అన్వేషించండి

Sathupally Railway Line: కొత్తగూడెం - సత్తుపల్లి మార్గంలో రైలు ప్రారంభం, రికార్డు సమయంలో నిర్మించిన 54 కిలోమీటర్ల రైల్వే లైన్‌

New Railway line to Sathupally: ఎన్నో ఏళ్లుగా రైలు కూత కోసం ఎదురుచూసిన సత్తుపల్లి వాసులకు ఎట్టకేలకు రైలు కూత వినిపించింది. రెండున్నరేళ్లలోనే 51.10 కిలోమీటర్ల మేర రైల్‌ నిర్మాణాన్ని పూర్తి చేశారు.

New Railway line From Kothagudem to Sathupally: ఎన్నో ఏళ్లుగా రైలు కూత కోసం ఎదురుచూసిన సత్తుపల్లి వాసులకు ఎట్టకేలకు రైలు కూత వినిపించింది. కేవలం రెండున్నరేళ్లలోనే 51.10 కిలోమీటర్ల మేర రైల్‌ నిర్మాణాన్ని అధికారులు పూర్తి చేశారు. సింగరేణి సంస్థ సత్తుపల్లి నుంచి బొగ్గు రవాణా కోసం ప్రత్యేకంగా ఈ రైల్వే నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు. రోడ్డు మార్గం నుంచి బొగ్గు రవాణా చేయవద్దని గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలు చేయడంతో ఈ రైలు మార్గాన్ని నిర్మించారు. 
వేగవంతంగా నిర్మాణమైన రైల్వే లైన్‌..
సింగరేణి సంస్థ సత్తుపల్లిలోని జేవీఆర్‌ ఓసీపీ, కిష్టారం ఓసీపీ నుంచి ఉత్పత్తి చేసే బొగ్గును రవాణా చేసేందుకు ఈ రైలు మార్గాన్ని నిర్మించారు. ఈ రెండు ఓసీపీల ద్వారా 10 మిలియన్‌ టన్నుల బొగ్గు తవ్వకాలను చేసేందుకు లక్ష్యంగా చేసుకున్న సింగరేణి సంస్థ దీనిని ఉత్పత్తి చేసిన బొగ్గును తరిలించేందుకు ఈ రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి రోజు 30 వేల టన్నుల బొగ్గును ఈ మార్గం ద్వారా రవాణా చేసేందుకు అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. మొత్తం రూ.927.94 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ రైలు మార్గానికి సింగరేణి సంస్థ రూ. రూ.618.55 కోట్లు కేటాయించగా, దక్షిణ మధ్య రైల్వే రూ.309.39 కోట్లు భరించింది. రెండున్నరేళ్ల కాలంలో కొత్తగూడెం నుంచి సత్తుపల్లి వరకు 51.10 కిలోమీటర్ల మేర ఈ రైల్వే నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ రైల్వే లైన్‌ వెళ్లే మార్గంలో కొత్తగూడెం – ఖమ్మం రహదారి, జగదల్‌పూర్‌ – విజయవాడ జాతీయ రహదారిపై చేస్తున్న ఆర్‌వోబీ (రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జి)లు ఇంకా నిర్మాణంలోనే ఉన్నాయి. అయితే రైలు మార్గం పూర్తి కావడంతో అధికారులు ట్రయల్‌ రన్‌ను పూర్తి చేశారు. 
బొగ్గు రవాణాకు మాత్రమే..
కొత్తగూడెం నుంచి కొవ్వూరుకు రైల్వే లైన్‌ను నిర్మించాలని దశాబ్ధాల కాలంగా పోరాటం సాగుతుంది. అయితే కేంద్రం ఈ రైల్‌ మార్గం నిర్మాణానికి ఆమోదం తెలిపినప్పటికీ నిధులు మాత్రం కేటాయించకపోవడంతో ఇప్పటి వరకు అది పూర్తి కాలేదు. అయితే సింగరేణి బొగ్గు రవాణా కోసం ఏర్పాటు చేస్తున్న ఈ రైల్వే లైన్‌ వల్ల తమ గ్రామాలకు రైలు మార్గం అందుబాటులోకి వస్తుందని సత్తుపల్లి ప్రాంత వాసులు ఆశపడ్డారు. అయితే ఇది కేవలం బొగ్గు రవాణా కోసం మాత్రమే ఏర్పాటు చేయడం గమనార్హం. మరో రెండు కిలోమీటర్ల దూరం రైల్వే లైన్‌ నిర్మాణం పూర్తి చేస్తే సత్తుపల్లి వాసులకు సైతం ప్రయాణానికి రైలు మార్గం అందుబాటులోకి వస్తుంది. కనీసం బొగ్గు రవాణా కోసం రైలు మార్గం నిర్మాణం కావడంతో భవిష్యత్‌లో తమకు రైలు మార్గం అందుబాటులోకి వస్తుందని సత్తుపల్లి ప్రాంత వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: Boy Smoking: KGF 2 రాకీ భాయ్‌లా ట్రై చేసిన స్టూడెంట్, వెంటనే ఆసుపత్రిలో జాయిన్ చేసిన పేరెంట్స్

టాప్ హెడ్ లైన్స్

Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget