అన్వేషించండి

Telangana Revenue: ప్రజలపై పన్నుల భారం వేయకుండానే ఆదాయం పెంపు: సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహం

Revanth Reddy | తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు పన్నుల పెంపు ఒక్కటే మార్గం కాదని, పన్నులు పెంచితే ప్రజల నుంచి తీవ్ర నిరసనలు ఎదురవుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు పన్నుల పెంపు ఒక్కటే మార్గం కాదని, పన్నులు పెంచితే ప్రజల నుంచి నిరసనలు ఎదురవుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలపై ఎలాంటి అదనపు పన్ను భారం వేయకుండానే, కేవలం వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడం ద్వారా ఆదాయాన్ని గణనీయంగా పెంచవచ్చని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

వ్యవస్థాగత సంస్కరణలే కీలకం 
ఇంటి పన్ను, జీఎస్టీ, మైనింగ్, ఎక్సైజ్ వంటి రంగాల్లో పన్నులు ఎగ్గొట్టే వారిని గుర్తించి, వారిని పన్నుల పరిధిలోకి తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఇందుకోసం సీనియర్ అధికారి అరవింద్ సుబ్రమణ్యం నేతృత్వంలో ఒక ప్రత్యేక బృందాన్ని, ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ వంటి అధికారులతో ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సంస్కరణల ఫలితంగా గడిచిన నాలుగు నెలల్లో ఆదాయం క్రమంగా పెరుగుతూ వచ్చిందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యంగా డిసెంబర్ నుండి ప్రతి నెల 500 కోట్ల చొప్పున పెరుగుతూ, ఏప్రిల్ నెలలో ఏకంగా 1000 కోట్ల రూపాయల అదనపు ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు. ఈ నెల జీఎస్టీ ఆదాయంలో 35 శాతం వృద్ధి నమోదవ్వడం విశేషమని ఆయన గుర్తుచేశారు

లీకేజీలు అరికట్టడం ద్వారా పెరిగిన ఆదాయం 
చిన్న చిన్న లీకేజీలను అరికట్టడం, వ్యవస్థలో చిన్నపాటి మార్పులు చేయడం ద్వారా గత నాలుగు నెలల్లో దాదాపు 2000 కోట్ల రూపాయల ఆదాయం పెరిగిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గత ఎనిమిదేళ్లుగా 600 కోట్ల వద్దే స్తంభించిపోయిన మైనింగ్ ఆదాయం, అధికారుల కృషి వల్ల ప్రస్తుతం 1100 కోట్లకు చేరిందని వివరించారు. ఎలాంటి అదనపు పన్నులు విధించకుండానే కేవలం అధికారుల పనితీరును మెరుగుపరచడం ద్వారా ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని కొనియాడారు. 

ఏటా రూ. 36 వేల కోట్ల అదనపు ఆదాయమే లక్ష్యం 
అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహిస్తే నెలకు 3000 కోట్ల రూపాయల వరకు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉందని, తద్వారా ఏడాదికి 36,000 కోట్ల రూపాయల మేర రాష్ట్ర ఖజానాకు సమకూరుతుందని సీఎం రేవంత్ రెడ్డి అంచనా వేశారు. ఈ అదనపు ఆదాయం ద్వారా రాష్ట్రంలోని ఉద్యోగుల సమస్యలతో పాటు అనేక ఇతర సమస్యలను పరిష్కరించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఏడాది తిరిగేలోపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో స్థిరత్వం ఏర్పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మున్సిపల్ రిఫార్మ్స్ వల్ల కూడా అన్ని మున్సిపాలిటీల్లో ఆదాయం పెరిగిందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: యశోదా ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్.. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ అధినేత
యశోదా ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్.. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ అధినేత
HYDRAA Ranganath High Court Orders: హైడ్రా కమిషనర్‌కు బిగ్ షాక్ - రంగనాథ్‌ను తప్పించాలని హైకోర్టు ఆదేశం !
హైడ్రా కమిషనర్‌కు బిగ్ షాక్ - రంగనాథ్‌ను తప్పించాలని హైకోర్టు ఆదేశం !
Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jr NTR Shoulder Injury : ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Tammineni Sitaram Forgery Case: తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
Karur Stampede Victims Jobs Case : సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
Bonda Uma Issue: బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
Vallabhaneni Vamsi To Meet CM Chandrababu: చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
Elon Musk Reject Racism Claims: నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Anti Paper Leak Bill: లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
Embed widget