అన్వేషించండి

Are Kapu Community Leaders Suffocating In YSRCP: జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?

YS Jagan Latest News: వైసీపీ అధినేత జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..? ఆ వర్గానికి చెందిన నేతలే ఎక్కువగా రాజీనామా ఎందుకు చేస్తున్నారా?

Andhra Pradesh news: ఏపీలో అతి బలమైన ఓటు బ్యాంకు ఉన్న కాపు సామాజిక వర్గం వైసీపీ అధినేత జగన్‌ను వదిలి పెడుతోందా..? ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఈ చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఆ మధ్య ఒకేసారి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ రాజీనామా చేయడంతో ఈ చర్చ మరింత ఎక్కువైంది.

వరుసగా రాజీనామా చేస్తున్న కాపు నేతలు 
2024 ఎన్నికల్లో వైసిపి ఓటమి చెందిన తర్వాత కాపు సామాజిక వర్గ నేతలు వరుసగా ఆ పార్టీకి దూరం అవుతున్నారు. ముందుగా కిలారు రోశయ్య, సామినేని ఉదయభాను లాంటి నేతలు పార్టీకి రాజీనామా చేస్తే ఆ తర్వాత జగన్‌కు అత్యంత నమ్మకమైన స్నేహితుడిగా ఉన్న ఆళ్లనాని కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఇది వైసిపినే కాకుండా రాష్ట్ర రాజకీయాలను కూడా షాక్‌కు గురి చేసింది. 

నిజానికి తొలి విడతలోనే ఆళ్ల నానిని మంత్రిని చేశారు జగన్మోహన్ రెడ్డి. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవి కోల్పోయినప్పుడు నుంచి ఆయన ముభావంగానే ఉంటూ వచ్చారు. పార్టీ అధికారం కోల్పోగానే జగన్‌కు బై బై చెప్పేశారు. 

భీమవరంలో గ్రంధి శ్రీనివాస్‌ది కూడా అదే దారి. ఏకంగా 2019లో జనసేన అధినేత పవన్‌ను ఓడించి జయింట్ కిల్లర్‌గా పేరుపొందిన గ్రంధి శ్రీనివాస్‌కు కనీసం రెండో విడతలోనన్నా మంత్రి పదవి గ్యారెంటీ అని భావించారు. కానీ పలు సమీకరణల దృష్ట్యా జగన్ ఆయనపై దృష్టి పెట్టలేదు. దీనితో తనకు సరైన గుర్తింపు దక్కలేదని ఎప్పటినుంచో భావిస్తున్న గ్రంధి శ్రీనివాస్ ఎన్నికల తర్వాత పార్టీని వదిలేసారు. 

ఏ పార్టీ అధికారంలో ఉంటే అటు వైపు వెళ్ళిపోతారన్న విమర్శలు ఎదుర్కొనే అవంతి శ్రీనివాస్ కూడా వైసిపి నుంచి బయటికి వచ్చేసారు. జగన్ హయంలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతానికి వీరు మాత్రమే కాకుండా మరికొందరు కాపు నేతలు కూడా వైసీపీని వీడే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

Also Read: టీడీపీ క్యాడర్ ఆన్ ఫైర్ - మంత్రి పార్థసారధి అర్థం చేసుకోలేకపోయారా ?

జనసేన ప్రభావం వల్లే నా?
ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జనసేన కాపులను, కాపులు జనసేన ను ఓన్ చేసుకుంటున్నారు. పవన్‌ను  ఒక సీరియస్ పొలిటిషన్‌గా వారు గుర్తించడానికి కొంత టైం పట్టింది. ఎప్పటికైనా ఏపీలో కాపు సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్న వ్యక్తిగా పవన్ని చూస్తున్నారు. దాని ఫలితమే 2024 ఎన్నికల్లో జనసేన సాధించిన 100% విజయం. ఇలాంటి పరిస్థితుల్లో వేరే పార్టీల్లో ఉండటం కన్నా జనసేనకు షిఫ్ట్ కావడమే మంచిదనే ఆలోచనలో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు భావిస్తున్నారు. వీలైతే జనసేన లోనికో లేకుంటే కనీసం కూటమిలోని ఇతర పార్టీల్లోకో వెళ్లడం ప్రస్తుతానికి బెటరనే ఆలోచనలు వీళ్లు ఉన్నారు.

జగన్ వైఖరి కూడా కారణం 
విజయవాడ నుంచి ఉత్తరాంధ్ర వరకు కాపు సామాజిక వర్గం దాని అనుబంధ కులాల లీడర్లు ఎక్కువగా ఉన్నారు. ఓటర్లపరంగా కూడా వారి ప్రభావం ఈ ప్రాంతాల్లో ఉంటుంది. వైసీపీలో ఆ ప్రాంతాలకు సంబంధం లేని రెడ్డి లీడర్లు సలహాదారుల పేరుతో పెత్తనం సాగించడం చాలా మందికి నచ్చడం లేదు.  జగన్‌కు తమకు మధ్య అడ్డుకట్టలా వాళ్లు మారిపోతున్నరని అసహనానికి లోనవుతున్నారు. దానికి తోడు జగన్ కూడా క్షేత్ర స్థాయి పరిస్థితులను లెక్క లోకి తీసుకోకుండా తోచినట్టు చేసుకుపోతున్నారనే ఆరోపణ ఉంది. 

ఇక తమ సామాజిక వర్గానికి చెందిన పవన్‌ను తమ తోనే తిట్టిస్తూ రావడం వల్ల ఓటు బ్యాంకు పూర్తిగా దెబ్బతింటుందని భావించిన కాపు లీడర్లు వైసీపీకి బై బై చెప్తున్నారు. మరి రానున్న రోజుల్లో ఇంకెంత మంది కాపు లీడర్లు బయటకు వస్తారో జగన్ వారికి ఎలా అడ్డుకట్ట వేస్తారో చూడాలి.

Also Read: 151 నుంచి 11కు- జగన్ కు చేదు జ్ఞాపకంలా 2024

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TDP Foundation Day: ఇకపై మూడు ముక్కలాటలు ఉండవు.. అమరావతి అభివృద్ధే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఇకపై మూడు ముక్కలాటలు ఉండవు.. అమరావతి అభివృద్ధే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Food Poisoning: శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
Airports in AP and Telangana: ఉడాన్‌ 2.0తో తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు
తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు!
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం

వీడియోలు

కోహ్లీ భాయ్ సెట్ అయితే అంతే ఓటమికి గల కారణాలు చెప్పిన ఇషాన్
IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Foundation Day: ఇకపై మూడు ముక్కలాటలు ఉండవు.. అమరావతి అభివృద్ధే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఇకపై మూడు ముక్కలాటలు ఉండవు.. అమరావతి అభివృద్ధే లక్ష్యం: సీఎం చంద్రబాబు
PM Modi Mann Ki Baat: టీమిండియాపై ప్రధాని మోదీ ప్రశంసలు.. ఇంధన కొరతపై వదంతులు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి
టీమిండియాపై ప్రధాని మోదీ ప్రశంసలు.. ఇంధన కొరతపై వదంతులు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి
TVK Candidate List: టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
CM Revanth Reddy: కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించినా కేసీఆర్‌పై చర్యలు ఎందుకు తీసుకోలేదు: సీఎం రేవంత్ రెడ్డి
కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించినా కేసీఆర్‌పై చర్యలేవీ?: సీఎం రేవంత్ రెడ్డి
Kriti Sanon : నాకు పెళ్లికి హడావిడి లేదు - డేటింగ్ రూమర్స్, పెళ్లిపై బాలీవుడ్ బ్యూటీ స్ట్రాంగ్ రియాక్షన్
నాకు పెళ్లికి హడావిడి లేదు - డేటింగ్ రూమర్స్, పెళ్లిపై బాలీవుడ్ బ్యూటీ స్ట్రాంగ్ రియాక్షన్
MI vs KKR ముఖాముఖీ పోరులో పైచేయి ఎవరిది? వాంఖడేలో మ్యాచ్ అయినా ముంబైలో టెన్షన్
MI vs KKR ముఖాముఖీ పోరులో పైచేయి ఎవరిది? వాంఖడేలో మ్యాచ్ అయినా ముంబైలో టెన్షన్
IPL అరంగేట్రంలోనే అదరగొట్టిన RCB బౌలర్.. ఎవరీ Jacob Duffy, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
IPL అరంగేట్రంలోనే అదరగొట్టిన RCB బౌలర్.. ఎవరీ Jacob Duffy, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Dhurandhar 2 Collections : బాహుబలి 2ని దాటేసిన ధురంధర్ 2 - ఆ రికార్డు పదిలం... 10 రోజుల్లో కలెక్షన్స్ ఎంతంటే?
బాహుబలి 2ని దాటేసిన ధురంధర్ 2 - ఆ రికార్డు పదిలం... 10 రోజుల్లో కలెక్షన్స్ ఎంతంటే?
Embed widget