అన్వేషించండి

Basara IIIT News : బాసర ట్రిపుల్ ఐటీలో మారని పరిస్థితులు, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం!

Basara IIIT News : బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ ఘటన సంచలనం అయింది. వందల సంఖ్యలో విద్యార్థినులు అస్వస్థతకు గురికావడంతో ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో మౌలిక సదుపాయాలపై విమర్శలు వస్తున్నాయి.

Basara IIIT News : బాసర ట్రిపుల్ ఐటీలో పుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపుతోంది. ఇటీవల 7 రోజులు విద్యార్థులు శాంతి యుతంగా నిరసనలు తెలిపినా వారి సమస్యలు అలాగే ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్థులతో మాట్లాడి హామీలు తీరుస్తామని చెప్పినా ఫలితం లేకుండా పోయింది. మళ్లీ ట్రిపుల్ ఐటీ కథ మొదటికొచ్చింది. 350 మందికి పైగా విద్యార్థులు ఆహారం వికటించి అస్వస్థతకు గురికావడం ఆందోళన కలిగిస్తోంది. కొందరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని తెలిస్తోంది. ప్రాణాలు పోతే ఎవరు బాధ్యతవహిస్తారని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. మెస్ కాంట్రాక్టర్లు అదే తప్పిదాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. శుక్రవారం ఫుడ్ పాయిజన్ అవ్వడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులు చికిత్స పొందుతున్న ఆస్పత్రులకు తరలి వచ్చి విద్యార్థుల ఆరోగ్య విషయాలను ఆరా తీశారు.

Basara IIIT News : బాసర ట్రిపుల్ ఐటీలో మారని పరిస్థితులు, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం!

ఫుడ్ పాయిజన్ 

బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ కు గురైన విద్యార్థినుల్లో  29 మంది జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇందులో ఆరుగురిని డిశ్చార్జ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రిలో 17 మంది, నవీపేటలోని ప్రైవేటు నర్సింగ్ హోంలో మరో 12 మంది చేరారు. వీరిలో కోమలి, హరిత అనే విద్యార్ధినుల పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ సుదర్శనం విద్యార్థినులకు అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షిస్తున్నారు. ట్రిపుల్ ఐటీలో శుక్రవారం మధ్యాహ్నం ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్న విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. గంట వ్యవధిలోనే విద్యార్థినులు వాంతులు చేసుకున్నారు. తోటి విద్యార్థినులు 108కు ఫోన్ చేయడంతో అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రులకు తరలించారు. విద్యార్థినులకు మెరుగైన చికిత్స అందించామని జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ గోపికృష్ణ రాయుడు తెలిపారు. ఇద్దరు విద్యార్ధినులకు బీపీ తక్కువ కావడం వల్లే అస్వస్థతతో ఉన్నారని, వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. డీఎంహెచ్ వో డాక్టర్ సుదర్శనం మాట్లాడుతూ విద్యార్థినులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామన్నారు. 

Basara IIIT News : బాసర ట్రిపుల్ ఐటీలో మారని పరిస్థితులు, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం!

విద్యార్థులను పరామర్శించిన బలమూరి వెంకట్  

అస్వస్థతకు గురైన విద్యార్థులను పలువురు నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు పరామర్శించారు. ఎన్ఎస్యూ ఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్ నిజామాబాద్ నగరంలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను శనివారం ఉదయం పరామర్శించారు. ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థులపై ప్రభుత్వం చిన్న చూపుచూస్తోందని ఆరోపించారు. బీజేపీ నాయకులు కూడా విద్యార్థుల సమస్యలను, వారి ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 

Basara IIIT News : బాసర ట్రిపుల్ ఐటీలో మారని పరిస్థితులు, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం!

కొనసాగుతోన్న అరెస్టులు 

బాసర ట్రిబుల్ ఐటీలో శుక్రవారం అస్వస్థతకు గురై కోలుకుంటున్న విద్యార్థులను పరామర్శించడానికి వచ్చిన ఏఐసీసీ కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రామారావు పటేల్ లను  ట్రిపుల్ ఐటీ లోపలకు వెళ్లకుండా పోలీస్ లు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి గేటు ముందు ధర్నా చేపట్టటంతో పోలీసులు వారిని అరెస్టు చేసి ముధోల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో కొద్ది సేపు ట్రిబుల్ ఐటీ ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక క్యాంపస్ లోపల కూడా విద్యార్థులు నిరసన చేపట్టారు. శుక్రవారం విద్యార్థుల అస్వస్థతకు కారణమైన కుళ్లిన కోడిగుడ్లను డైరెక్టర్ కార్యాలయం ముందు పెట్టి ఆందోళన చేపట్టారు. సంఘటనకు కారకులైన వారిపై వెంటనే చర్యలు తీసుకుని క్యాంపస్ లో మౌలిక వసతులు కల్పించి నాణ్యమైన భోజనం అందించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇంటి ముందు ABVP నాయకులు ధర్నా చేపట్టారు. పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌పై హైకోర్టు ఆగ్రహం- నేరుగా హాజరుకావాలని ఆదేశం 
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌పై హైకోర్టు ఆగ్రహం- నేరుగా హాజరుకావాలని ఆదేశం 
Hyderabad CURE Housing Scheme: హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
MCGS MSME Scheme: మ్యూచువల్ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్.. పూచీకత్తు లేకుండా రూ.100 కోట్ల వరకు లోన్.. అర్హతలు, ఎలా అప్లై చేసుకోవాలంటే?
మ్యూచువల్ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్.. పూచీకత్తు లేకుండా రూ.100 కోట్ల వరకు లోన్.
Trainee IPS Suicide Attempt: లైంగిక వేధింపుల ఆరోపణలు- ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం.. ఆయన బ్యాక్‌గ్రౌండ్ తెలుసా
లైంగిక వేధింపుల ఆరోపణలు- ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం.. ఆయన బ్యాక్‌గ్రౌండ్ తెలుసా

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lenin Collections : లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
Hyderabad CURE Housing Scheme: హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
Tirumala Sarva Darshan Re Entry Facility: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
Double Murder Case : జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
Embed widget