అన్వేషించండి

Nagarjuna statement: నాగచైతన్య, సమంత విడాకులపై వ్యాఖ్యలు అనుచితం- కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలన్న నాగార్జున

Actor Nagarjuna statement in Defamation case | మంత్రి కొండా సురేఖ తమ కుటుంబంపై దారుణవ్యాఖ్యలు చేశారని, నాగచైతన్య, సమంత విడాకులకు కేటీఆర్ కారణమని అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు కోర్టుకు నాగార్జున తెలిపారు.

Nampally Court records Actor Nagarjuna statement in Defamation case against Konda Surekha | హైదరాబాద్: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై దాఖలు చేసిన పరువునష్టం దావాపై టాలీవుడ్ నటుడు నాగార్జున, ఆయన భార్య, నటి అమల, నటుడు నాగచైతన్య నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. తమ కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయని, సినిమా రంగం ద్వారా దేశ వ్యాప్తంగా తమ కుటుంబానికి ప్రజల ఆధారాభిమానాలు ఉన్నాయని నాగార్జున చెప్పారు. తమ కుటుంబసభ్యులు నటించిన సినిమాలకు సైతం జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయని, సినిమా రంగంతో పాటు పలు సామజిక సేవా కార్యక్రమాలు సైతం తన ఫ్యామిలీ చేస్తున్నట్లు కోర్టుకు తెలిపారు. నటుడు నాగార్జునతో పాటు సుప్రియ వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న కోర్టు కేసు తదుపరి విచారణ అక్టోబర్ 10కి వాయిదా వేసింది. ఆరోజు మరో సాక్షి వెంకటేశ్వర్లు స్టేట్ మెంట్ ను కోర్టు రికార్డు చేయనుంది.

మంత్రిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరిన నాగార్జున

తన కొడుకు నాగ చైతన్య, సమంతల విడాకులు మాజీ మంత్రి కేటీఆర్ కారణంగా జరిగాయని మంత్రి కొండా సురేఖ అసభ్యంగా మాట్లాడారని చెప్పారు. అందులో నా ప్రమేయం సైతం ఉన్నట్లు మహిళా మంత్రి బహిరంగంగా అలా మాట్లాడం వల్ల మా కుటుంబ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లిందని నాగార్జున స్టేట్ మెంట్ ను కోర్టు రికార్డు చేసింది. తమ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లేలా వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును నాగార్జున కోరారు. బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి, ఓ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తమను ఎంతగానో బాధించాయని నాగార్జున అన్నారు.

పిటిషన్ ఫైల్ చేయడానికి కారణం, ఉద్దేశం ఏంటని నాగార్జునను కోర్టు ప్రశ్నించింది. మంత్రి కొండా సురేఖ తమ రాజకీయ ప్రయోజనాల కోసం తన ఫ్యామిలీపై అమర్యాద పూర్వక వాఖ్యలు చేశారని.. దాంతో తమ పరువు, మర్యాదలకు భంగం వాటిల్లిందని నాగార్జున స్టేట్ మెంట్ ఇచ్చారు. ముఖ్యంగా తన కొడుకు నాగచైతన్య, సమంత విడాకులుపై మంత్రి కొండా సురేఖ అనుచిత వాఖ్యలు చేశారని.. ఆమె చర్యలకు ఆదేశించాలని కోర్టును నాగార్జున కోరారు. ఇది చాలా తీవ్రమైన అంశమని, అందుకే పరువు నష్టం దావా వేసినట్లు నాగార్జున తెలిపారు.

కోర్టు ఆదేశాలతో విచారణకు హాజరైన నాగార్జున ఫ్యామిలీ

నాగార్జున వేసిన పరువునష్టం పిటిషన్ పై నాంపల్లి కోర్టులో సోమవారం విచారణ జరిగింది. సీనియర్ న్యాయవాది అశోక్ రెడ్డి ఆయన తరఫున వాదనలు వినిపించారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ నటుడు నాగార్జున కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ముఖ్యంగా నటీనటులు నాగ చైతన్య, సమంత విడాకులపై చేసిన వ్యాఖ్యలు వారి కుటుంబం పరువు ప్రతిష్టలు దిబ్బతినేలా ఉన్నాయని వాదనలు వినిపించారు. వాదనలు విన్న కోర్టు పిటిషనర్ నాగార్జున స్టేట్ మెంట్ రికార్డు చేయాలని.. ఆయనను కోర్టుకు హాజరు కావాలని, సాక్షులు సైతం రావాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో నాగార్జున, అమల, నాగచైతన్య నాంపల్లి కోర్టుకు మంగళవారం మధ్యాహ్నం హాజరయ్యారు. వీరితో పాటు నాగార్జున ఓ సోదరి, ఆయన మేనకోడలు సుప్రియ ఇతర సాక్షులు కోర్టుకు హాజరయ్యారు. నాగార్జున స్టేట్ మెంట్ రికార్డు చేసుకున్న కోర్టు మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకుంటారా, లేక మందలించి వదిలేస్తారా అనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Also Read: Director Ruthvik Yelagari: ప్రభాస్ పాన్ ఇండియా సినిమాకు పని చేసిన కుర్రాడు ఓటీటీ సినిమా 'తత్వ' దర్శకుడని మీకు తెలుసా?

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Lok Sabha Seats: లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరుగుతాయి
లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరుగుతాయి
Telangana Congress: గులాబీ కోటలపై కాంగ్రెస్ పంజా.. రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించేనా?
గులాబీ కోటలపై కాంగ్రెస్ పంజా.. రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించేనా?
Formula E Race Case: ఫార్ములా ఈ కార్ రేస్ కేసు చార్జిషీట్.. ఏ1గా కేటీఆర్‌, క్విడ్ ప్రోకో జరిగిందన్న ఏసీబీ
ఫార్ములా ఈ కార్ రేస్ కేసు చార్జిషీట్.. ఏ1గా కేటీఆర్‌, క్విడ్ ప్రోకో జరిగిందన్న ఏసీబీ
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!

వీడియోలు

5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ
MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Stock Market on 24 March: యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
Vijayawada Crime News: విజయవాడలో ఉగ్రమూలాలు! పాక్‌ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉన్న ముగ్గురు యువకుల అరెస్ట్!
విజయవాడలో ఉగ్రమూలాలు! పాక్‌ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉన్న ముగ్గురు యువకుల అరెస్ట్!
RCB vs SRH Tickets Live: నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. ఆర్సీబీ, సన్‌రైజర్స్ మ్యాచ్ టికెట్ ఎక్కడ తీసుకోవాలి
నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. RCB vs SRH Tickets ఎక్కడ తీసుకోవాలి
Bomb Threat: ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
Jasprit Bumrah: పేసర్ జస్ప్రిత్ బుమ్రాకు గాయం? IPL 2026 ముంబై ఇండియన్స్‌లో టెన్షన్!
పేసర్ జస్ప్రిత్ బుమ్రాకు గాయం? IPL 2026 ముంబై ఇండియన్స్‌లో టెన్షన్!
Priyadarshan Lissy: విడాకులైన పదేళ్ళ తర్వాత మాజీ భార్యతో దర్శకుడు... కళ్యాణీ పేరెంట్స్‌ మళ్లీ పెళ్లి చేసుకుంటారా?
విడాకులైన పదేళ్ళ తర్వాత మాజీ భార్యతో దర్శకుడు... కళ్యాణీ పేరెంట్స్‌ మళ్లీ పెళ్లి చేసుకుంటారా?
Amaravati Fire Accident: అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం.. విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు
అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం.. విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు
Falls Sick or Dies on a Plane : విమానంలో ప్రయాణికుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?
విమానంలో ప్రయాణికుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?
Embed widget