అన్వేషించండి

Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?

Telangana: పొంగులేటి, కోమటిరెడ్డి ఆంధ్రతో ముడిపడిన కొత్త వివాదాలు ఎందుకు తెచ్చుకుంటున్నారు? చిట్ చాట్‌ల పేరుతో ప్రత్యేక రాజకీయ అజెండా అమలు చేస్తున్నారా ?

Why are Ponguleti and Komatireddy bringing new controversies related to Andhra: అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ హోరాహోరీ పోరు సాగుతోంది. బీఆర్ఎస్ నేతలు ముప్పేట దాడి చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. అయితే ఇది సమిష్టిగా జరగడం లేదని కొన్ని కొన్ని సందర్భాల్లో బయటపడుతూనే ఉంది. కొంత మంది సందర్భం లేని వివాదాలను తెచ్చుకుంటున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి పదవి కోసం పరుగులు పెడుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇరువులు చిట్ చాట్‌ల పేరుతో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. వీరి ఎజెండా ఏమిటన్నదానిపై చర్చ ప్రారంభమయింది. 

అమరావతిపై పొంగులేటి వివాదాస్పద వ్యాఖ్యలు

అమరావతి విషయంలో మీడియా చిట్ చాట్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు  చేసినట్లుగా కొన్ని మీడియా సంస్థలు రిపోర్టు చేశాయి. ఆయన అన్ని మీడియా సంస్థల ప్రతినిధుల్ని ఈ చిట్ చాట్‌కు పిలవలేదు. అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది భయపడుతున్నారని పొంగులేటి చెప్పుకొచ్చారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో తెలంగాణ పెట్టుబడులు ఆంధ్రకు వెళ్తాయేమోననే అభిప్రాయం ఉండేదని, ఇటీవల అమరావతిలో సంభవించిన వరదలతో ఆ భావన పోయిందని చెప్పినట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. వాళ్లు ఎంత బూస్టప్‌ ఇవ్వాలనుకున్నా సాధ్యం కావడం లేదు. ఎలాంటి చర్యలు తీసుకున్నా వరదల నుంచి రక్షణ ఉండదని పెట్టుబడిదారులు భావిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఎంత తీవ్రమైన వరదలు అమరావతి మునగలేదు. బుడమేరు వల్ల విజయవాడకు ఎంత ఎఫెక్ట్ అయిందో ఖమ్మం కూ అంతే ఎఫెక్ట్ అయిందని పొంగులేటి మర్చిపోయారన్న విమర్శలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. 

పొంగులేటికి కౌంటర్ ఇచ్చిన ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ 

పొంగులేటి చేసిన వ్యాఖ్యల వార్తల క్లిప్పింగ్‌కు పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కౌంటర్ ఇచ్చారు.  చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక అమరావతితో పాటు అన్ని ప్రాంతాలు అభివృద్ధికి నాందిపలికాయన్నారు. జగన్ మోహన్ రెడ్డి అనుంగులు విధిగా చేసే వ్యాఖ్యలే ఇపుడు పొంగులేటి చేస్తున్నారని..  జగన్ మోహన్ రెడ్డి మిత్రత్వం వాసనలు ఇంకా పోలేదా అని ప్రశ్నించారు. 

ఎన్టీఆర్ ఘాట్‌ను తొలగించి కొత్త అసెంబ్లీ కట్టాలన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 

ఎన్టీఆర్ ఘాట్ లేపేసి కొత్త అసెంబ్లీ భవనం కడితే బాగుంటుంది మునుగోడు ఎమ్మెల్యే  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డియాతో చిట్ చాట్ లో వ్యాఖ్యానించారు.  తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి అసెంబ్లీ భవనం చాలా ఓల్డ్ ది అని.. సచివాలయం కొత్తది అని తెలిపారు. సచివాలయం, అసెంబ్లీ పక్క పక్కన ఉంటే పరిపాలనకు చాలా సులభంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేశారని ఎవరికైనా అర్థమవుతుంది. ఆ ఉద్దేశం ఏమిటన్నదానిపై కాంగ్రెస్‌లోనే చర్చ జరుగుతోంది. 

 తెలంగాణ పై ఎప్పుడూ వ్యతిరేక వ్యాఖ్యలు చేయని ఏపీ పాలకులు

మరో వైపు ఏపీ పాలకులు ఎప్పుడూ హైదరాబాద్ గురించి కానీ తెలంగాణ గురించి కానీ నెగెటివ్ కామెంట్స్ చేయలేదు. అక్కడి పెట్టుబడులు ఇక్కడికి వస్తాయని చెప్పలేదు. చంద్రబాబు సందర్భం వచ్చినప్పుడల్లా హైదరాబాద్ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోందని చెబుతున్నారు. మరి ఇప్పుడు అమరావతి గురించి ఎందుకు పొంగులేటి వ్యతిరేక ప్రకటనలు చేస్తున్నారు.. ఎన్టీఆర్ ఘాట్ ను తొలగించడంపై ఎందుకు మాట్లాడుతున్నారన్నది సస్పెన్స్ గా మారింది . కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల్లో భాగంగా వీరు సొంత పార్టీని టార్గెట్ చేసుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mumbai Municipal Elections: ముంబై మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీ - బీజేపీ కూటమికే చాన్స్ ఉందంటున్న ఎగ్జిట్ పోల్స్
ముంబై మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీ - బీజేపీ కూటమికే చాన్స్ ఉందంటున్న ఎగ్జిట్ పోల్స్
240 crore scam network: ఈ తల్లీకొడుకులు 9 వేల బ్యాంక్ అకౌంట్లతో 240 కోట్ల స్కామ్ చేశారు - వీళ్ల మైండ్ మామూలుది కాదు!
ఈ తల్లీకొడుకులు 9 వేల బ్యాంక్ అకౌంట్లతో 240 కోట్ల స్కామ్ చేశారు - వీళ్ల మైండ్ మామూలుది కాదు!
Yellamma Glimpse: హీరోగా మారిన దేవిశ్రీ ప్రసాద్... సంక్రాంతికి విడుదలైన 'ఎల్లమ్మ' గ్లింప్స్‌ - వీడియో చూడండి
హీరోగా మారిన దేవిశ్రీ ప్రసాద్... సంక్రాంతికి విడుదలైన 'ఎల్లమ్మ' గ్లింప్స్‌ - వీడియో చూడండి
Highway Helpline: పెట్రోల్ లేక హైవేపై కారు అకస్మాత్తుగా ఆగిపోతే కంగారు పడకండి! ఇలా సాయం పొందండి!
పెట్రోల్ లేక హైవేపై కారు అకస్మాత్తుగా ఆగిపోతే కంగారు పడకండి! ఇలా సాయం పొందండి!

వీడియోలు

Tension Errupt at Puranapul | మైసమ్మ ఆలయంపై ఆగంతుకుడి దాడి, ఉద్రిక్తత | ABP Desam
Virat Kohli No 1 ODI Rank | కష్టం అనుకున్న లక్ష్యాన్ని మళ్లీ సాధించిన కోహ్లీ | ABP Desam
Mohammed Siraj Hyderabad Captain | హైదరాబాద్ రంజీ కెప్టెన్ గా మహ్మద్ సిరాజ్ | ABP Desam
Ind U19 vs USA U19 Match | U19 ODI World Cup 2026 నేటితో ప్రారంభం | ABP Desam
Ind vs Nz Second ODI Highlights | రెండో వన్డేలో భారత్ పై 7వికెట్ల తేడాతో కివీస్ ఘన విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mumbai Municipal Elections: ముంబై మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీ - బీజేపీ కూటమికే చాన్స్ ఉందంటున్న ఎగ్జిట్ పోల్స్
ముంబై మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీ - బీజేపీ కూటమికే చాన్స్ ఉందంటున్న ఎగ్జిట్ పోల్స్
240 crore scam network: ఈ తల్లీకొడుకులు 9 వేల బ్యాంక్ అకౌంట్లతో 240 కోట్ల స్కామ్ చేశారు - వీళ్ల మైండ్ మామూలుది కాదు!
ఈ తల్లీకొడుకులు 9 వేల బ్యాంక్ అకౌంట్లతో 240 కోట్ల స్కామ్ చేశారు - వీళ్ల మైండ్ మామూలుది కాదు!
Yellamma Glimpse: హీరోగా మారిన దేవిశ్రీ ప్రసాద్... సంక్రాంతికి విడుదలైన 'ఎల్లమ్మ' గ్లింప్స్‌ - వీడియో చూడండి
హీరోగా మారిన దేవిశ్రీ ప్రసాద్... సంక్రాంతికి విడుదలైన 'ఎల్లమ్మ' గ్లింప్స్‌ - వీడియో చూడండి
Highway Helpline: పెట్రోల్ లేక హైవేపై కారు అకస్మాత్తుగా ఆగిపోతే కంగారు పడకండి! ఇలా సాయం పొందండి!
పెట్రోల్ లేక హైవేపై కారు అకస్మాత్తుగా ఆగిపోతే కంగారు పడకండి! ఇలా సాయం పొందండి!
Chandrababu: ప్రతి ఒక్కరూ స్వగ్రామాల అభివృద్ధికి తోడ్పడాలి - నారా వారి పల్లెలో చంద్రబాబు పిలుపు
ప్రతి ఒక్కరూ స్వగ్రామాల అభివృద్ధికి తోడ్పడాలి - నారా వారి పల్లెలో చంద్రబాబు పిలుపు
Sai Pallavi: రామాయణం కాదు... సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ ఇదే - రిలీజ్ డేట్ ఫిక్స్, హీరో బ్యాగ్రౌండ్ తెలుసా?
రామాయణం కాదు... సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ ఇదే - రిలీజ్ డేట్ ఫిక్స్, హీరో బ్యాగ్రౌండ్ తెలుసా?
Dutch mayor search for birth mother in Nagpur: ఇది కలియుగ కుంతీకర్ణుల కథే - తల్లి కోసం నాగ్‌పూర్‌లో డచ్ మేయర్ వెదుకులాట!
ఇది కలియుగ కుంతీకర్ణుల కథే - తల్లి కోసం నాగ్‌పూర్‌లో డచ్ మేయర్ వెదుకులాట!
Adilabad Murder Case: ఒంటరి దగ్గర డబ్బులు అప్పు తీసుకుని చెల్లించాలసి వస్తుందని చంపేశారు - ఆదిలాబాద్‌లో దారుణం
ఒంటరి దగ్గర డబ్బులు అప్పు తీసుకుని చెల్లించాలసి వస్తుందని చంపేశారు - ఆదిలాబాద్‌లో దారుణం
Embed widget