అన్వేషించండి

Rajagopal Reddy: రేవంత్‌ను, ప్రభుత్వాన్ని ప్రజలు తిడుతున్నరు- ఎమ్మెల్యే రాజగోపాల్​ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తమ ప్రభుత్వంపై అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లో కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నారని అన్నారు

మునుగోడు: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తమ ప్రభుత్వంపై అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు బంధును ఎగ్గొట్టామని, రైతు భరోసాలో ఇచ్చిన హామీ మేరకు కాకుండా కొంత నగదు తగగ్గించామని, గ్రామాల్లో కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నారని రాజగోపాల్​ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్నాయి. 

కేసీఆర్ పాలనే బాగుండేదని మెచుకుంటున్నారు
కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న నాలుగు పథకాలు (ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్​ కార్డులు) ప్రారంభోత్సవంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం మసీదుగూడెంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రాజగోపాల్​ రెడ్డి మాట్లాడుతూ ‘తమకు రైతు రుణమాఫీ కాలేదని, రైతుబంధు రాలేదని గ్రామాల్లోని ప్రజలు ప్రభుత్వాన్ని తిరుడున్నారు. అంతా కేసీఆర్‌ పాలనే బాగుండేదని మెచ్చుకుంటున్నారు’ అని అన్నారు.

రైతు బంధును ఓసారి ఎగ్గొట్టినం!
‘రైతుబంధును మధ్యలో ఒకసారి ఎగ్గొట్టినం. రైతు భరోసాలో ఇచ్చిన హామీ మేరకు కాకుండా, కొంత నగదును తగ్గించినం. అందుకే గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని తిడుతున్నారు. అదే రూ.2 లక్షల రుణ మాఫీ అయినోల్లు మాత్రం జేబులో వేసుకొని సప్పుడు చేస్తలేరు. ఎన్ని అప్పులు చేసైనా పథకాలు అమలు చేస్తాం’ అని అన్నారు. ఇందుకు సంబంధించిన ఓ ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ప్రతిపక్షాల విమర్శలు
సొంత పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపైనే  రాజగోపాల్​ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేయడంతో.. ప్రతిపక్షాలు ఆ వ్యాఖ్యలను ఆయుధంగా చేసుకుంటున్నాయి. సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్​ ప్రభుత్వం పూర్తిగా ఫెయిలైందని, ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని పేర్కొంటున్నారు. ఏ ఒక్క హామీ కూడా పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని మండిపడుతున్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని ప్రజలు కూల్చేస్తారని బీఆర్​ఎస్​, బీజేపీ నేతలు పేర్కొంటున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
Shambhala Review : 'శంబాల' టీం ఫుల్ జోష్ - హిందీ వెర్షన్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్!... ముంబైలో ప్రమోషన్స్
'శంబాల' టీం ఫుల్ జోష్ - హిందీ వెర్షన్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్!... ముంబైలో ప్రమోషన్స్
Prakash Raj : వారిని మొరుగుతూనే ఉండనివ్వండి - అనసూయకు ప్రకాష్ రాజ్ సపోర్ట్
వారిని మొరుగుతూనే ఉండనివ్వండి - అనసూయకు ప్రకాష్ రాజ్ సపోర్ట్
Duvvada Srinivas: నా హత్యకు కృష్ణదాస్‌ కుట్ర, దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! ఘాటుగా స్పందించిన మాజీ డిసీఎం
నా హత్యకు కృష్ణదాస్‌ కుట్ర, దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! ఘాటుగా స్పందించిన మాజీ డిసీఎం
Embed widget