అన్వేషించండి

Prashanth Reddy: ఉద్యోగుల సహకారంతోనే అన్ని రంగాల్లో అగ్రగామిగా తెలంగాణ : మంత్రి వేముల

పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగులను తాము ఎన్నడు కూడా వేరు చేసి చూడలేదని, వారితో ప్రభుత్వానికి ఉన్నది పేగు బంధం అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.

TS Minister Prashanth Reddy: తెలంగాణ అనే పదానికి టీ ఎన్జీఓలు మారుపేరుగా నిలుస్తున్నారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగులను తాము ఎన్నడు కూడా వేరు చేసి చూడలేదని, వారితో ప్రభుత్వానికి ఉన్నది పేగు బంధం అని మంత్రి స్పష్టం చేశారు. టీ ఎన్ జీ ఓ ల సంఘం నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన డైరీ, క్యాలెండర్ లను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయoలో ఆవిష్కరించారు.

రాష్ట్ర ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర అమోఘం
ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఉద్యోగుల పాత్ర అమోఘమని, 1967 నాటి ఉద్యమంలోనూ ఆమోస్ నేతృత్వంలో ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడారని గుర్తు చేశారు. మలి దశ తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులతో కలిసి పోరాడే అవకాశం లభించడాన్ని అదృష్టంగా భావిస్తున్నామని, తెలంగాణ ఉద్యమానికి ఉద్యోగులు ఉత్ప్రేరకంగా నిలిచారని కొనియాడారు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగుల పట్ల ఎల్లవేళలా ఉదార స్వభావంతోనే వ్యవహరిస్తారని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందంటే, అందుకు ఉద్యోగుల కృషి ప్రధాన కారణమని అన్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను, సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలు చేస్తూ అట్టడుగున ఉన్న ప్రజల వరకు తీసుకెళ్తున్నారని, ఫలితంగానే అభివృద్ధి చెందిన గ్రామాల సర్వేలో దేశంలోనే ఇరవైకి గాను 19  గ్రామ పంచాయతీలు తెలంగాణకు చెందినవే ఎంపికయ్యాయని గుర్తు చేశారు. వీటిలో ఒక్క నిజామాబాదు జిల్లాలోనివే ఐదు గ్రామాలు ఉన్నాయని తెలిపారు. 

తలసరి ఆదాయం రూ.2 .78కు పెరిగింది
ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఎంతో అంకితభావంతో, పారదర్శకంగా ఉద్యోగులు అమలు చేయడం వల్లే ఈ ఘనత దక్కిందన్నారు. ఉద్యోగుల తోడ్పాటుతో తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయంలోనూ నెంబర్ వన్ గా నిలిచిందన్నారు మంత్రి వేముల. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి తలసరి ఆదాయం రూ. లక్షా 28 వేలు ఉంటే, ప్రస్తుతం అది రూ.2 .78 లక్షలకు పెరిగిందన్నారు. ఆదాయ వృద్ధిలోనూ జాతీయ స్థాయిలో వృద్ధిరేటు 9 శాతం ఉండగా, తెలంగాణ రాష్ట్రంలో 16 శాతం ఉందని వివరించారు. దేశంలోనే ఉద్యోగులకు అత్యధిక జీతాలు అందిస్తున్నది కూడా తెలంగాణ రాష్ట్రమేనని, ఇది తమకు ఎంతో గర్వకారణంగా నిలుస్తుందన్నారు. ఇదే స్పూర్తితో ఉద్యోగులు ముందుకు సాగాలని మంత్రి పిలుపునిచ్చారు. వారి సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.

సీఎం కేసీఆర్ నాయకత్వంలో పార్టీలకు, రాజకీయాలకు, అతీతంగా రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని అన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. బాల్కొండ నియోజకవర్గంలోని ఏర్గట్ల మండలంలో ఆదివారం ఒక్కరోజే సుమారు 6 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసినట్లు తెలిపారు. అభివృద్ది చేస్తున్నది ఎవరు మాటలు చెప్తున్నది ఎవరు అని ప్రజలు ఆలోచన చేయాలని అన్నారు. ధర్మపురి అరవింద్ ను ఎంపీగా ఎన్నుకున్న ప్రజలకు ఏమైనా మంచి చేయాలి కానీ తనను వ్యక్తిగతంగా దూషిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను తిట్టిన పర్వాలేదు కానీ ప్రజలకు మంచి చేయాలని సూచించారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Breaking News: అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Trinamool Congress Crisis 2026: మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
Lingamaneni Ramesh Rajya Sabha: రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
Sai Durgha Tej : సుప్రీం హీరో నెక్స్ట్ మూవీ - అహోబిలం ఆలయ ఉత్సవంతో లింక్... క్రేజీ టైటిల్ ఫిక్స్
సుప్రీం హీరో నెక్స్ట్ మూవీ - అహోబిలం ఆలయ ఉత్సవంతో లింక్... క్రేజీ టైటిల్ ఫిక్స్
Breaking News: టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
CJP Protest: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!
CJP Protest: కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
Buchi Babu Sana: సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
NTR: అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
Embed widget