అన్వేషించండి

Nirmal News: బాసర ట్రిపుల్ ఐటీలో తరగతులు ప్రారంభం

బాసర ట్రిపుల్ ఐటీలో ప్రశాంత వాతావరణం నెలకొంది. తరగతులు కూడా ప్రారంభమయ్యాయి నిరసనలతో అలసిన విద్యార్థులు తరగతి గదుల్లో చదువులతో కుస్తీ పడుతున్నారు.

Nirmal News: వారం రోజుల పాటు నిరనసలతో హీటెక్కిన నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ యూనివర్శిటిలో పాఠాలు వినిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా నెలకొన్న సమస్యలపై వారం రోజుల పాటు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు నిన్నటి(మంగళవారం)తో ముగిశాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డితో జరిపిన చర్చలు సఫలం కావడంతో విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. తరగతులు ప్రారంభమయ్యాయ్.

బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థులు ఏడు రోజులపాటు విడతల వారీగా ఆందోళన బాట పట్టారు. ట్రిపుల్ ఐటీకి వైస్ఛాన్సలర్ నియామకం, విద్యార్థుల నిష్పత్తికి ఆధారంగా అధ్యాపకుల భర్తీ, వసతి, తరగతుల్లో మౌలిక సదుపాయాలు, లాప్ టాప్, యూనిఫామ్, బెడ్లు అందించాలని నిరసన చేపట్టారు. ఏడు రోజులపాటు ఎండనకా... వాననకా 24 గంటలపాటు విడతలవారీగా దీక్షలు చేశారు. విద్యార్థుల నిరసనలతో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులతో చర్చలు జరపడానికి జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ, యూనివర్సిటీ అధికారులు పలుమార్లు చర్చలు జరిపిన. విద్యార్థులు తమకు హామీలు కాకుండా కాల పరిమితితో కూడిన హామీ కోసం పట్టుబట్టారు. మంత్రి అల్లోల ఇంద్రకరణెడ్డి, ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి, కలెక్టర్ ఉన్నత విద్యాశాఖ మండలి వైస్ చైర్మన్ వెంకట రమణతో చర్చలు జరిపినప్పటికీ తగిన హామీ లభించలేదు. చివరకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్థుల డిమాండ్లకు విడతల వారిగా తీర్చుతామని చెప్పటంతో నిరసనలకు పుల్ స్టాప్ పడింది.

ట్రిపుల్ ఐటీలో నెలకొన్న ప్రశాంతత...

ట్రిపుల్ ఐటీ యూనివర్సీటీలో ప్రశాంత వాతావరణం నెలకొంది. యూనివర్సిటీలో గతంలో కాకుండా ఈసారి విద్యార్థులు చేసిన ఆందోళనకు ప్రతిపక్ష పార్టీలు బిజెపి, కాంగ్రెస్, బిఎస్పీ, విద్యార్థి సంఘాల నాయకులు సంపూర్ణ మద్దతు తెలిపారు. విద్యార్థులు చేపట్టిన నిరసనలకు సంఘీభావం తెలిపేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా వెళ్లారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. దీనికి తోడు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు సైతం యూనివర్సిటీ విద్యార్థులకు మద్దతు తెలిపారు.

ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు విడతల వారిగా ట్రిపుల్ ఐటీలో పనులు ప్రారంభించారు. మొదటగా మరుగుదొడ్లలో ప్లంబింగ్ పనులు ప్రారంభించారు. పనులను వేగవంతం చేశారు. దీంతో విద్యార్థులు సైతం తరగతి గదుల్లో చదువులతో బిజీగా మారారు. మొత్తానికి బాసర ట్రిపుల్ ఐటీ ప్రాంగణం ఏడు రోజులు నిరసనలతో హోరెత్తి ప్రస్తుతం ప్రశాంత వాతవరణంలోకి వెళ్లింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రతి హామీకి నిర్ధిష్ట సమయం

వారం రోజుల్లో ఛాన్స్ లర్ నియామక ప్రక్రియ, 45 రోజుల్లో వీసీ నియామకం.

ప్రొఫెసర్ల నియామకాలు, మిగిలిన విశ్వవిద్యాలయాల నోటిఫికేషన్‌తో కలిపి ఖాళీల భర్తీ చేయనున్నారు. 

లాప్‌ట్యాప్‌ల పంపిణీ, మూడు నాలుగు రోజుల్లో టెండర్లు పిలవనున్నారు. 

వెయ్యి 50 పడకలు, పరుపులు, వెంటనే 650 పడకలు సిద్ధం. త్వరలో మిగిలినవి సమకూర్చేలా నిర్ణయం.

ఇతర మౌలిక వసతులు, రూ 5.6 కోట్లు వెంటనే మంజూరు, డైరెక్టర్ కు చెక్ పవర్.

ప్లంబింగ్, విద్యూదీకరణ, ప్రతి సమస్యకు అక్టోబర్ 31 లోగా పరిష్కారం 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

HPV Vaccine India: దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
PM Kisan Yojana: హోలీకి PM కిసాన్ యోజన 22వ విడత నిధులు వస్తాయా? తాజా అప్‌డేట్ ఏంటీ?
హోలీకి PM కిసాన్ యోజన 22వ విడత నిధులు వస్తాయా? తాజా అప్‌డేట్ ఏంటీ?
HPV Vaccine: రూ. 10 HPV వ్యాక్సిన్ ఉచితంగా నేటి నుంచి పంపిణీ! వ్యాక్సినేషన్‌కు 14 ఏళ్ల బాలికలకు అవసరమయ్యే పత్రాలివే! 
రూ. 10 HPV వ్యాక్సిన్ ఉచితంగా నేటి నుంచి పంపిణీ! వ్యాక్సినేషన్‌కు 14 ఏళ్ల బాలికలకు అవసరమయ్యే పత్రాలివే! 
KCR Petition: కాళేశ్వరం కేసులో సాక్షిగా పిలిచి దోషిగా తేల్చారు! జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ రద్దు చేయాలని కేసీఆర్ న్యాయపోరాటం!
కాళేశ్వరం కేసులో సాక్షిగా పిలిచి దోషిగా తేల్చారు! జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ రద్దు చేయాలని కేసీఆర్ న్యాయపోరాటం!

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Nara Lokesh : సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
TTD budget: వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
Ananya Nagalla: తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
Pakistan vs Sri Lanka: టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
Embed widget