అన్వేషించండి

Adilabad latest News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా రేషన్ బియ్యం దందా- పట్టబడుతున్నా ఆగని అక్రమార్కులు

Adilabad latest News:ఆదిలాబాద్ జిల్లాలో రేషన్ బియ్యం బస్తాలకు చక్రాలు అమరుస్తున్నారు అక్రమార్కులు. ఓవైపు పోలీసులకు క్వింటాళ్లు చిక్కుతున్నా వారి దందాకు మాత్రం అడ్డుకట్ట పడకపోవడం ఆశ్చర్యకలిగిస్తోంది.

Adilabad latest News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మీదుగా పక్కన ఉన్న మహారాష్ట్రకు రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్నారు. నెలలు తరబడి పదుల సంఖ్యలో అక్రమ బియ్యం తరలిస్తున్న వాహనాలు చిక్కుతున్నాయి. అయినా అధికారులు చూస్తూ ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి. కేవలం పోలీసులకు మాత్రమే ఈ రేషన్ బియ్యం పట్టుబడటం ఆలోచనలకు గురిచేస్తోంది. 

సంబంధిత శాఖ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడంతోనే అక్రమార్కులు రెచ్చిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే అక్రమ రేషన్ బియ్యం రవాణా సాగుతోందని చర్చించుకుంటున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో 290 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని లారీలో మహారాష్ట్రకు తరలిస్తుండగా బోరజ్ చెక్ పోస్ట్ వద్ద పట్టుకున్నారు. 

Also Read: అఖిల పక్ష సమావేశానికి బీజేపీ, బీఆర్‌ఎస్‌ గైర్హాజరుపై ప్రభుత్వం రియాక్షన్ ఇదే !

బోరజ్ అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద 44వ జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీ చేశారు. 290 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అక్రమంగా లారీలో తరలిస్తుండగా జైనాథ్ పోలీసులు పట్టుకున్నారు. సీఐ సాయినాథ్, ఎస్సై పురుషోత్తం సిబ్బందితో కలిసి మాటువేశారు. మధ్యప్రదేశ్‌లోని బాలఘట్‌కు రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు. డ్రైవర్ తాహిర్ తో పాటు లారీ యజమాని ఎం.డీ నజీం, బియ్యం సరఫరా చేస్తున్న నాగనాథ్, షఫీపై కేసు నమోదు చేశారు. 


Adilabad latest News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా రేషన్ బియ్యం దందా- పట్టబడుతున్నా ఆగని అక్రమార్కులు

విషయం తెలుసుకున్న అదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి అక్కడకు చేరుకొని పట్టుకున్న బియ్యం లారీని పరిశీలించారు. ఎన్ఫోర్స్మెంట్ ఉప తహసీల్దార్ రాఠోడ్ రవీందర్ అక్కడకు చేరుకొని పంచనామా నిర్వహించారు. 290 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

Also Read: పెళ్లయిన నెల రోజులకే నవ వధవు ఆత్మహత్య, హైదరాబాద్‌లో విషాదం

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోను రేషన్ బియ్యం పక్కదారి పడుతుంది. సరిహద్దు ప్రాంతం మీదుగా మహారాష్ట్రకు రేషన్ బియ్యాన్ని అక్రమార్కులు తరలిస్తున్నారు. వారం రోజుల క్రితం నిరుపేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని లబ్ధిదారుల వద్ద తక్కువ రేటుకు కొని మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్నారు.  ఆ పీడీఎస్ బియ్యాన్ని కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ డీవీ.శ్రీనివాసరావు ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులకు అందిన పక్కా సమాచారంతో మాటు వేసి పట్టుకున్నారు. కెరమెరి మండలంలోని వివిధ గ్రామాల  నుంచి సేకరించిన బియ్యాన్ని మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్నారు. అనార్‌పల్లి వద్ద బానోత్ విజయ్ కుమార్ బొలెరో వాహనంతో తీసుకెళ్తున్న 8 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒకరిపై కేసు నమోదు చేశారు.  


Adilabad latest News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా రేషన్ బియ్యం దందా- పట్టబడుతున్నా ఆగని అక్రమార్కులు

నిర్మల్ జిల్లాలోనూ ఇటీవలే భారీగా రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. భైంసా పట్టణానికి చెందిన పీడీఎస్ బియ్యంగా గుర్తించారు. వెంటనే సంబంధిత డీటీ, సివిల్ సప్లై అధికారులకు సమాచారం ఇచ్చారు. దాదాపు 30 టన్నులపైనే పీడీఎస్ బియ్యం ఉన్నట్లు తెలిపారు. ఈ బియ్యాన్ని పక్కనున్న మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు గుర్తించారు. నెల వ్యవధిలోనే పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం పోలీసులకు పట్టుబడడం ముమ్మాటికి ఇది అధికారుల నిర్లక్ష్యమేనని సంబంధిత శాఖ అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.  

టాప్ హెడ్ లైన్స్

Gift A Smile KTR Birthday: కేటీఆర్ బర్త్ డే.. గిఫ్ట్ ఏ స్మైల్ - వినూత్నంగా పేద రైతులకు ఇన్సూరెన్స్ చేయించిన ఆదిలాబాద్ బీఆర్ఎస్ నేత
కేటీఆర్ బర్త్ డే.. గిఫ్ట్ ఏ స్మైల్ - వినూత్నంగా పేద రైతులకు ఇన్సూరెన్స్ చేయించిన ఆదిలాబాద్ బీఆర్ఎస్ నేత
Adilabad Job Fraud Case: ప్రభుత్వ ఉద్యోగాల పేరిట టోకరా - ఆదిలాబాద్ జాబ్ ఫ్రాడ్ కేసులో గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ అరెస్ట్!
ప్రభుత్వ ఉద్యోగాల పేరిట టోకరా - ఆదిలాబాద్ జాబ్ ఫ్రాడ్ కేసులో గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ అరెస్ట్!
Asifabad Forest Officials Attack Case: సార్సాల అటవీ అధికారులపై దాడి కేసు.. మాజీ జెడ్పీ వైస్ చైర్మన్‌ సహా 8 మందికి జైలు శిక్ష
సార్సాల అటవీ అధికారులపై దాడి కేసు.. మాజీ జెడ్పీ వైస్ చైర్మన్‌ సహా 8 మందికి జైలు శిక్ష
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget