అన్వేషించండి

Basara IIIT News : బాసర ట్రిపుల్ ఐటీలో మారని పరిస్థితులు, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం!

Basara IIIT News : బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ ఘటన సంచలనం అయింది. వందల సంఖ్యలో విద్యార్థినులు అస్వస్థతకు గురికావడంతో ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో మౌలిక సదుపాయాలపై విమర్శలు వస్తున్నాయి.

Basara IIIT News : బాసర ట్రిపుల్ ఐటీలో పుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపుతోంది. ఇటీవల 7 రోజులు విద్యార్థులు శాంతి యుతంగా నిరసనలు తెలిపినా వారి సమస్యలు అలాగే ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్థులతో మాట్లాడి హామీలు తీరుస్తామని చెప్పినా ఫలితం లేకుండా పోయింది. మళ్లీ ట్రిపుల్ ఐటీ కథ మొదటికొచ్చింది. 350 మందికి పైగా విద్యార్థులు ఆహారం వికటించి అస్వస్థతకు గురికావడం ఆందోళన కలిగిస్తోంది. కొందరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని తెలిస్తోంది. ప్రాణాలు పోతే ఎవరు బాధ్యతవహిస్తారని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. మెస్ కాంట్రాక్టర్లు అదే తప్పిదాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. శుక్రవారం ఫుడ్ పాయిజన్ అవ్వడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులు చికిత్స పొందుతున్న ఆస్పత్రులకు తరలి వచ్చి విద్యార్థుల ఆరోగ్య విషయాలను ఆరా తీశారు.

Basara IIIT News : బాసర ట్రిపుల్ ఐటీలో మారని పరిస్థితులు, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం!

ఫుడ్ పాయిజన్ 

బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ కు గురైన విద్యార్థినుల్లో  29 మంది జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇందులో ఆరుగురిని డిశ్చార్జ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రిలో 17 మంది, నవీపేటలోని ప్రైవేటు నర్సింగ్ హోంలో మరో 12 మంది చేరారు. వీరిలో కోమలి, హరిత అనే విద్యార్ధినుల పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ సుదర్శనం విద్యార్థినులకు అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షిస్తున్నారు. ట్రిపుల్ ఐటీలో శుక్రవారం మధ్యాహ్నం ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్న విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. గంట వ్యవధిలోనే విద్యార్థినులు వాంతులు చేసుకున్నారు. తోటి విద్యార్థినులు 108కు ఫోన్ చేయడంతో అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రులకు తరలించారు. విద్యార్థినులకు మెరుగైన చికిత్స అందించామని జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ గోపికృష్ణ రాయుడు తెలిపారు. ఇద్దరు విద్యార్ధినులకు బీపీ తక్కువ కావడం వల్లే అస్వస్థతతో ఉన్నారని, వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. డీఎంహెచ్ వో డాక్టర్ సుదర్శనం మాట్లాడుతూ విద్యార్థినులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామన్నారు. 

Basara IIIT News : బాసర ట్రిపుల్ ఐటీలో మారని పరిస్థితులు, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం!

విద్యార్థులను పరామర్శించిన బలమూరి వెంకట్  

అస్వస్థతకు గురైన విద్యార్థులను పలువురు నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు పరామర్శించారు. ఎన్ఎస్యూ ఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్ నిజామాబాద్ నగరంలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను శనివారం ఉదయం పరామర్శించారు. ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థులపై ప్రభుత్వం చిన్న చూపుచూస్తోందని ఆరోపించారు. బీజేపీ నాయకులు కూడా విద్యార్థుల సమస్యలను, వారి ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 

Basara IIIT News : బాసర ట్రిపుల్ ఐటీలో మారని పరిస్థితులు, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం!

కొనసాగుతోన్న అరెస్టులు 

బాసర ట్రిబుల్ ఐటీలో శుక్రవారం అస్వస్థతకు గురై కోలుకుంటున్న విద్యార్థులను పరామర్శించడానికి వచ్చిన ఏఐసీసీ కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రామారావు పటేల్ లను  ట్రిపుల్ ఐటీ లోపలకు వెళ్లకుండా పోలీస్ లు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి గేటు ముందు ధర్నా చేపట్టటంతో పోలీసులు వారిని అరెస్టు చేసి ముధోల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో కొద్ది సేపు ట్రిబుల్ ఐటీ ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక క్యాంపస్ లోపల కూడా విద్యార్థులు నిరసన చేపట్టారు. శుక్రవారం విద్యార్థుల అస్వస్థతకు కారణమైన కుళ్లిన కోడిగుడ్లను డైరెక్టర్ కార్యాలయం ముందు పెట్టి ఆందోళన చేపట్టారు. సంఘటనకు కారకులైన వారిపై వెంటనే చర్యలు తీసుకుని క్యాంపస్ లో మౌలిక వసతులు కల్పించి నాణ్యమైన భోజనం అందించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇంటి ముందు ABVP నాయకులు ధర్నా చేపట్టారు. పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget