అన్వేషించండి

Nizamabad News : ఉపాధ్యాయ బదిలీల్లో తీరని స్పౌజ్ కష్టాలు, ఖాళీలున్నా పట్టించుకోని విద్యాశాఖ!

Nizamabad News : ఉపాధ్యాయ దంపతులను ఒకే జిల్లాకు ట్రాన్స్ ఫర్ చేసే ప్రక్రియ నిలిచిపోవడంతో టీచర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భర్త ఒక జిల్లాలో భార్య మరో జిల్లాలో విధులు నిర్వహిస్తున్నామని ఆవేదన చెందుతున్నారు.

Nizamabad News : నిజామాబాద్ జిల్లాలో భార్యభర్తలు ప్రభుత్వ టీచర్లుగా ఉన్న వారికి ఇబ్బందులు తప్పడంలేదు. భర్త ఒక జిల్లాలో విధులు నిర్వహిస్తుంటే భార్య మరో జిల్లాలో వందలాది కిలోమీటర్ల దూరంలో విధులు నిర్వహిస్తున్నారు. పిల్లల బాగోగులు, తల్లిదండ్రులు, అత్తమామలను చూసుకోనే సమయం లేక ఉపాధ్యాయ దంపతులు మానసిక వేదనకు గురవుతున్నారు. స్పౌజ్ బదిలీలు నెలలుగా పెండింగ్ ఉండడం,  భవిష్యత్తులో బదిలీలు జరుగుతాయో లేవో తెలియక ఉపాధ్యాయ వర్గాలలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. బ్లాక్ చేసిన 13 జిల్లాలలో ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నా విద్యాశాఖ పట్టించుకోకపోవడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 146 ఉపాధ్యాయ కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి.

బ్లాక్ లిస్ట్ లో 13 జిల్లాలు 

నూతన జోనల్ వ్యవస్థలో భాగంగా ఉపాధ్యాయ క్యాడర్ విభజన పూర్తయిన తరువాత సీనియారిటీ ప్రతిపాదికన బదిలీలు చేపట్టారు. జీవో నెంబరు 317 ప్రకారం బదిలీల్లో భాగంగా వేర్వేరు జిల్లాలకు కేటాయించిన ఉద్యోగ, ఉపాధ్యాయ దంపతుల బదిలీలను 19 జిల్లాల్లో నిర్వహించి, 13 జిల్లాలను బ్లాక్ లిస్ట్ లో చేర్చారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ దంపతులైన ఉద్యోగ, ఉపాధ్యాయులు ఒకచోట పనిచేసే విధంగా బదిలీలు నిర్వహిస్తామని అప్పట్లో ప్రకటించారు. దానికనుగుణంగా మోమో నెంబర్ 1655 కూడా విడుదల చేశారు. దీని ప్రకారం దంపతులైన ఉపాధ్యాయులు కోరుకున్న జిల్లాకు కేటాయించిన తర్వాత మిగిలిన వారికి జిల్లాల కేటాయింపు ప్రక్రియ జరపాలి. అయితే ఖాళీలు లేవన్న సాకుతో 13 జిల్లాలో స్పౌజ్ బదిలీలు నిలిపివేశారు. దీంతో ఉమ్మడి జిల్లాలో 146 ఉపాధ్యాయ దంపతుల బదిలీలు ఆగిపోయాయి. భార్యాభర్తలు చెరొక జిల్లాలో పనిచేయడంతో పిల్లల బాగోగులు, చదువులు, అత్తమామలు, తల్లిదండ్రులు ఆరోగ్యాలను పట్టించుకునే సమయం లేక ఉపాధ్యాయ, ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఒత్తిడి బోధనపై పడి ప్రభావం చూపుతుంది.

ఖాళీలు ఉన్నా 

నిజామాబాద్ జిల్లాలో అన్ని క్యాడర్లను కలుపుకొని 1012 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్లు అధికారులు లెక్క తేల్చారు. జిల్లాల కేటాయింపు అనంతరం స్పౌజ్ కేటగిరిలో నిజామాబాద్ జిల్లాకు రావడానికి దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులు కేవలం 146 మంది మాత్రమే ఉన్నారు. వీరిని సొంతజిల్లాకు తీసుకురావడానికి ఖాళీల పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ విద్యాశాఖ వింత వైఖరితో జిల్లాను బ్లాక్ లిస్ట్ పెట్టడంతో ఉపాధ్యాయ దంపతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఇకనైనా తమ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు. బ్లాక్ లిస్ట్ తొలగించి మిగిలిన జిల్లాల్లో బదిలీలు పూర్తి చేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jeevan Reddy: జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
Drug case remand report: పోలీసుల్ని చంపి అయినా తప్పించుకోవాలనుకున్నారా? - రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
పోలీసుల్ని చంపి అయినా తప్పించుకోవాలనుకున్నారా? - రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
Telangana Assembly: వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
Regional Ring Rail Project: హైదరాబాద్‌కు గుడ్ న్యూస్! రీజనల్ రింగ్ రైల్ సర్వేకు గ్రీన్ సిగ్నల్, ఇక పట్టాలెక్కేనా?
హైదరాబాద్‌కు మరో మెగా ప్రాజెక్టు... రీజనల్ రింగ్ రైల్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jeevan Reddy: జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
YS Avinash Reddy: హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
Telangana Assembly: వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Sreeleela : శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
Iran Dancing Missile: డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
Tamil Nadu Assembly Elections 2026: రజనీ ఫ్యాన్స్ తో కయ్యం పెట్టుకున్న టీవీకే విజయ్ పార్టీ నేత - ఇక రాజకీయం కాదు ఫ్యాన్ వార్స్ తప్పవా?
రజనీ ఫ్యాన్స్ తో కయ్యం పెట్టుకున్న టీవీకే విజయ్ పార్టీ నేత - ఇక రాజకీయం కాదు ఫ్యాన్ వార్స్ తప్పవా?
Vizag Semi-ring Road: భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
Embed widget