అన్వేషించండి

Minister Indrakaran Reddy: ఆ రైతులకు మేం రూ.10 వేలు ఇస్తున్నాం, కేంద్రం పైసా కూడా ఇవ్వలేదు: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్

Minister Indrakaran Reddy: తొమ్మిదేళ్ల నిర్మల్ నియోజవర్గ ప్రగతి నివేదికను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి దిశలో సాగుతోందని తెలిపారు.

Minister Indrakaran Reddy: నిర్మ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ప్రగతిపథంలో పయనిస్తోందని, అన్ని రంగాల్లో విశేష ప్రగతితో నిర్మల్ నియోజకవర్గం సమగ్రాభివృద్ధి దిశలో పయనిస్తోందని రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండల కేంద్రంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో నిర్మల్ నియోజకవర్గ ప్రగతి నివేదికను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బుల్లెట్ బండిపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమావేశానికి వచ్చారు. 2014 నుంచి 2023 వరకు నిర్మల్ నియోజవర్గం అన్ని అంశాల్లో అభివృద్ధి దిశగా సాగుతోందని తెలిపారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుండగా, కేంద్ర ప్రభుత్వం పైసా కూడా సాయం చేయలేదని విమర్శించారు.
 
సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు

సీఎం కేసీఆర్ సార‌థ్యంలో తెలంగాణ‌ పురోగ‌మిస్తోందని, గ‌డ‌ప గ‌డ‌ప‌కు సంక్షేమ ప‌థ‌కాలు అందుతున్నాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిరంత‌ర విద్యుత్ స‌ర‌ఫ‌రా, సాగునీటి ప్రాజెక్ట్ ల‌తో అన్న‌దాత‌ల క‌ష్టాలు తీరాయని, పేద‌ల‌కు కార్పోరేట్ స్థాయి విద్యా, వైద్యం అందుతున్నాయని కొనియాడారు. ద‌ళితుల అభ్యున్న‌తికి ద‌ళిత‌బంధు, అర్హులైన వారికి డ‌బుల్ బెడ్ రూం ఇస్తున్నది దేశంలో తెలంగాణ ప్రభుత్వం ఒక్కటేనని ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.

'రైత‌న్న‌కు బీజేపీ కేంద్ర ప్ర‌భుత్వం చేసిందేమి లేదు'

పంట‌ న‌ష్టంపై బీజేపీ రాజ‌కీయం చేస్తోందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విమర్శలు చేశారు. పంట‌ న‌ష్టానికి ఎక‌రాకు రూ.10 వేలు ఇస్తున్నామని, కేంద్ర ప్ర‌భుత్వం పైసా కూడా ఇవ్వ‌డం లేదని దుయ్యబట్టారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో  తెలంగాణ లాంటి ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నారా అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ‌ రాష్ట్రంపై కేంద్రంలోని మోదీ సర్కారు స‌వ‌తి త‌ల్లి ప్రేమ‌ చూపిస్తోందని ఆరోపణలు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల‌కు అధిక నిధులు కేటాయిస్తున్న కేంద్రం.. తెలంగాణ‌పై ఆది నుంచి క‌క్ష్య‌సాధిస్తోందని విమర్శించారు. ప్ర‌తిపక్షాల‌పై ఈడీ, సీబీఐ, ఐటీతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ క‌విత ను కూడా టార్గెట్ చేశారని అన్నారు. పేప‌ర్ లీకేజీల‌తో సీం కేసీఆర్ పై బీజేపీ, కాంగ్రెస్ నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తున్నారని, ఆధారాలుంటే బ‌య‌ట‌పెట్టాలని సవాల్ విసిరారు. సిట్ కు ఆధారాలు స‌మ‌ర్పించాలని, లేదంటే నిరాధార ఆరోపణలు చేస్తున్నందుకు చ‌ట్ట ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకుంటామని హెచ్చరించారు.

'కేసీఆర్ సారథ్యంలో అభివృద్ధి, సంక్షేమం'

స్వ‌రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సార‌థ్యంలో అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాల అమ‌లుతో తెలంగాణ స‌మ‌గ్రాభివృద్ధి దిశ‌లో పయనిస్తోందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిరంత‌ర క‌రెంట్ స‌ర‌ఫ‌రాతో క‌రెంట్  రైతుల‌ సాగునీటి క‌ష్టాలు తీరాయని, రైతులు ఆర్థికంగా వృద్ది చెందాల‌ని అన్న‌దాత‌ల కోసం అనేక ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టి అమ‌లు చేస్తున్నామని తెలిపారు. రైతుబంధు, రైతు బీమా, పండించిన పంట‌కు గిట్టుబాటు ధ‌ర‌, కోనుగోలు కేంద్రాల ద్వారా చివ‌రి ధాన్య‌పు గింజ‌ను కొంటున్నామని మంత్రి అన్నారు. వృద్దులు, విక‌లాంగులు, ఒంట‌రి మ‌హిళ‌లు, ఇలా అర్హులైన ప్ర‌తి ఒక్కరికీ ఆస‌రా ఫించ‌న్లు, పేదింటి ఆడ బిడ్డ‌ల పెళ్ళిల‌కు క‌ళ్యాణ ల‌క్ష్మి, షాదీ ముబార‌క్ ప‌థ‌కం ద్వారా ఆర్థిక స‌హాయం చేస్తున్నట్లు తెలిపారు. గ‌డ‌ప గ‌డ‌ప‌కు సంక్షేమ ప‌థ‌కాలు అందుతున్నాయన్నారు. విద్యా, ఆరోగ్యంలో గ‌ణ‌నీయంగా అభివృద్ది సాధించామని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వ‌ర్గాల‌కు కేజీ టూ పీజీ వ‌ర‌కు ఉచిత విద్య అందిస్తున్నామని చెప్పారు. హ‌ాస్ట‌ల్ విద్యార్థుల‌కు స‌న్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్ర‌జ‌ల చెంత‌కు పాల‌న వ‌చ్చిందన్నారు. ప్ర‌తి మండ‌ల కేంద్రానికి రెండు వ‌రుస‌ల ర‌హ‌దారుల నిర్మాణంతో సాఫీగా ప్ర‌యాణించ‌గ‌లుగుతున్నామన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
PDS Rice Smuggling: మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
Kumuram Bheem Asifabad Latest News: మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో SIR ప్రారంభం- ముందు తమది ఏ రాష్ట్రమో తేల్చాలని ప్రజల డిమాండ్ 
మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో SIR ప్రారంభం- ముందు తమది ఏ రాష్ట్రమో తేల్చాలని ప్రజల డిమాండ్ 
Telangana Mass Killing: కొడుకు రింగ్ మింగేసినా చికిత్స చేయించని రాజ్‌కుమార్! డెత్‌స్పాట్‌లో ఉన్న 7 రాళ్ల కథేంటీ?
కొడుకు రింగ్ మింగేసినా చికిత్స చేయించని రాజ్‌కుమార్! డెత్‌స్పాట్‌లో ఉన్న 7 రాళ్ల కథేంటీ?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget