అన్వేషించండి

Group 1 Mains Exams: కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ - గ్రూప్ - 1 అభ్యర్థులతో విడివిడిగా భేటీ, పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ

Telangana News: తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ వివాదం ముదురుతోంది. పరీక్ష వాయిదా వేయాలంటూ అభ్యర్థుల ఆందోళనలతో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వారితో భేటీ అయ్యారు.

Group 1 Mains Exams Issue In Telangana: తెలంగాణలో గ్రూప్ - 1 మెయిన్స్ పరీక్షల వివాదం ముదురుతోంది. మెయిన్స్ వాయిదా వేయాలంటూ అభ్యర్థుల ఆందోళనతో నగరంలో వాతావరణం హీటెక్కింది. అటు, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల కీలక నేతలతో అభ్యర్థులతో భేటీ కావడంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. గాంధీ భవన్‌లో గ్రూప్ - 1 అభ్యర్థులతో (Group 1 Aspirants) పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) గురువారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. వారి డిమాండ్లను సావధానంగా విన్నారు. జీవో 29 రద్దు చేసి పరీక్షలు నిర్వహించాలని.. పాత జీవో 55 ప్రకారం పరీక్షలు జరగాలన్నారు. పాత నోటిఫికేషన్‌లో ఇచ్చిన 503 పోస్టుల్లో కొత్త అభ్యర్థులకు అవకాశం ఇవ్వొద్దన్నారు. పెంచిన 60 పోస్టుల్లో మాత్రమే కొత్తగా అప్లై చేసుకున్న వారికి అవకాశం ఇవ్వాలని తెలిపారు. పాత నోటిఫికేషన్ ప్రకారమే రిజర్వేషన్లు, ఓపెన్ క్యాటగిరీ ప్రకారం పరీక్షలు ఉండాలని.. రిజర్వేషన్ అంశాల్లో కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని పరిష్కరించి పరీక్షలు నిర్వహించాలన్నారు. దీనిపై స్పందించిన మహేశ్ కుమార్ గౌడ్.. ఈ డిమాండ్లపై ప్రభుత్వానికి సమాచారం ఇస్తామని.. సాయంత్రంలోపు క్లారిటీ ఇస్తామని స్పష్టం చేశారు.

కేటీఆర్‌పై ఫైర్

మరోవైపు, బీఆర్ఎస్ హయాంలో మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేస్తారా.? అంటూ కేటీఆర్‌కు పీసీసీ చీఫ్ సవాల్ విసిరారు. నిరుద్యోగుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే డీఎస్సీ, వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాలు, గ్రూప్స్, పోలీస్ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. పదేళ్ల అధికారంలో ఉన్నప్పుడు ఏడున్నర లక్షల కోట్ల అప్పులు చేసి మిగులు రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

'అభ్యర్థులకు అండగా ఉంటాం'

అటు, తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోనూ గ్రూప్ - 1 అభ్యర్థులు భేటీ అయ్యారు. జీవో నెంబర్ 29 ఎత్తివేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని.. మెయిన్స్ వాయిదా వేసేలా చూడాలని కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. అభ్యర్థులకు తప్పకుండా సహకరిస్తామని.. ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళ్తే పార్టీ తరఫున అండగా ఉంటామని స్పష్టం చేశారు. కాగా, గ్రూప్ 1 మెయిన్స్ రీషెడ్యూల్ చేయాలని అభ్యర్థులు గత కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం వందలాది మంది అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. గ్రూప్ - 1 ప్రిలిమ్స్ పరీక్షపై దాదాపు 33 కేసులు వచ్చాయని.. వాటన్నింటినీ పరిష్కరించిన తర్వాతే మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. అభ్యర్థులంతా ఒక్కసారిగా దూసుకురావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. సమాచారం అందుకున్న పోలీసులు అభ్యర్థులను అరెస్ట్ చేసి వివిధ స్టేషన్లకు తరలించారు.

మెయిన్స్ నిర్వహణపై సీఎస్ సమీక్ష

అయితే, ఈ వివాదం కొనసాగుతుండగానే ఈ నెల 21 నుంచి షెడ్యూల్ ప్రకారం మెయిన్స్ నిర్వహణకు సన్నద్ధమవుతోంది. ఈ నెల 14న టీజీపీఎస్సీ హాల్ టికెట్లను విడుదల చేసింది. ఈ క్రమంలోనే గ్రూప్ - 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు.

Also Read: Konda Surekha : వరుస వివాదాలతో సొంత పార్టీకి సమస్యగా మారిన కొండా సురేఖ - రేవంత్ కూడా కాపాడలేరా ?

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: యశోదా ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్.. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ అధినేత
యశోదా ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్.. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ అధినేత
HYDRAA Ranganath High Court Orders: హైడ్రా కమిషనర్‌కు బిగ్ షాక్ - రంగనాథ్‌ను తప్పించాలని హైకోర్టు ఆదేశం !
హైడ్రా కమిషనర్‌కు బిగ్ షాక్ - రంగనాథ్‌ను తప్పించాలని హైకోర్టు ఆదేశం !
Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jr NTR Shoulder Injury : ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Tammineni Sitaram Forgery Case: తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
Karur Stampede Victims Jobs Case : సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
Bonda Uma Issue: బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
Vallabhaneni Vamsi To Meet CM Chandrababu: చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
Elon Musk Reject Racism Claims: నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Anti Paper Leak Bill: లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
Embed widget