News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Minister Jagadish Reddy: "కాళేశ్వరం జలాలతో జిల్లాను సస్యశ్యామలం చేశారు సీఎం కేసీఆర్"

Minister Jagadish Reddy: ఎడారిలా మారిన జిల్లాను కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలం చేసింది సీఎం కేసీఆర్ అని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. 

FOLLOW US: 
Share:

Minister Jagadish Reddy: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సూర్యాపేట జిల్లాలో మంత్రి జగదీష్ రెడ్డి... లక్ష మంది స్థానికులతో లక్ష జన హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎడారిగా మారిన జిల్లాకు ఎస్సారెస్పీ ద్వారా కాళేశ్వరం నీటిని అందించినందుకు ముఖ్యమంత్రికి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. అందుకుగాను కాళేశ్వరం జలాలకు జన హారతి కార్యక్రమాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. సూర్యాపేట జిల్లాలో తిరుమలగిరి మండలం ఈటూరు నుంచి పెన్ పహాడ్ మండలం రావి చెరువు వరకు మొత్తం 68 కిలో మీటర్ల మేర ఎస్సారెస్పీ కాలు వెంట స్థానిక ప్రజలు గోదావరి జలాలలకు జల హారతిని సమర్పించారు.

చివ్వెంల మండల కేంద్రంలో జగదీష్ రెడ్డి కాళేశ్వరం జలాలకు జలహారతిని సమర్పించారు. నీటి కరవుతో ఇబ్బందులు పిడన నేల.. నేడు సస్యశ్యామలంగా మారడానికి కారణం ముఖ్యమంత్రేనని వెల్లడించారు. మొదట బోరు బావులు ఉపయోగించి వెయ్యి అడుగుల వరకు వెళ్లిన నీటి లభ్యతలేని ప్రాంతంగా ఉండేదన్నారు. కానీ సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం జలాలతో సాగునీటికి ఎలాంటి కొరత లేకుండా చేశారని చెప్పారు. 

వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం..

మంత్రి జగదీష్ రెడ్డి చేపట్టిన "కాళేశ్వరం నీరు - లక్షల జన హారతి" కార్యక్రమానికి అరుదైన గౌరవం దక్కింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మంత్రి గుంటకండ్ల జగదీశ్‌ రెడ్డికి వండర్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌ లో స్థానం లభించింది. ఈక్రమంలోనే ప్రతినిధులు మెడల్‌ తో పాటు జ్ఞాపిక, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. మంత్రి ఈ కార్యక్రమం నిర్వహించాలని పిలుపునిచ్చిన వెంటనే వండర్ వరల్డ్ ఆఫ్ బుక్ సంస్థ ప్రతినిధులు రంగంలోకి దిగి అధ్యయనం చేశారు. ఐడబ్ల్యూఎస్ఆర్ ఇండియా చీఫ్ డా. బి. నరేందర్ గౌడ్, తెలంగాణ కోఆర్డినేటర్ ఎ. గంగాదర్ లు.. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకు 7 మండలాల్లో పర్యటించారు. కాళేశ్వరం నీళ్లలో లక్ష మందితో లక్ష మంది పాల్గొన్నారని, ఈ కార్యక్రమంలో లక్షా 16 వేల 142 మంది పాల్గొన్నారని బృందం నిర్ధారించింది. వీరిలో 65 వేల 42 మంది మహిళలు ఉండగా.. 51,100 మంది పురుషులు పాల్గొన్నట్లు తెలిపింది.

సూర్యాపేట మండలానికి చెందిన 19881 మందిలో 8625 పురుషులు, 11,256 మహిళలు, చివ్వెంకు చెందిన 10,454 మంది మహిళలు, 9785 మంది పురుషులు, పెన్ పహాడ్ కు చెందిన 11935 మహిళలు, 8125 మంది పురుషులు, ఆత్మకూర్ ఎస్ కు చెందిన 10156 మహిళలు, 95821 మంది పురుషులు, 95825 మంది పురుషులు, 95825 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ లక్ష జన హారతి ముగిసిన తర్వాత.. ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేదికపైనే మంత్రి జగదీశ్‌రెడ్డికి ఘనంగా సన్మానం చేశారు. సంస్థ నిర్వాహకులు.. మంత్రి జగదీష్ రెడ్డికి మెడల్‌తో పాటు మెమెంటో సర్టిఫికెట్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌తో పాటు ఆసాంతం కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. వండర్ బుక్ ఆఫ్ వరల్డ్స్ నిర్వాహకులు, జిల్లా కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్‌లను ఘనంగా సత్కరించారు.

Published at : 07 Jun 2023 05:49 PM (IST) Tags: Minister Jagadish Reddy Kaleshwaram Project Telangana News Laksha Jana Harathi Program Minister Jagadish Reddy news

ఇవి కూడా చూడండి

TS TET: తెలంగాణ 'టెట్' పేప‌ర్-1లో 36.89 శాతం, పేప‌ర్‌-2లో 15.30 శాతం ఉత్తీర్ణత

TS TET: తెలంగాణ 'టెట్' పేప‌ర్-1లో 36.89 శాతం, పేప‌ర్‌-2లో 15.30 శాతం ఉత్తీర్ణత

NITW: వరంగల్ నిట్‌లో గ్రూప్‌-డి పోస్టుల నియామకాలు రద్దు, ఉత్తర్వులు జారీ

NITW: వరంగల్ నిట్‌లో గ్రూప్‌-డి పోస్టుల నియామకాలు రద్దు, ఉత్తర్వులు జారీ

Teachers Transfer: సెప్టెంబరు 28 నుంచి స్కూల్‌ అసిస్టెంట్ల బదిలీలకు వెబ్‌ ఆప్షన్లు, జోన్లవారీగా బదిలీలు ఇలా

Teachers Transfer: సెప్టెంబరు 28 నుంచి స్కూల్‌ అసిస్టెంట్ల బదిలీలకు వెబ్‌ ఆప్షన్లు, జోన్లవారీగా బదిలీలు ఇలా

TS TET 2023 Results: తెలంగాణ 'టెట్‌' ఫలితాలు విడుదల, రిజల్ట్స్ లింక్ ఇదే

TS TET 2023 Results: తెలంగాణ 'టెట్‌' ఫలితాలు విడుదల, రిజల్ట్స్ లింక్ ఇదే

TS TET 2023 Results: 27న తెలంగాణ 'టెట్‌' ఫలితాలు, రిజల్ట్స్ వెల్లడి సమయమిదే!

TS TET 2023 Results: 27న తెలంగాణ 'టెట్‌' ఫలితాలు, రిజల్ట్స్ వెల్లడి సమయమిదే!

టాప్ స్టోరీస్

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన

Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!

Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!

Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!

Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!

IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్‌ మాక్సీ! రాజ్‌కోట్‌ వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి

IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్‌ మాక్సీ! రాజ్‌కోట్‌ వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి