అన్వేషించండి

Nizamabad News: అన్ని వర్గాల వారి అభివృద్ధికి ఉద్దేశించిన బడ్జెట్‌ ఇది: ఎంపీ అరవింద్

కేంద్ర ప్రకటించిన బడ్జెట్ ఈ ఏడాదికే కాదు వచ్చే 25 ఏళ్ల అభివృద్ధికి బాటలు వేస్తోందన్నారు ఎంపీ అరవింద్. అన్ని రంగాల అభివృద్ధికి తోడ్పడేలా ఉందన్నారు.

కేంద్రం ప్రకటించిన వార్షిక బడ్జెట్ అన్ని వర్గాల వారి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఉందన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. ఈ ఏడాదే కాకుండా వచ్చే 25 ఏళ్ల అభివృద్ధికి బాటలు వేస్తోందన్నారు. కోవిడ్ కారణంగా గతేడాది అర్ధికాబివృద్ధిలో దేశం కొంత వెనుకబడినా ఈ ఏడాది తిరిగి పుంజుకుంటుందన్నారు ఎంపీ అరవింద్. ముఖ్యంగా రైతుల కోసం రసాయనరహిత, సేంద్రీయ సాగును ప్రోత్సహించనుంది కేంద్రం. 2023ను చిరుధాన్యాల సంవంత్సరంగా గుర్తించి వాటి మార్కెటింగ్, బ్రాండింగ్ కు తగిన సహకారం అందించనుంది. రైతుల వ్యవసాయక్షేత్రాలలో ఉపయోగించుకునేందుకు వీలుగా కిసాన్ డ్రోన్లను అభివృద్ది చేయడం జరిగిందన్నారు ఎంపీ అరవింద్. వ్యవసాయ పనిముట్లను రైతులకు అద్దె ప్రాతిపాదికన అందించేందుకు తెచ్చిన పథకాన్ని స్వాగతిస్తున్నానన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ ఎంఎస్ పి కింద కొనుగోలు చేసిన గోదుమ, వరికి రూ. 2.37 లక్షల కోట్లు రైతుల ఖాతాలో వేశామన్నారు అరవింద్. 

ఆత్మనిర్భర్ భారత్  పథకంలో భాగంగా రాబోయే రోజుల్లో 60 లక్షల ఉద్యోగాల కల్పన జరగనుందన్నారు. కొత్తగా 400 వందే భారత్ రైళ్లను కూడా తీసుకురానుంది కేంద్రం. అలాగే దేశంలో పర్యాటనకు, రవాణాకు ఎంతో దోహదపడే పిఎం గతి శక్తి ద్వారా మరో 25 వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల విస్తరణ జరగనుందని అన్నారు ఎంపీ అరవింద్. చిన్న మధ్యతరగతి పరిశ్రమల కోసం క్రెటిడ్ గ్యారంటీ స్కీమ్ కోసం 2 లక్షల కోట్ల రూపాయల నిధులు కేటాయించడం జరిగింది. కరోనా తో విద్యార్ధులు చదువుకు దూరం కాకూడదని డిజిటల్ యూనివర్సటీ స్థాపించడం జరుగుతుంది. ఇప్పటి వరకూ ఉన్న 12 టీవీ ఛానల్స్ ని 200 కి పెంచి పిల్లలకు డిజిటల్ విద్యను అందించనుందని తెలిపారు. 

పట్టణాల్లో పర్యావరణ పరిరక్షనకు విద్యుత్ వాహనాలకు ప్రోత్సాహం. అందులో భాగంగా బ్యాటరీల అభివృద్దికి ప్రోత్సహకాలు అందించండం జరుగుతుంది. పోస్టాఫీసులను కోర్ బ్యాంకింగ్ లోకి తీసుకురావడం జరుగుతుంది. డిజిటల్ బ్యాంకింగ్ ను ప్రోత్సహించడానికి 5 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు ఎంపీ అరవింద్. ఇలా ఈ బడ్జెట్  అన్ని రంగాలు అన్ని వర్గాల అభివృద్దికి దోహదపడేలా ఉంది. వ్యవసాయం నుంచి రక్షణ రంగం వరకూ పారిశ్రామికే వేత్తల నుంచి  స్త్రీల స్వయం సహయక బృందాలు, నిరుపేద వర్గాల వరకూ అందరిని దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ తయారు చేయడం జరిగిందన్నారు ఎంపీ అరవింద్.

హర్ ఘర్ జల్ పథకం కింద గత రెండేళ్లలో ఐదున్నర కోట్ల ఇండ్లకు నల్లా కనెక్షన్ ఇవ్వడం  జరిగింది . ఈ ఏడాది మరో 3.8 కోట్ల ఇండ్లకు నల్లా కనెక్షన్ కల్పించడం కోసం బడ్జెట్ లో రూ.60 వేల కోట్ల నిధులు కేటాయించడం జరిగిందన్నారు ఎంపీ అరవింద్.  కేంద్రం రెండేళ్లలో 5.5 కోట్ల ఇండ్లకు నల్లా కనెక్షన్ ఇచ్చింది. 60 వేల కోట్లతో ఈ ఏడాది మరో 3.8 కోట్ల ఇండ్లకు నల్లా కనెక్షన్ ఇవ్వనుంది. కేసీఆర్ మాత్రం గత  ఏడున్నర ఏళ్లలో 45వేల కోట్లు ఖర్చుపెట్టినా.. కోటి ఇండ్లు కూడా లేని తెలంగాణలో మిషన్ భగీరథ పథకం ఇంకా అతా పతాలేదని. ఇదొక్క ఉదాహరణ  చాలు  తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, నిర్లక్ష్య పాలన గురించి చెప్పడానికి అని అన్నారు ఎంపీ అరవింద్.

టాప్ హెడ్ లైన్స్

Adilabad Latest News: ఆదిలాబాద్ జిల్లాలోని ఓ హోటల్‌లో సాంబార్‌లో బల్లి! సీజ్ చేసిన అధికారులు! 
ఆదిలాబాద్ జిల్లాలోని ఓ హోటల్‌లో సాంబార్‌లో బల్లి! సీజ్ చేసిన అధికారులు! 
Adilabad Crime News: ఆదిలాబాద్ జిల్లాలో చోరీ సొత్తు కొనుగోలు, రవాణా చేస్తున్న ముఠా అరెస్ట్! రిమాండ్‌కు ఆరుగురు నిందితులు 
ఆదిలాబాద్ జిల్లాలో చోరీ సొత్తు కొనుగోలు, రవాణా చేస్తున్న ముఠా అరెస్ట్! రిమాండ్‌కు ఆరుగురు నిందితులు 
కాగజ్‌నగర్ గురుకుల స్కూల్లో దారుణం.. టెన్త్ క్లాస్ స్టూడెంట్ కాళ్లు, చేతులు కట్టేసి క్లాస్‌మేట్స్ దాష్టీకం
గురుకుల స్కూల్లో దారుణం.. టెన్త్ క్లాస్ స్టూడెంట్ కాళ్లు, చేతులు కట్టేసి క్లాస్‌మేట్స్ దాష్టీకం
Adilabad Modified Silencers Road Roller: బైక్ సైలెన్సర్లు మారిస్తే రోడ్డు రోలరే! ఆదిలాబాద్‌లో 121 మోడిఫైడ్ సైలెన్సర్లను తొక్కించిన ఎస్పీ అఖిల్ మహాజన్!
బైక్ సైలెన్సర్లు మారిస్తే రోడ్డు రోలరే! ఆదిలాబాద్‌లో 121 మోడిఫైడ్ సైలెన్సర్లను తొక్కించిన ఎస్పీ అఖిల్ మహాజన్!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
Hyderabad Fake Liquor Gang: యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
 ICC Rankings Boost: టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా తగ్గని ర్యాంకింగ్స్
టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా నిలబెట్టుకున్న ర్యాంకులు
Avinash Narne Wife Murder: అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
Renault Duster on EMI: 2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
Vizag Fishermen Missing Case: విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
Embed widget