అన్వేషించండి

Munugodu BJP : మునుగోడులో టీఆర్ఎస్‌కు షాక్ - బీజేపీలో చేరిన చౌటుప్పల్ ఎంపీపీ !

టీఆర్ఎస్‌కు చెందిన చౌటుప్పల్ ఎంపీపీ బీజేపీలో చేరారు. మునుగోడు ఉపఎన్నికల ముందుగా ఈ అంశం టీఆర్ఎస్‌కు షాక్‌కు గురి చేసింది.

 

Munugodu BJP : మునుగోడులో ఓ వైపు కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులకు టీఆర్ఎస్ కండువా కప్పుతూండగా.. బీజేపీ టీఆర్ఎస్ నేతలకే గాలం వేస్తోంది.  చౌటుప్పల్ ఎంపీపీ తాడురి వెంకటరెడ్డి, మాజీ జెడ్పీటీసీ, మండల టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు పెద్దిటి బుచ్చి రెడ్డి, మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కంది లక్ష్మా రెడ్డిలు ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీలో చేరారు. తాడూరి వెంకట్ రెడ్డి వ్యవహారం రోజంతా ఉద్రిక్తతలకు కారణం అయింది.  తాడూరి వెంకట్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించడం అర్ధరాత్రి కలకలం రేపింది.  తాను టీఆర్ఎస్ ను వీడుతున్న విషయం తెలుసుకున్న మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి... పోలీసులచే అక్రమ కేసులు పెట్టిస్తున్నారని వెంకట్ రెడ్డి ఆరోపించారు.   

కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న వెంకట్ రెడ్డి 

తాడూరి వెంకటరెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న కూసుకుంట్ ప్రభాకర్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతివాదుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో ఆయనకు బీజేపీ ఆహ్వానం పలికింది. ఆయన బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తాను టీఆర్ఎస్ బీఫామ్ పై ఎంపీపీగా గెలవలేదని వెంకటరెడ్డి చెబుతున్నారు.   మంత్రి జగదీష్ రెడ్డి విధానం నచ్చకనే బీజేపీలో చేరామని చెబుతున్నారు.  మునుగోడు నియోజకవర్గంలోనే అతిపెద్దదైన చౌటుప్పల్ మండలం ఎంపీపీ పార్టీని వీడటం టీఆర్ఎస్‌కు ఇబ్బందికరంగా మారింది.  

తనను అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారని వెంకట్ రెడ్డి ఆరోపణ

అయితే తనపై ఎలాంటి కేసులు లేవని, రాజకీయ కుట్రతో పోలీసులతో అరెస్ట్ చేయాలని చూశారని  వెంకట్ రెడ్డి ఆరోపిస్తున్నారు. వెంకటరెడ్డికి బీజేపీ కండువా కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు ఈటల రాజేందర్. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటేనన్నారు.  ఎన్నికల ముందుగానీ తరువాత గానీ రెండు పార్టీలు కలిసిపోవడం ఖాయమని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. హుజూరాబాద్ ప్రజలు చెంప చెళ్లుమనిపించినా సీఎం కేసీఆర్ కు బుద్దిరాలేదని మండిపడ్డారు. కేసీఆర్ వైఖరిపై పార్టీ నేతలకు వెగటు పుట్టి టీఆర్ఎస్ నుంచి బయటకు వస్తున్నారని అన్నారు. గులాబీ కండువాను వదిలేస్తున్న వారిపై కేసులు పెట్టి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని ఈటల ఆరోపించారు. 

సొంత పార్టీ నేతలకే వెల కడుతున్న నీచమైన పార్టీ టీఆర్ఎస్

సొంత పార్టీ నేతలకే వెల కడుతున్న నీచమైన పార్టీ టీఆర్ఎస్ అని ఈటల రాజేందర్ మండిపడ్డారు.  పిచ్చివేషాలు వేసి లొంగదీసుకుంటామంటే తెలంగాణ సమాజం లొంగదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ను ఎదుర్కొనే ఏకైక పార్టీ బీజేపీయే అన్న ఈటల.. బీజేపీ కార్యకర్తలు, నాయకులు మనోనిబ్బరం కోల్పోవద్దని సూచించారు. ఇన్నేళ్లు కష్టపడి పనిచేశామని, మరో 6 నెలలు ఇలాగే కష్టపడితే అధికారం మనదే అని భరోసా ఇచ్చారు.   తెరాస ను ఎదుర్కోనే ఏకైక పార్టీ బీజేపీ. కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎన్నికల ముందో తరువాతనో కలిసిపోతాయని ఈటల జోస్యం చెప్పారు. 

టాప్ హెడ్ లైన్స్

Dharavath Nikhil Death Case: ధరావత్ నిఖిల్ పరువుహత్య.. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించిన హైకోర్టు
ధరావత్ నిఖిల్ పరువుహత్య.. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించిన హైకోర్టు
CM Revanth Reddy: ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
Breaking News: రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu Amaravati Capital Review: అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
CII Partnership Summit 2026: నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
Kakinada KIET College Invitation To CM Vijay: కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
Patancheru Real Estate: ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
Los Angeles Olympics Qualification Criteria : లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
NBK111 Update : బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget