అన్వేషించండి

Telangana Revenue: ప్రజలపై పన్నుల భారం వేయకుండానే ఆదాయం పెంపు: సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహం

Revanth Reddy | తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు పన్నుల పెంపు ఒక్కటే మార్గం కాదని, పన్నులు పెంచితే ప్రజల నుంచి తీవ్ర నిరసనలు ఎదురవుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు పన్నుల పెంపు ఒక్కటే మార్గం కాదని, పన్నులు పెంచితే ప్రజల నుంచి నిరసనలు ఎదురవుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలపై ఎలాంటి అదనపు పన్ను భారం వేయకుండానే, కేవలం వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడం ద్వారా ఆదాయాన్ని గణనీయంగా పెంచవచ్చని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

వ్యవస్థాగత సంస్కరణలే కీలకం 
ఇంటి పన్ను, జీఎస్టీ, మైనింగ్, ఎక్సైజ్ వంటి రంగాల్లో పన్నులు ఎగ్గొట్టే వారిని గుర్తించి, వారిని పన్నుల పరిధిలోకి తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఇందుకోసం సీనియర్ అధికారి అరవింద్ సుబ్రమణ్యం నేతృత్వంలో ఒక ప్రత్యేక బృందాన్ని, ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ వంటి అధికారులతో ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సంస్కరణల ఫలితంగా గడిచిన నాలుగు నెలల్లో ఆదాయం క్రమంగా పెరుగుతూ వచ్చిందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యంగా డిసెంబర్ నుండి ప్రతి నెల 500 కోట్ల చొప్పున పెరుగుతూ, ఏప్రిల్ నెలలో ఏకంగా 1000 కోట్ల రూపాయల అదనపు ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు. ఈ నెల జీఎస్టీ ఆదాయంలో 35 శాతం వృద్ధి నమోదవ్వడం విశేషమని ఆయన గుర్తుచేశారు

లీకేజీలు అరికట్టడం ద్వారా పెరిగిన ఆదాయం 
చిన్న చిన్న లీకేజీలను అరికట్టడం, వ్యవస్థలో చిన్నపాటి మార్పులు చేయడం ద్వారా గత నాలుగు నెలల్లో దాదాపు 2000 కోట్ల రూపాయల ఆదాయం పెరిగిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గత ఎనిమిదేళ్లుగా 600 కోట్ల వద్దే స్తంభించిపోయిన మైనింగ్ ఆదాయం, అధికారుల కృషి వల్ల ప్రస్తుతం 1100 కోట్లకు చేరిందని వివరించారు. ఎలాంటి అదనపు పన్నులు విధించకుండానే కేవలం అధికారుల పనితీరును మెరుగుపరచడం ద్వారా ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని కొనియాడారు. 

ఏటా రూ. 36 వేల కోట్ల అదనపు ఆదాయమే లక్ష్యం 
అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహిస్తే నెలకు 3000 కోట్ల రూపాయల వరకు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉందని, తద్వారా ఏడాదికి 36,000 కోట్ల రూపాయల మేర రాష్ట్ర ఖజానాకు సమకూరుతుందని సీఎం రేవంత్ రెడ్డి అంచనా వేశారు. ఈ అదనపు ఆదాయం ద్వారా రాష్ట్రంలోని ఉద్యోగుల సమస్యలతో పాటు అనేక ఇతర సమస్యలను పరిష్కరించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఏడాది తిరిగేలోపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో స్థిరత్వం ఏర్పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మున్సిపల్ రిఫార్మ్స్ వల్ల కూడా అన్ని మున్సిపాలిటీల్లో ఆదాయం పెరిగిందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు..!
మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు..!
Revanth Reddy Indiramma Housing: హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
Nirmal Supari Murder Case: సవతి తల్లితో వివాహేతర బంధం - చివరికి మర్డర్ - చేయించింది కూడా సవతి తల్లే !
సవతి తల్లితో వివాహేతర బంధం - చివరికి మర్డర్ - చేయించింది కూడా సవతి తల్లే !
Telangana High Court Order: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు - బాధితురాలి వివరాలున్న 200 సోషల్ మీడియా పోస్టులు తొలగించాలని ఆదేశం!
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు - బాధితురాలి వివరాలున్న 200 సోషల్ మీడియా పోస్టులు తొలగించాలని ఆదేశం!
Advertisement

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi video:
"స్పందించి సలహాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు" మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రధానమంత్రి
Revanth Reddy Indiramma Housing: హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
CJP Protest: సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
Ashes Test In India:  షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
Brezza Facelift: మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
Ravneet Singh Bittu Resign: ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
Raj Kundra Legal War: రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
NTA 47 Officials Removed: నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
Embed widget