అన్వేషించండి

Sathupally Railway Line: కొత్తగూడెం - సత్తుపల్లి మార్గంలో రైలు ప్రారంభం, రికార్డు సమయంలో నిర్మించిన 54 కిలోమీటర్ల రైల్వే లైన్‌

New Railway line to Sathupally: ఎన్నో ఏళ్లుగా రైలు కూత కోసం ఎదురుచూసిన సత్తుపల్లి వాసులకు ఎట్టకేలకు రైలు కూత వినిపించింది. రెండున్నరేళ్లలోనే 51.10 కిలోమీటర్ల మేర రైల్‌ నిర్మాణాన్ని పూర్తి చేశారు.

New Railway line From Kothagudem to Sathupally: ఎన్నో ఏళ్లుగా రైలు కూత కోసం ఎదురుచూసిన సత్తుపల్లి వాసులకు ఎట్టకేలకు రైలు కూత వినిపించింది. కేవలం రెండున్నరేళ్లలోనే 51.10 కిలోమీటర్ల మేర రైల్‌ నిర్మాణాన్ని అధికారులు పూర్తి చేశారు. సింగరేణి సంస్థ సత్తుపల్లి నుంచి బొగ్గు రవాణా కోసం ప్రత్యేకంగా ఈ రైల్వే నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు. రోడ్డు మార్గం నుంచి బొగ్గు రవాణా చేయవద్దని గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలు చేయడంతో ఈ రైలు మార్గాన్ని నిర్మించారు. 
వేగవంతంగా నిర్మాణమైన రైల్వే లైన్‌..
సింగరేణి సంస్థ సత్తుపల్లిలోని జేవీఆర్‌ ఓసీపీ, కిష్టారం ఓసీపీ నుంచి ఉత్పత్తి చేసే బొగ్గును రవాణా చేసేందుకు ఈ రైలు మార్గాన్ని నిర్మించారు. ఈ రెండు ఓసీపీల ద్వారా 10 మిలియన్‌ టన్నుల బొగ్గు తవ్వకాలను చేసేందుకు లక్ష్యంగా చేసుకున్న సింగరేణి సంస్థ దీనిని ఉత్పత్తి చేసిన బొగ్గును తరిలించేందుకు ఈ రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి రోజు 30 వేల టన్నుల బొగ్గును ఈ మార్గం ద్వారా రవాణా చేసేందుకు అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. మొత్తం రూ.927.94 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ రైలు మార్గానికి సింగరేణి సంస్థ రూ. రూ.618.55 కోట్లు కేటాయించగా, దక్షిణ మధ్య రైల్వే రూ.309.39 కోట్లు భరించింది. రెండున్నరేళ్ల కాలంలో కొత్తగూడెం నుంచి సత్తుపల్లి వరకు 51.10 కిలోమీటర్ల మేర ఈ రైల్వే నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ రైల్వే లైన్‌ వెళ్లే మార్గంలో కొత్తగూడెం – ఖమ్మం రహదారి, జగదల్‌పూర్‌ – విజయవాడ జాతీయ రహదారిపై చేస్తున్న ఆర్‌వోబీ (రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జి)లు ఇంకా నిర్మాణంలోనే ఉన్నాయి. అయితే రైలు మార్గం పూర్తి కావడంతో అధికారులు ట్రయల్‌ రన్‌ను పూర్తి చేశారు. 
బొగ్గు రవాణాకు మాత్రమే..
కొత్తగూడెం నుంచి కొవ్వూరుకు రైల్వే లైన్‌ను నిర్మించాలని దశాబ్ధాల కాలంగా పోరాటం సాగుతుంది. అయితే కేంద్రం ఈ రైల్‌ మార్గం నిర్మాణానికి ఆమోదం తెలిపినప్పటికీ నిధులు మాత్రం కేటాయించకపోవడంతో ఇప్పటి వరకు అది పూర్తి కాలేదు. అయితే సింగరేణి బొగ్గు రవాణా కోసం ఏర్పాటు చేస్తున్న ఈ రైల్వే లైన్‌ వల్ల తమ గ్రామాలకు రైలు మార్గం అందుబాటులోకి వస్తుందని సత్తుపల్లి ప్రాంత వాసులు ఆశపడ్డారు. అయితే ఇది కేవలం బొగ్గు రవాణా కోసం మాత్రమే ఏర్పాటు చేయడం గమనార్హం. మరో రెండు కిలోమీటర్ల దూరం రైల్వే లైన్‌ నిర్మాణం పూర్తి చేస్తే సత్తుపల్లి వాసులకు సైతం ప్రయాణానికి రైలు మార్గం అందుబాటులోకి వస్తుంది. కనీసం బొగ్గు రవాణా కోసం రైలు మార్గం నిర్మాణం కావడంతో భవిష్యత్‌లో తమకు రైలు మార్గం అందుబాటులోకి వస్తుందని సత్తుపల్లి ప్రాంత వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: Boy Smoking: KGF 2 రాకీ భాయ్‌లా ట్రై చేసిన స్టూడెంట్, వెంటనే ఆసుపత్రిలో జాయిన్ చేసిన పేరెంట్స్

టాప్ హెడ్ లైన్స్

Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
LPG Lite Instant Cylinder: విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Embed widget