అన్వేషించండి

Revanth Reddy : సీతారామ ప్రాజెక్టు పంపు హౌస్ ను ప్రజలకు అంకితం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

Sitarama Project : సీఎం రేవంత్ రెడ్డి సీతారామ ప్రాజెక్టు రెండో పంప్ హౌస్ ను గురువారం ప్రారంభించి ప్రజలకు అంకితం ఇచ్చారు. ఈ ప్రాజెక్టుకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు.

Telangana News: సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పూసుగూడెంలో సీతారామ ప్రాజెక్టు రెండో పంప్ హౌస్ ను గురువారం ప్రారంభించి రాష్ట్ర ప్రజలకు అంకితం చేశారు. ప్రారంభోత్సవ అనంతరం సీతారామ ప్రాజెక్టు పైలాన్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఖమ్మం జిల్లాకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రాజెక్టు పూర్తి సహకరిస్తున్నట్లు తెలిపారు. ఇది తమ ప్రభుత్వ విశ్వసనీయతకు గుర్తింపుగా ఆయన పేర్కొన్నారు ప్రాజెక్టుల మీద సమగ్రంగా చర్చించామని వివరించారు. నల్గొండ జిల్లాలో చాలా ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయని, గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల డిజైన్ పేరుతో వేలకోట్లు దండుకుందన్నారు. కేసీఆర్, హరీష్ రావు బోగస్ మాటలు చెప్పారని విమర్శించారు. ప్రాజెక్టును పూర్తి చేయాలని కెసిఆర్ ఎప్పుడూ అనుకోలేదని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి పసుపు, కుంకుమ, పట్టు వస్త్రాలను వదిలారు.

ముగ్గురు నేతలు మూడు చోట్ల ప్రారంభోత్సవం..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆయకట్టుకు గోదావరి జలాలు అందించే సీతారామ ఎత్తిపోతల పథకం పంపు హౌస్, రాజీవ్ కెనాల్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పూసగూడెంలో సీతారామ ప్రాజెక్టు రెండో పంప్ హౌస్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించగా, కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. మరోవైపు అశ్వాపురం మండలం కొత్తూరులో సీతారామ ప్రాజెక్ట్ మొదటి పంపు హౌస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. అదేవిధంగా ములకపల్లి మండలం కమలాపురంలో మూడో పంప్ హౌస్ ను రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు. 

లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు..

సీతారామ ప్రాజెక్టు కింద లక్షలాది ఎకరాలకు నీరు అందించే అవకాశం ఏర్పడనుంది. ఈ పథకం కింద దాదాపు 3.29 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టుకు, 3.45 లక్షల ఎకరాల స్థిరీకరణ ఆయకట్టుకు మీరు ఇవ్వాలన్నది లక్ష్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జలయజ్ఞం కింద నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ఎత్తిపోతల పథకాలను అప్పటి ప్రభుత్వం చేపట్టింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత పునరాకృతిలో భాగంగా నిర్మాణంలో ఉన్న రెండు విత్తిపోతల పథకాలు స్థానంలో సీతారామకు గత కెసిఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

Also Read: జెండా పండుగ సాక్షిగా మద్యం అమ్మకాలు! కరీంనగర్‌లో విచ్చలవిడిగా

2016 ఫిబ్రవరి 16న రూ7,926 కోట్లతో దేనికి పరిపాలన అనుమతిని అప్పటి కెసిఆర్ ప్రభుత్వం ఇచ్చింది. 2018లో ఈ అంచనా వ్యయం రూ.13,057.98 కోట్లకు పెరిగింది. ఇప్పటికే చేపట్టిన పనులకు పెరిగిన ధరలు, ఇంకా టెండర్లు పిలవాల్సిన డిస్ట్రిబ్యూటరీ పనులకు కలిపి సుమారు రూ.18,600 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఇప్పటి వరకు రూ.7,919 కోట్ల రూపాయలకు ఖర్చు చేయగా, సుమారు మరో రూ.10 వేల కోట్లు వ్యయం చేయాల్సి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయినప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ పనులు చేసేందుకే ముందుకు సాగుతోంది. దీనివల్ల లక్షలాది ఎకరాలు సాగులోకి రావడం వలన రైతులకు మేలు జరుగుతుందన్నది ప్రభుత్వ అంచనా. ఈ జిల్లాలోని మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఈ ప్రాజెక్టును పూర్తి చేయడంపై ప్రత్యేకంగా దృష్టి సారించి ముందుకు సాగుతున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధను కనబరిచి ప్రభుత్వాన్ని ముందుకు వెళ్లేలా ఒప్పించారు.

Also Read: ప్యాంటు జేబులో సెల్‌ఫోన్ పెడుతున్నారా? అలా చేసే ముందు ఈ స్టోరీ చదవండి?

టాప్ హెడ్ లైన్స్

Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
Hyderabad Fake Liquor Gang: యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
Hyderabad Fake Liquor Gang: యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
 ICC Rankings Boost: టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా తగ్గని ర్యాంకింగ్స్
టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా నిలబెట్టుకున్న ర్యాంకులు
Avinash Narne Wife Murder: అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
Renault Duster on EMI: 2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
Vizag Fishermen Missing Case: విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
Embed widget