని కారకాస్‌పై క్షిపణి దాడి! పలు చోట్ల విధ్వంసం!
వెనిజులా రాజధాని కారకాస్‌పై క్షిపణి దాడి! పలు చోట్ల విధ్వంసం!
Maoist Latest News: ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
Hyundai Creta నుంచి Tata Sierra వరకు - కొత్త Seltos ముందు బలంగా నిలబడే కారు ఏది?
కొత్త Kia Seltos - ధర, స్పెసిఫికేషన్లలో ఇతర కార్ల కంటే బెటర్‌గా ఉందా?
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Embed widget