By: ABP Desam | Updated at : 12 Jan 2022 06:16 PM (IST)
బదిలీల జీవో కారణంగా పోయిన ఉద్యోగాలు - న్యాయం చేయాలంటున్న బాధితులు
నిజామాబాద్ జిల్లాలో ఆర్టికల్ 317 జీవో ఔట్ సోర్సింగ్ ద్వారా నియమితులైన పంచాయతీరాజ్ కార్యదర్శుల పాలిట శాపంగా మారింది. 317 జోవో వల్ల జరనల్ ట్రాన్స్ ఫర్ లో భాగంగా జోన్ 6 నుంచి రెగ్యూలర్ ఉద్యోగులు నిజామాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు. వారి స్థానంలో పంచాయతీ రాజ్ కార్యదర్శులుగా ఉన్న 70 మందికి ఎలాంటి సమాచారం లేకుండా అధికారులు ఉద్వాసన పలికారు. వీరిని 2020 జూన్ 10న మెరిట్ ద్వారా ఎంపిక చేశారు. ఏడాదిన్నరగా జిల్లాలో పని చేస్తున్న తమని అకారణంగా తొలగించారని వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంచాయతీ కార్యదర్శులుగా పనిచేస్తున్న తమను తొలగించడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. కలెక్టరేట్ కు వచ్చిన ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు.. మానవతా కోణంలో ఆలోచించి తమను కొనసాగించాలని.. లేదా ఇతర రూపంలోనైనా తమ సేవలు ఉపయోగించుకోవాలంటూ కలెక్టర్ నారాయణ రెడ్డికి వినతిపత్రo అందించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 70 మంది ఉద్యోగులను తొలగించడంతో... రోడ్డున పడ్డామని వాపోయారు. అయితే ఔట్ సోర్సింగ్ ద్వారా ప్రస్తుతం తొలగించిన వారితో నియమితులైన 30 మందికి జేపీఎస్ ద్వారా రెగ్యులర్ చేశారు. వీరిని కూడా రెగ్యులర్ చేస్తారన్న నమ్మకంతో ఇతర ఉద్యోగాలను సైతం కాదనుకుని పంచాయతీ రాజ్ కార్యదర్శులుగా కొనసాగితే తమకు తీరని అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: పెంచిన ఎరువుల ధరలు తగ్గించకపోతే దేశవ్యాప్త ఆందోళన.. కేంద్రానికి కేసీఆర్ హెచ్చరిక !
ఈ విషయంపై పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. జిల్లాకు చెందిన మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవితను కూడా కలిసి తమకు న్యాయం చేయాలని వినతి పత్రం కూడా ఇచ్చామని తొలగించిన ఉద్యోగులు చెబుతున్నారు. తాము ఎంతో కష్టపడ్డామని కరోనా సమయంలో సైతం ప్రాణాలకు తెగించి విధుల్లో పాల్గొన్నాం. ఇలా తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకు్ండా ఉన్నఫలంగా తొలగించటమేంటని ప్రశ్నిస్తున్నారు.
Also Read: ఫ్రంట్ లేదు టెంట్ లేదు.. ఏ క్షణమైనా కేసీఆర్ జైలుకు వెళ్తారన్న బండి సంజయ్ !
తమను నమ్ముకున్న కుటుంబాలు రొడ్డున పడ్డామని చెబుతున్నారు బాధితులు. తమతో పాటే ఔట్ సోర్సింగ్ ఎంప్లాయ్స్ గా జాయిన్ అయిన 30 మందికి జేపీఎస్ ద్వారా రెగ్యూలర్ చేశారు. వారికి రూ.29,700 జీతం చెల్లించేవారు. తమకు కేవలం రూ.15000 వేలు చెల్లించేవారు. అయినా ఏప్పటికైనా తమను కూడా రెగ్యూలర్ చేస్తారని తక్కువ జీతానికైనా పని చేశాం. వేరే ఉద్యోగాలను వదిలి పంచాయతీ రాజ్ కార్యదర్శులుగా చేరితే తమకు తీరని అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు ప్రత్యామ్నయ మార్గం చూపించాలని వేడుకుంటున్నారు . ప్రభుత్వం వైపు నుంచి వీరికి ఇంత వరకూ ఎలాంటి భరోసా లభించలేదు.
Also Read: మంత్రి హరీశ్ రావును కలిసిన బాలకృష్ణ.. ఆ విషయంలో సాయం కోసం విజ్ఞప్తి
Nikhat Zareen First Coach: చిన్న రేకుల షెడ్డులో నిఖత్ జరీన్కు సొంత డబ్బులతో బాక్సింగ్ శిక్షణ ఇచ్చిన సంసముద్దీన్
Nizamabad రిజిస్ట్రేషన్ శాఖలో సస్పెండ్ అయిన ఉద్యోగుల వాంగ్మూలం తీసుకున్న అధికారులు
Petrol Diesel Price 21th May 2022 : తెలుగు రాష్ట్రాలో స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు, ఇవాళ్టి రేట్స్ ఇలా
Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి
CM KCR Appreciates Nikat Zareen : విశ్వ విజేతగా నిలిచిన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్, సీఎం కేసీఆర్ హర్షం
Bihar Road Accident: బిహార్లో ఘోర రోడ్డు ప్రమాదం, ట్రక్కు బోల్తా పడటంతో 8 మంది దుర్మరణం - పరారీలో డ్రైవర్ !
KTR On Petrol Price: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే మార్గమిదే, అలా చేయాలని కేంద్రానికి కేటీఆర్ డిమాండ్
Mehreen: బన్నీ సినిమా వదులుకున్నా, అది కానీ చేసుంటే - మెహ్రీన్ బాధ
Konaseema: ‘కోనసీమ’ పేరు మార్పుపై ఉద్రిక్తతలు, జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ - కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక