అన్వేషించండి

KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!

Formula E Race Case | బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ముడుపులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేపట్టింది. కేటీఆర్ మీద విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో పావులు కదుపుతోంది.

Telangana News | హైదరాబాద్: తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ చుట్టూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉచ్చు బిగిస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)పై విచారణ జరిపేందుకు గవర్నర్ ఇదివరకే అనుమతి ఇచ్చారు. గవర్నర్ అనుమతి పత్రాన్ని సీఎస్ శాంతికుమారికి పంపించారు. ఆ లేఖను ఏసీబీ అధికారులకు అందజేయాలని తెలంగాణ క్యాబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు కేటీఆర్‌పై విచారణకు గవర్నర్ అనుమతి లేఖను తెలంగాణ సిఎస్ శాంతి కుమారి ఏసీబీ అధికారులకు అందించారు. 

ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్‌ను విచారణ

బీఆర్ఎస్ హయాంలో జరిగిన విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందాలతో పాటు ఫార్ములా ఈ రేస్ (formula e hyderabad) ) వ్యవహారంపై మంత్రివర్గంలో చర్చించారు. ఈ క్రమంలో కేటీఆర్ పై కేసు నమోదు చేసి విచారణకు అనుమతి ఇవ్వాలని కోరడంపై గవర్నర్ ఇచ్చిన అనుమతి పై చర్చ జరిగింది. కేటీఆర్ ను విచారించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో సిఎస్ శాంతి కుమారి గవర్నర్ అనుమతి లేఖను ఏసీబీకి పంపించారు. ఈ వ్యవహారంపై ఇదివరకే నమోదైన కేసులో అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను, చీఫ్‌ ఇంజినీర్‌ను బాధ్యులుగా చేర్చారు.

నెల రోజుల తరువాత గవర్నర్ అనుమతి

హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో హెచ్‌ఎండీఏ ఒప్పందం చేసుకోవడం, ఆర్‌బీఐ అనుమతి లేకుండా విదేశీ కరెన్సీ చెల్లించడంపై పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అయితే మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదు చేయడానికిగానూ గవర్నర్‌ను ప్రభుత్వం అనుమతి కోరింది. దాదాపు నెల రోజుల తరువాత గవర్నర్ అనుమతి ఇవ్వడంతో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్‌కు కీలకమైన కేటీఆర్‌ను విచారించేందుకు సిద్ధమైంది. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు పొడిగించాలని, సాధ్యమైనన్ని అంశాలపై చర్చించే దమ్ముందా అని కేటీఆర్ సవాల్ విసిరిన గంటల వ్యవధిలో సీఎస్ నుంచి ఏసీబీకి బీఆర్ఎస్ నేతను విచారించేందుకు రంగం సిద్ధమైంది.

అరెస్ట్ ప్రచారం సమయంలో ఢిల్లీకి వెళ్లిన కేటీఆర్

తనను అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటినుంచో ఎదురుచూస్తోందని, అక్రమ కేసుల్లోనైనా సరే తనను జైల్లో పెట్టే అవకాశం ఉందని కేటీఆర్ ఇదివరకే పలుమార్లు ప్రస్తావించారు. తన మీద ఫార్ములా కార్ రేసులో ఆరోపణలు వచ్చిన సమయంలో కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేయడం తెలిసిందే. కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ కట్టర్‌ను కలిసి అమృత్ టెండర్లలో అవకతవకలు జరిగాయని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగంపై విచారణ చేపట్టాలని గతంలో లేఖ రాసిన కేటీఆర్, అనంతరం నేరుగా ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు. కేటీఆర్ ఢిల్లీ పర్యటనను కాంగ్రెస్ తమకు అనుకూల ప్రచారం చేసుకుంది. తనను కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయకుండా కాపాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ పెద్దలను సాయం కోరేందుకు కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారని హస్తం పార్టీ నేతలు ఆరోపించారు.

Also Read: KTR vs Revanth: నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Embed widget