అన్వేషించండి

Nagarjuna Sagar: ప్రపంచంలోనే అతిపెద్ద రాతి కట్టడమైన నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 56 ఏళ్లు!

Nagarjuna Sagar: ప్రపంచంలోనే అతిపెద్దది అయిన, అతి పొడవైన రాతి కట్టడం నాగార్జున సాగర్ అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టు నేటితో 56 ఏళ్లు పూర్తి చేసుకుంది. 

Nagarjuna Sagar: ప్రపంచంలోనే అతిపెద్దది అయిన మానవ కట్టడం, అలాగే అతిపొడవైన రాతి కట్టడం నాగార్జున సాగర్. రెండు తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలను సస్యశ్యామలంగా మార్చిన ఈ ప్రాజెక్టు నేటితో 56 ఏళ్లు పూర్తి చేసుకుంది. సరిగ్గా 56 ఏళ్ల క్రితం ఈ ప్రాజెక్టును అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ జాతికి అంకితం చేశారు. కరువు కాటకాలతో అల్లాడుతున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చేందుకు ఈ ప్రాజెక్టు అవసరం అని భావించా... కృష్ణానదిపై నిర్మించేందుకు రంగం సిద్ధం చేశారు. ఇంతటి అపురూపమైన ఈ ప్రాజెక్టుకు 68 ఏళ్ల క్రితం అప్పటి ప్రధాని పండిట్ జవహార్ లాల్ నెహ్రూ 1955 డిసెంబర్ 10వ తేదీన నాగార్జున సాగర్ వద్ద శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి రోజుకు 45 వేల మంది 12 ఏళ్ల పాటు శ్రమించి ఈ ప్రాజెక్టును నిర్మించారు. 

మొత్తం 19 కోట్ల 71 లక్షల మంది కార్మికులు ఈ ప్రాజెక్టును నిర్మించేందుకు కృషి చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మితమైన ఈ అద్భుత కట్టడాన్ని ఆవిష్కరించారు. దీన్ని 1964లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ కాలువలకు నీటిని విడుదల చేసి జాతికి అంకితం ఇచ్చారు. 1955 డిసెంబర్ 10వ తేదీన నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు. అయితే 12 ఏళ్ల తర్వాత ఆయన కూతురే స్వయంగా నీటిని విడుదల చేయడం గమనార్హం. నాగార్జున సాగర్ ప్రాజెక్టు లక్షలాది ఎకరాలకు సాగునీరు వేలాది గ్రామాలకు తాగునీరు అందిస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా కుడి ఎడమ కాలువల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో 22 లక్షల ఎకరాలు సాగు అవుతోంది. 
అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ ఋణంతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఆధునీకరణ పనులను చేపట్టింది. 2010  ఆగస్టు 14వ తేదిన ప్రపంచ బ్యాంకుతో దీనిపై ఒప్పందం కుదిర్చుకుంది. సెప్టెంబర్ 10వ తేదీ 2010 నుంచి ఈ పథకం అమలులోకి వచ్చింది. ఈ పథకం అంచనా వ్యయం రూ.4444.41 కోట్లు. ఇందులో 48 శాతం ప్రపంచ బ్యాంకు ఋణం. రాష్ట్ర ప్రభుత్వం వాటా 52 శాతం. ఒప్పందానికి సంవత్సరం ముందు నుంచి నిబంధనలకు లోబడి జరిగిన వ్యయంలో ప్రపంచ బ్యాంకు ఋణం వాటా రిట్రోఏక్టివ్ ఫడింగ్ ద్వారా చెల్లిస్తుంది.

ఆధునీకరణ లక్ష్యాలు

నాగార్జున సాగర్ కాలువలను ఆధునీకరించి నీటి సరఫరా సామర్ధ్యాన్ని వృధ్ది చేస్తూ వ్యవసాయాభివృధ్ధి చేయుట,వ్యవసాయ ఉత్పాదకత పెంచడం. నీటిపారుదల ఆయకట్ట అభివృధ్ది శాఖ సామర్ధ్యాన్ని పెంపుచేసి జలవనరులను బహుముఖంగా, ప్రణాళికా బధ్ధంగా జలవనరులను అభివృధ్ది చేసి నిర్వహించడం. ఈ పథకం గరిష్ఠ లక్ష్యాలతో కూడుకుంది. ఈ పథకాన్ని ప్రధానంగా సాగునీరు ఆయకట్టు అభివృధ్ది శాఖ అమలు చేస్తుంది. వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, మత్స్య శాఖ, పశుసంవర్ధక శాఖలు ఈ పథకం అమలులో పాలు పంచుకుంటున్నాయి. ప్రభుత్వ శాఖలకు తోడు వాలంతారి, ఆచార్యఎన్.జి.రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం, సామేతి వంటి సంస్దలు ఈ పధకం అమలులో భాగస్వాములు అయ్యాయి. అయితే 2018లో రెండు సంవత్సరాల ఆలస్యంగా ఈ పథకం పూర్తయింది.

ఈ ప్రాజెక్టు వల్ల రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సిరులు పండించుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు వల్లే అన్నం మెతుకులు తింటున్నామని దేశానికి అన్నం పెడుతున్నామని ఆయక్టు రైతులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టును ఆయుకట్టు రైతులు దేవాలయంగా భావిస్తుంటారు. ఈసారి కూడా రాష్ట్ట్రంతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దీంతో ఈ ఏడాదికి కూడా ఆగస్టులోనే నీటిని విడుదల చేయవచ్చని రైతులు భావిస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: నా జీవితంలో ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి: చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
CM Chandrababu: నా జీవితంలో ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి: చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
Ramarajyam Raghav Reddy: చిలుకూరి పూజారినే కాదు చిన్న జీయర్ నూ టార్గెట్ చేసిన
చిలుకూరి పూజారినే కాదు చిన్న జీయర్ నూ టార్గెట్ చేసిన "రామరాజ్యం " రాఘవ రెడ్డి, అతడి లక్ష్యం ఇదే!
Sankranthiki Vasthunam: 'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్ పై హింట్ ఇచ్చిన వెంకటేష్... రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్ పై హింట్ ఇచ్చిన వెంకటేష్... రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
Crime News: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, 7 మంది తెలుగు భక్తులు మృతి - కుంభమేళాకు వెళ్లొస్తుంటే విషాదం
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, 7 మంది తెలుగు భక్తులు మృతి - కుంభమేళాకు వెళ్లొస్తుంటే విషాదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Attack on Chilkur Balaji Temple Rangarajan | రామరాజ్యం స్థాపించటానికి వచ్చాం అంటూ దాడి | ABP DesamVishwak sen on Prudhviraj Controversy | 11 గొర్రెలు కాంట్రవర్సీపై విశ్వక్ సారీ | ABP DesamAllu Aravind on Ram Charan | రామ్ చరణ్ పై వ్యాఖ్యల వివాదం మీద అల్లు అరవింద్ | ABP DesamPresident Murmu in Maha kumbh 2025 | మహా కుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: నా జీవితంలో ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి: చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
CM Chandrababu: నా జీవితంలో ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి: చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
Ramarajyam Raghav Reddy: చిలుకూరి పూజారినే కాదు చిన్న జీయర్ నూ టార్గెట్ చేసిన
చిలుకూరి పూజారినే కాదు చిన్న జీయర్ నూ టార్గెట్ చేసిన "రామరాజ్యం " రాఘవ రెడ్డి, అతడి లక్ష్యం ఇదే!
Sankranthiki Vasthunam: 'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్ పై హింట్ ఇచ్చిన వెంకటేష్... రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్ పై హింట్ ఇచ్చిన వెంకటేష్... రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
Crime News: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, 7 మంది తెలుగు భక్తులు మృతి - కుంభమేళాకు వెళ్లొస్తుంటే విషాదం
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, 7 మంది తెలుగు భక్తులు మృతి - కుంభమేళాకు వెళ్లొస్తుంటే విషాదం
Rana Daggubati: తెలుగులో రిలీజ్ కాని రానా దగ్గుబాటి మూవీ... సమంత నటించిన ఆ ఫ్లాప్ సినిమా పేరేంటో తెలుసా?
తెలుగులో రిలీజ్ కాని రానా దగ్గుబాటి మూవీ... సమంత నటించిన ఆ ఫ్లాప్ సినిమా పేరేంటో తెలుసా?
Romantic Destinations : రొమాంటిక్ డెస్టినేషన్స్.. మీ ప్రేయసితో కలిసి వెళ్లేందుకు ఇండియాలో బెస్ట్ ప్లేస్​లు ఇవే
రొమాంటిక్ డెస్టినేషన్స్.. మీ ప్రేయసితో కలిసి వెళ్లేందుకు ఇండియాలో బెస్ట్ ప్లేస్​లు ఇవే
New Ration Cards: మీసేవ వెబ్‌సైట్‌లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుకు అవకాశం, వాళ్లు అప్లై చేయవద్దన్న అధికారులు
మీసేవ వెబ్‌సైట్‌లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుకు అవకాశం, వాళ్లు అప్లై చేయవద్దన్న అధికారులు
Allu Aravind: 'రామ్ చరణ్‌పై అలా మాట్లాడకుండా ఉండాల్సింది' - ట్రోలింగ్ వ్యాఖ్యలపై స్పందించిన అల్లు అరవింద్, ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా!
'రామ్ చరణ్‌పై అలా మాట్లాడకుండా ఉండాల్సింది' - ట్రోలింగ్ వ్యాఖ్యలపై స్పందించిన అల్లు అరవింద్, ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా!
Embed widget