అన్వేషించండి

Munugodu Bypoll : మునుగోడులో సడన్ సైలెంట్, ప్రజల పల్స్ తెలియక పార్టీల తికమక!

Munugodu Bypoll : మునుగోడు ఉపఎన్నికను టార్గెట్ చేసిన ప్రధాన పార్టీలు జనం నాడి పట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకూ నేతలను ఆకర్షించే ప్రయత్నం చేసిన పార్టీలు ఇప్పుడు ప్రజల వైపు దృష్టిపెట్టాయి.

Munugodu Bypoll : రెండు వారాల క్రితం వరకు అప్పుడే ఉపఎన్నికలు వచ్చాయా? అన్నట్లుగా మునుగోడు చుట్టూ తిరిగిన రాజకీయాలు ఇప్పుడు మాత్రం ఒకేసారి సైలెంట్‌ అయ్యాయి. అయితే అసలు మునుగోడులో ఏం జరుగుతుందో తెలుసా? అంటే అందుకు సమాధానం మాత్రం ఇప్పటి వరకు కేవలం నాయకులను జంప్‌ జిలానీలుగా మార్చిన పార్టీలు ఇప్పుడు జనం మూడ్‌ తెలుకునే పనిలో పడ్డారు. 

పార్టీ ఫిరాయింపులు 

తెలంగాణలో హాట్‌ టాపిక్‌గా మారిన మునుగోడు నియోజకవర్గ ఉపఎన్నిక ఇప్పుడు సైలెంట్‌గా మారింది. టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు భారీ సభలతో మునుగోడు నియోజకవర్గంలో ప్రచారాన్ని ప్రారంభించారు. ఓ వైపు కేంద్ర మంత్రి అమిత్‌షా నేరుగా మునుగోడుకు రాగా మరోవైపు కేసీఆర్‌ సైతం ఆశీర్వాద సభలతో భారీ సభలను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా మునుగోడు కేంద్రంగానే సుమారు నెల రోజుల పాటు రాజకీయ సమరం సాగింది. ఆ తర్వాత ఒక్కో పార్టీ తమ స్థాయిని బట్టి ఫిరాయింపుల కోసం చిన్న స్థాయి నాయకుడి నుంచి పై స్థాయి నాయకుడి వరకు భారీ తాయిలాలతో హడావుడి చేసిన నేతలు ఇప్పుడు అసలు విషయంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సర్పంచ్‌లు, ఎంపీటీలను పార్టీలు మార్చుకునేందుకు రూ. లక్షల్లో తాయిలాలు ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు ఓ పార్టీ ఏకంగా కొత్త కొత్త కార్లను ఇంటి ముందు నిలిపి వారిని పార్టీ ఫిరాయింపులు చేయించినట్లు ఆరోపణలు వచ్చాయి. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక తర్వాత భారీ ఖర్చుతో కూడిన ఎన్నికగా మునుగోడు ఉపఎన్నిక మారింది. ఇప్పటి వరకు ఇదంతా చేసిన నాయకులు ఇప్పుడు జనం వైపు దృష్టి మరలినట్లు తెలుస్తోంది.

ప్రజల పల్స్‌  తెలియక తికమక 

ఒక ప్రాంతంలోని పెద్ద నాయకుడు తమ పార్టీలో చేరితో అక్కడ ఉన్న మెజారిటీ జనం మనవైపే మొగ్గుచూపుతారనే పాత కాలం ట్రెండ్‌ మారింది. ఇప్పుడు నాయకులతో సంబంధం లేకుండా ఓటర్లు తమ నిర్ణయం తామే తీసుకుంటున్నారు. కొంత మేరకు నాయకుల ప్రభావం ఉన్నప్పటికీ మెజారిటీ ఓటర్ల ఆలోచన మాత్రం మారింది. అందుకు కారణం వారిలో చైతన్యమే.. ఎవరు ఎంతిచ్చినా వద్దనకుండా గుట్టుకున గుంజేసీ తాము అనుకున్నది చేసేద్దామనే ఫీలింగ్‌లో ఉంటున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ఓటర్లలో ఈ చైతన్యం ఎక్కువగా లేనప్పటికీ పట్టణాల్లో మాత్రం ఇది స్పష్టంగా కనిపిస్తోంది. మరి ముఖ్యంగా యువకుల్లో మాత్రం ఈ మార్పు ఎప్పుడో జరిగిపోయింది. అయితే కోట్లాది రూపాయలు కుమ్మరించి నాయకులను కొనుగోలు చేసినా చివరకు ఓటరు మాత్రం తన తీర్పు ఏం ఇస్తారో? అనే భయంతో క్షేత్రస్థాయి నాయకులు ఉన్నట్లు సమాచారం.

గ్రామాల్లో పర్యటనలు

ఇప్పటికే అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన మంత్రి జగదీశ్వర్‌రెడ్డి గ్రామాలలో పర్యటించడంతోపాటు అక్కడున్న కార్యకర్తలను జనంలోకి వెళ్లేలా ఆదేశాలు జారీచేస్తున్నారు. మరోవైపు తన రాజీనామాతో ఉపఎన్నికలు రావడం, ఈ గెలుపు తన రాజకీయ భవిష్యత్‌కు కూడా కీలకం కావడంతో కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి సైతం గ్రామాల పర్యటనలో పడ్డారు. మరోవైపు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్‌ చేసుకున్న కాంగ్రెస్‌ పార్టీ కరపత్రాలతో ప్రజలకు చేరువయ్యేందుకు చూస్తుంది. నాయకులే కాదు ఓటర్లు ముఖ్యం అనే భావనలో ఉన్న అన్ని పార్టీలు ఇప్పుడు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు గ్రామస్థాయిలోకి చేరుకుంటున్నారు. దీంతో భారీ హడావుడి నడుమ ప్రారంభమైన మునుగోడు ఉపఎన్నిక ఇప్పుడు కాస్తా సైలెంట్‌గా మారిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ మునుగోడు ఓటరు ఎలాంటి తీర్పు ఇస్తారు. ఏ పార్టీ చేసే ప్రచారానికి ఆకర్షితులవుతారో వేచి చూడాల్సిందే.

Also Read : Nirmala Sitharaman Vs Harish Rao : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు హరీష్ రావు సవాల్, అది నిరూపిస్తే రాజీనామా

Also Read : సూర్యుడు అస్తమించకుండా ప్రయత్నాలు చేస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారులు!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KTR vs Revanth Reddy: రేవంత్ రెడ్డికి దమ్ముంటే 420 హామీల అమలుపై ఛాలెంజ్ స్వీకరించాలి: కేటీఆర్ డిమాండ్
రేవంత్ రెడ్డికి దమ్ముంటే 420 హామీల అమలుపై ఛాలెంజ్ స్వీకరించాలి: కేటీఆర్ డిమాండ్
Heatwave In AP and Telangana: తెలంగాణలో ఎండలతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్.. ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో ఎండలతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్.. ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు
e- Shram Card 2026: అసంఘటిత రంగాల్లోని కార్మికులకు రూ.2 లక్షల బీమా.. ఇ-శ్రమ్ కార్డు ప్రయోజనాలు, దరఖాస్తు విధానం
అసంఘటిత రంగాల్లోని కార్మికులకు రూ.2 లక్షల బీమా.. ఇ-శ్రమ్ కార్డు ప్రయోజనాలు, దరఖాస్తు విధానం
Balka Suman Remand: బాల్క సుమన్‌‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు
బాల్క సుమన్‌‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు

వీడియోలు

King Kohli vs Prince Gill IPL 2026 Final | కింగ్ vs ప్రిన్స్ ఎవరిదీ పైచేయి?
Captain vs Coach in RR IPL 2026 | పరాగ్ కామెంట్స్‌పై కోచ్ సంగక్కర ఫైర్
Riyan Parag Consoling Vaibhav Suryavanshi | డగౌట్ లో ఏడ్చేసిన వైభవ్ సూర్యవంశీ
RCB vs GT Final Rain Rules | IPL 2026 ఫైనల్‌కు వర్షం ముప్పు?
RCB vs GT Match Preview IPL 2026 Final | ఈసారి ఐపీఎల్ కప్ ఎవరిది?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh Slams Jagan: జనం ఛీకొట్టినా జగన్ డ్రామాలు మానడం లేదు- నంద్యాలలో YSR విగ్రహం ధ్వంసంపై నారా లోకేష్
జనం ఛీకొట్టినా జగన్ డ్రామాలు మానడం లేదు- నంద్యాలలో YSR విగ్రహం ధ్వంసంపై నారా లోకేష్
Gen Z Impact Indian Politics: భారత రాజకీయాలను జెన్ జీ ప్రభావితం చేయగలదా? బంగ్లాదేశ్, నేపాల్ పరిస్థితి వస్తుందా?
భారత రాజకీయాలను జెన్ జీ ప్రభావితం చేయగలదా? బంగ్లాదేశ్, నేపాల్ పరిస్థితి వస్తుందా?
Balka Suman Remand: బాల్క సుమన్‌‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు
బాల్క సుమన్‌‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు
Srinivasa Mangapuram Glimpse : శ్రీనివాస మంగాపురం గ్లింప్స్... అబ్బాయ్ యాక్షన్, వయలెన్స్ - ఎవరూ ఊహించని క్లైమాక్స్
శ్రీనివాస మంగాపురం గ్లింప్స్... అబ్బాయ్ యాక్షన్, వయలెన్స్ - ఎవరూ ఊహించని క్లైమాక్స్
పెట్రోల్‌ కాదు, కొత్త ఇంధనంతో దూసుకుపోనున్న Maruti Fronx.. జూన్ 4న లాంచ్!
పెట్రోల్‌ కాదు, కొత్త ఇంధనంతో దూసుకుపోనున్న Maruti Fronx.. జూన్ 4న లాంచ్!
Female Fertility : నోటి ఆరోగ్యం సరిగా లేకుంటే తల్లి కావడం కష్టమా? సంతానోత్పత్తిపై జరిగిన కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు
నోటి ఆరోగ్యం సరిగా లేకుంటే తల్లి కావడం కష్టమా? సంతానోత్పత్తిపై జరిగిన కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Save The Tigers 3 OTT : సేవ్ ది టైగర్స్ 3 వచ్చేస్తోంది - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
సేవ్ ది టైగర్స్ 3 వచ్చేస్తోంది - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Abhishek Banerjee Attack: బెంగాల్‌లో ట్రీట్మెంట్ అందడం లేదు.. అవసరమైతే అభిషేక్ బెనర్జీని హైదరాబాద్‌కు తరలిస్తాం: మమతా బెనర్జీ
బెంగాల్‌లో ట్రీట్మెంట్ అందడం లేదు.. అవసరమైతే అభిషేక్ బెనర్జీ హైదరాబాద్‌కు తరలింపు: మమతా బెనర్జీ
Embed widget