అన్వేషించండి

Satyavathi Rathod: అలాంటి వ్యక్తులు ద్రోహులుగా మిగిలిపోతారు: మంత్రి సత్యవతి రాథోడ్

మహబూబాబాద్ జిల్లాకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చిన మెడికల్ కాలేజీని అడ్డుకునే ప్రయత్నం చేసేవారు జిల్లా ద్రోహులుగా మిగిలిపోతారని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.

పేదలకు మెరుగైన వైద్యం అందించడంలో భాగంగా మహబూబాబాద్ జిల్లాకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చిన మెడికల్ కాలేజీని అడ్డుకునే ప్రయత్నం చేసేవారు జిల్లా ద్రోహులుగా మిగిలిపోతారని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ మెడికల్ కాలేజీకి ఎంపిక చేసిన స్థలం విషయంలో పేదలు నష్టపోతే వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.  జిల్లా అభివృద్ధిలో నేతలంతా కలిసి పనిచేయాలన్నారు. దాదాపు 2 కోట్ల రూపాయల విలువైన ఆక్సిజన్ ప్లాంట్‌ను మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రిలో సత్యవతి రాథోడ్ నేడు ప్రారంభించారు. 

అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలిపారు. మన జిల్లాలోనూ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నాం. మిషన్ సంజీవని పేరుతో ఆక్స్ ఫామ్ ఇండియా సంస్థ దేశ వ్యాప్తంగా ప్లాంట్స్ ఏర్పాటు చేస్తోంది. ఇక్కడ సైతం రూ. 1.40 కోట్ల విలువైన ఆక్సిజన్ ప్లాంట్, జనరేటర్ అందించారు. ములుగు, ప్రొఫెసర్ జయశంకర్ జిల్లాలతో పాటు తోర్రురులో వైద్య సదుపాయాలు, హాస్పిటల్ కోసం నిధులు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

Also Read: ఈ నెల 14 నుంచి గెజిట్ అమలు... కేఆర్ఎంబీ కీలక ప్రకటన... బోర్డు పరిధిలోకి జల విద్యుత్ పై తెలంగాణ అభ్యంతరం

కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు..
‘మహబూబాబాద్ జిల్లాలో ఇదివరకే టి. డయాగ్నస్టిక్ సెంటర్ తెచ్చుకున్నాం. తాజాగా మనకు మెడికల్ కాలేజీ వచ్చింది. నర్సింగ్ కాలేజీకి టెండర్లు కూడా పిలిచాం. కరోనా సమయంలో ఆక్సిజన్ ఆక్సిజన్ బెడ్స్ లేక సమస్యలు ఎదుర్కొన్నాం. ఇకపై ఆ సమస్య ఉండదు. జిల్లా మెడికల్ కాలేజీకి అవసరమైన టీచింగ్ సిబ్బందిని నియమించుకుంటున్నాం. పార్లమెంట్ ఎన్నికల సమయంలో మెడికల్ కాలేజీ ఇస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు కాలేజీ ఇస్తున్నట్లు సీఎం కేసిఆర్ ఫోన్ చేసి చెప్పారు. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యము లభిస్తుందని సంతోషించాను.

Also Read: ఏపీలోనే విద్యుత్ కష్టాలు..! తెలంగాణలో "పవర్" ఫుల్లేనా ?

మహబూబాబాద్ జిల్లా 551 సర్వేలో ఎవరికీ కేటాయించని, వ్యవసాయం చేయని స్థలం గుర్తించి 70 ఎకరాలలో 30 ఎకరాలు మెడికల్ కాలేజీకి ఇచ్చాం. 551 సర్వేలో 640 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 100 ఎకరాలు కూడా ప్రభుత్వ అవసరాల కోసం తీసుకోలేదు. మెడికల్ కాలేజీతో ఇక్కడి గిరిజన, పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందనుంది. కరోనా సమయంలో నా ఎంపీ నిధుల నుంచి రూ.85 లక్షలతో ఏరియా హాస్పిటల్‌లో వైద్య సదుపాయాలు కల్పించా. మెడికల్ కాలేజీ కోసం నవంబర్‌లో ఢిల్లీ నుంచి వైద్య బృందం రానుంది. ప్రజలకు మేలు చేసే మెడికల్ కాలేజీని అడ్డుకుంటే జిల్లా ద్రోహులుగా మిగిలిపోతారని’ మంత్రి సత్యవతి రాథోడ్ వ్యాఖ్యానించారు.

ఆ భూముల జోలికి వెళ్లొద్దు..
ఇక్కడ పోడు భూముల సమస్య ఉంది. కానీ గతంలో ప్రజలకు ఇచ్చిన భూములను అసైన్డ్ పట్టాలని వాటిని ఫారెస్ట్ అధికారులు రద్దు చేయగా.. సీఎం కేసీఆర్ వారి సమస్య పరిష్కారం కోసం యత్నిస్తున్నారు. 2005కు ముందు నుంచి పోడు చేసుకునే గిరిజనుల జోలికి అటవీ అధికారులు వెళ్లవద్దు. భవిష్యత్తులోనూ సమస్య రాకుండా ఉండేందుకు సమగ్ర సర్వే చేసి మార్క్ చేయాలని కోరుతున్నారు.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఢిల్లీ చేరకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, అరెస్టు చేస్తారా?
ఢిల్లీ చేరకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, అరెస్టు చేస్తారా?
GHMC Elections Old City Hyderabad: గ్రేటర్ సమరంలో మారుతున్న సమీకరణాలు - ఎంఐఎం కోటపై కాంగ్రెస్, ఎంబీటీ కలసి దాడి చేయబోతున్నాయా?
గ్రేటర్ సమరంలో మారుతున్న సమీకరణాలు - ఎంఐఎం కోటపై కాంగ్రెస్, ఎంబీటీ కలసి దాడి చేయబోతున్నాయా?
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్‌లో ఎబోలా టెన్షన్.. సూడాన్ పౌరుడి రిపోర్ట్ నెగెటివ్! రెండో కేసుపై ఉత్కంఠ
హైదరాబాద్‌లో ఎబోలా టెన్షన్.. సూడాన్ పౌరుడి రిపోర్ట్ నెగెటివ్! రెండో కేసుపై ఉత్కంఠ

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: ఢిల్లీ చేరకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, అరెస్టు చేస్తారా?
ఢిల్లీ చేరకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, అరెస్టు చేస్తారా?
CJP Protest: కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi Great Nicobar Project: అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
Buchi Babu Sana: జాన్వీ కపూర్ డ్రస్‌లేంటి? కెమెరా యాంగిల్స్ ఏంటి? విమర్శలపై స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు
జాన్వీ కపూర్ డ్రస్‌లేంటి? కెమెరా యాంగిల్స్ ఏంటి? విమర్శలపై స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు
US Iran conflict:హొర్ముజ్‌ జలసంధి వద్ద మరోసారి ఉద్రిక్తత! ఇరాన్ డ్రోన్‌లను కూల్చివేసిన అమెరికా! ఆయుధాలపై ట్రంప్ కీలక ప్రకటన!
హొర్ముజ్‌ జలసంధి వద్ద మరోసారి ఉద్రిక్తత! ఇరాన్ డ్రోన్‌లను కూల్చివేసిన అమెరికా! ఆయుధాలపై ట్రంప్ కీలక ప్రకటన!
Peddi Collections Day 2: రామ్ చరణ్ ర్యాంపేజ్... రెండో రోజూ 'పెద్ది' జోరు... ఫ్రైడే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
రామ్ చరణ్ ర్యాంపేజ్... రెండో రోజూ 'పెద్ది' జోరు... ఫ్రైడే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
India Predicted Playing XI Vs AFG: ఆఫ్గాన్ తో టీమిండియా పోరు.. బుమ్రా, జడేజా లేకుండానే బరిలోకి.. ముల్లాన్‌పూర్ లో కొత్త ప్లేయర్ టెస్ట్ డెబ్యూ..!
ఆఫ్గాన్ తో టీమిండియా పోరు.. బుమ్రా, జడేజా లేకుండానే బరిలోకి.. ముల్లాన్‌పూర్ లో కొత్త ప్లేయర్ టెస్ట్ డెబ్యూ..!
Embed widget