అన్వేషించండి

Minister Jagadish Reddy: "కాళేశ్వరం జలాలతో జిల్లాను సస్యశ్యామలం చేశారు సీఎం కేసీఆర్"

Minister Jagadish Reddy: ఎడారిలా మారిన జిల్లాను కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలం చేసింది సీఎం కేసీఆర్ అని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. 

Minister Jagadish Reddy: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సూర్యాపేట జిల్లాలో మంత్రి జగదీష్ రెడ్డి... లక్ష మంది స్థానికులతో లక్ష జన హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎడారిగా మారిన జిల్లాకు ఎస్సారెస్పీ ద్వారా కాళేశ్వరం నీటిని అందించినందుకు ముఖ్యమంత్రికి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. అందుకుగాను కాళేశ్వరం జలాలకు జన హారతి కార్యక్రమాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. సూర్యాపేట జిల్లాలో తిరుమలగిరి మండలం ఈటూరు నుంచి పెన్ పహాడ్ మండలం రావి చెరువు వరకు మొత్తం 68 కిలో మీటర్ల మేర ఎస్సారెస్పీ కాలు వెంట స్థానిక ప్రజలు గోదావరి జలాలలకు జల హారతిని సమర్పించారు.

చివ్వెంల మండల కేంద్రంలో జగదీష్ రెడ్డి కాళేశ్వరం జలాలకు జలహారతిని సమర్పించారు. నీటి కరవుతో ఇబ్బందులు పిడన నేల.. నేడు సస్యశ్యామలంగా మారడానికి కారణం ముఖ్యమంత్రేనని వెల్లడించారు. మొదట బోరు బావులు ఉపయోగించి వెయ్యి అడుగుల వరకు వెళ్లిన నీటి లభ్యతలేని ప్రాంతంగా ఉండేదన్నారు. కానీ సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం జలాలతో సాగునీటికి ఎలాంటి కొరత లేకుండా చేశారని చెప్పారు. 

వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం..

మంత్రి జగదీష్ రెడ్డి చేపట్టిన "కాళేశ్వరం నీరు - లక్షల జన హారతి" కార్యక్రమానికి అరుదైన గౌరవం దక్కింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మంత్రి గుంటకండ్ల జగదీశ్‌ రెడ్డికి వండర్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌ లో స్థానం లభించింది. ఈక్రమంలోనే ప్రతినిధులు మెడల్‌ తో పాటు జ్ఞాపిక, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. మంత్రి ఈ కార్యక్రమం నిర్వహించాలని పిలుపునిచ్చిన వెంటనే వండర్ వరల్డ్ ఆఫ్ బుక్ సంస్థ ప్రతినిధులు రంగంలోకి దిగి అధ్యయనం చేశారు. ఐడబ్ల్యూఎస్ఆర్ ఇండియా చీఫ్ డా. బి. నరేందర్ గౌడ్, తెలంగాణ కోఆర్డినేటర్ ఎ. గంగాదర్ లు.. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకు 7 మండలాల్లో పర్యటించారు. కాళేశ్వరం నీళ్లలో లక్ష మందితో లక్ష మంది పాల్గొన్నారని, ఈ కార్యక్రమంలో లక్షా 16 వేల 142 మంది పాల్గొన్నారని బృందం నిర్ధారించింది. వీరిలో 65 వేల 42 మంది మహిళలు ఉండగా.. 51,100 మంది పురుషులు పాల్గొన్నట్లు తెలిపింది.

సూర్యాపేట మండలానికి చెందిన 19881 మందిలో 8625 పురుషులు, 11,256 మహిళలు, చివ్వెంకు చెందిన 10,454 మంది మహిళలు, 9785 మంది పురుషులు, పెన్ పహాడ్ కు చెందిన 11935 మహిళలు, 8125 మంది పురుషులు, ఆత్మకూర్ ఎస్ కు చెందిన 10156 మహిళలు, 95821 మంది పురుషులు, 95825 మంది పురుషులు, 95825 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ లక్ష జన హారతి ముగిసిన తర్వాత.. ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేదికపైనే మంత్రి జగదీశ్‌రెడ్డికి ఘనంగా సన్మానం చేశారు. సంస్థ నిర్వాహకులు.. మంత్రి జగదీష్ రెడ్డికి మెడల్‌తో పాటు మెమెంటో సర్టిఫికెట్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌తో పాటు ఆసాంతం కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. వండర్ బుక్ ఆఫ్ వరల్డ్స్ నిర్వాహకులు, జిల్లా కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్‌లను ఘనంగా సత్కరించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
Chandrababu Naidu: రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Sathankulam Custodial Deaths Case: మధురై జిల్లా కోర్టు సంచలన తీర్పు - 9 మంది పోలీసులకు మరణశిక్ష - ఏం చేశారంటే ?
మధురై జిల్లా కోర్టు సంచలన తీర్పు - 9 మంది పోలీసులకు మరణశిక్ష - ఏం చేశారంటే ?

వీడియోలు

CSK Bowling Failure vs RCB IPL 2026 | చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన ఆర్సీబీ
IPL 2026 RCB VS CSK Highlights | ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ
LSG Owner Sanjiv Goenka Tears Up IPL 2026 | కన్నీటి పర్యంతమైన ఓనర్ సంజీవ్ గోయెంకా
IPL 2026 SRH VS LSG Highlights | ఐపీఎల్ లో బోణీ కొట్టిన ల‌క్నో
RCB 250 vs CSK Chinnaswamy IPL 2026 | చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ పరుగుల వరద

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
Chandrababu Naidu: రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Sathankulam Custodial Deaths Case: మధురై జిల్లా కోర్టు సంచలన తీర్పు - 9 మంది పోలీసులకు మరణశిక్ష - ఏం చేశారంటే ?
మధురై జిల్లా కోర్టు సంచలన తీర్పు - 9 మంది పోలీసులకు మరణశిక్ష - ఏం చేశారంటే ?
Hardik Pandya Returns: ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్  - రాజస్థాన్ రాయల్స్‌తో బిగ్ ఫైట్ కు రెడీ!
ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్  - రాజస్థాన్ రాయల్స్‌తో బిగ్ ఫైట్ కు రెడీ!
Car Maintenance Guide: తక్కువ పెట్రోల్, డీజిల్‌తో వాహనాన్ని ఎలా నడపాలి? పాటించాల్సిన చిట్కాలు ఏంటీ?
తక్కువ పెట్రోల్, డీజిల్‌తో వాహనాన్ని ఎలా నడపాలి? పాటించాల్సిన చిట్కాలు ఏంటీ?
Organ Transplant Green Channel: ప్రాణం కాపాడేందుకు ఒక్కటైన జనం, పోలీసులు - గ్రీన్ చానల్ ద్వారా ఆస్పత్రి ఆర్గాన్ తరలింపు
ప్రాణం కాపాడేందుకు ఒక్కటైన జనం, పోలీసులు - గ్రీన్ చానల్ ద్వారా ఆస్పత్రి ఆర్గాన్ తరలింపు
Car SafetyTips in Summer : ఎండకాలంలో కారులో ఈ 5 వస్తువులు అస్సలు ఉంచకండి.. ఏమరుపాటుగా ఉంటే కారు పేలిపోయే ప్రమాదం!
ఎండకాలంలో కారులో ఈ 5 వస్తువులు అస్సలు ఉంచకండి.. ఏమరుపాటుగా ఉంటే కారు పేలిపోయే ప్రమాదం!
Embed widget