అన్వేషించండి

గురువారం ఆదిలాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ

Telangana Assembly Election 2023: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.

Telangana CM KCR: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించే, ప్రజా ఆశీర్వాద సభ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. ఆదిలాబాద్ డైట్ మైదానంలో సభా ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సభ ప్రాంగణాన్ని ఎమ్మెల్యే జోగు రామన్న పరిశీలించి ఏర్పాట్ల పట్ల పలు సూచనలు చేవారు. 

ప్రజా ఆశీర్వాద సభ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపనిచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో కేవలం 9 ఏళ్లలోనే  తెలంగాణను రోల్ మాడల్ గా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ కు చెందుతుందన్నారు. ప్రజా సంక్షేమాలను ప్రజల ఇంటి వద్దకు చేర్చిన ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్ మాత్రమేనని.. మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వమే లక్ష్యంగా ప్రజల ఆశీర్వాదాన్ని కోరుతూ సిఎం కేసీఆర్ జిల్లాకు రావడం జరుగుతుందన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గ అభ్యర్థిగా తనకు మరోసారి ఆదిలాబాద్ ను మరింత అభవృద్ధి చేసేదిశగా అవకాశం కల్పించారు. కావునా రేపటి ప్రజా ఆశీర్వాద సభను నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు విజయవంతం చేయాలని కోరారు.

బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం.. తెలంగాణ ప్రయోజనాల కోసం అని కేసీఆర్ అన్నారు. బుధవారం సాయంత్రం ఎల్లారెడ్డి ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘తెలంగాణ వచ్చిన్నాడు కరెంటు లేదు..తాగునీరు, సాగునీరు లేదు. రైతుల ఆకలి చావులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు.. అంతా గందరగోళంగా ఉండేది. మిషన్ కాకతీయలో భాగంగా నేను కూడా సదాశివ నగర్ చెరువులో తట్ట మోసిన. గులాబీ జెండా పుట్టిన్నాడు ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన చెందిన విఠల్ రెడ్డి ‘‘మూగబోయిన..’’ అనే గేయాన్ని అద్భుతంగా రాసినాడు.
రాష్ట్రం బాగుపడిందా లేదా అనడానికి ప్రధాన గీటురాళ్లు..తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగం. ఇవ్వాల తెలంగాణ తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ఎదిగింది. రాష్ట్రం ఏర్పడ్డ ఏడాదిన్నరలోనే అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ ను ఇచ్చాం. తలసరి విద్యుత్ వినియోగంలో నేడు తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ఉంది. మిషన్ భగీరథ’తో మంచినీళ్ల బాధ పోగొట్టుకున్నం. కామారెడ్డి వెనుకబడి ఉందనే కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నా. హైదరాబాద్ స్టేట్’గా ఉన్న తెలంగాణను ఊడగొట్టి కాంగ్రెస్ ఆనాడు ఆంధ్రాలో కలుపడం వల్ల మనం 58 ఏండ్లు గోసపడ్డం.

15 ఏండ్లు కొట్లాడితే అనేక మంది పిల్లలు చనిపోయిండ్రు. ఉద్యోగస్తులు సకల జనుల సమ్మె చేసిండ్రు. తెలంగాణ వచ్చుడో..కేసీఆర్ సచ్చుడో’ అని మొండిగా మనం కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. కృష్ణా, గోదావరి నదుల మధ్య ఉన్న ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కొంచం మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. తెలంగాణ వచ్చేనాటికి రైతులకు అనేక సమస్యలు ఉండేవి. రైతు బంధు’ను పుట్టించిందే కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ.  దురదృష్టవశాత్తూ రైతు మరణిస్తే రూ.5 లక్షల రైతు బీమా వచ్చేలా చేశాం. హైదరాబాద్ లో ఉన్నవాళ్లు కూడా నేడు గ్రామాలకు వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నరు. 3 గంటల కరెంటుతో పొలం పారుతదా? రైతులు వాడేదే 3 లేదా 5 హెచ్.పి.మోటార్లు. రాష్ట్రంలో 30 లక్షలకు పైగా మోటార్లున్నయి. 10 హెచ్.పి. మోటార్లను కొనాలంటే ఎవరు పైసలియ్యాలె. ‘ధరణి’ తీసేస్తే రైతుబంధు, రైతు బీమా, పంట కొనుగోళ్ల డబ్బులు ఎలా వస్తయి?’ అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
BCCI on Mustafizur Rahman: KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
BCCI on Mustafizur Rahman: KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
Gadchiroli Viral News: గడ్చిరోలిలో దారుణం! ప్రసవం కోసం 6 కిలోమీటర్లు నడిచి వెళ్లిన గర్భిణీ! బీపీ పెరిగి తల్లీ బిడ్డ మృతి
గడ్చిరోలిలో దారుణం! ప్రసవం కోసం 6 కిలోమీటర్లు నడిచి వెళ్లిన గర్భిణీ! బీపీ పెరిగి తల్లీ బిడ్డ మృతి
AP DSC 2026: ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
The Raja Saab Run Time : ప్రభాస్ 'ది రాజా సాబ్' రన్ టైం ఫిక్స్! - 3 గంటల్లోపే డార్లింగ్ హారర్ కామెడీ థ్రిల్లర్
ప్రభాస్ 'ది రాజా సాబ్' రన్ టైం ఫిక్స్! - 3 గంటల్లోపే డార్లింగ్ హారర్ కామెడీ థ్రిల్లర్
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Embed widget