అన్వేషించండి

Munugode Bypoll : మునుగోడులో ముగిసిన పోలింగ్, పలుచోట్ల ఘర్షణలు

Munugode Bypoll : మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు.

Munugode Bypoll :  మునుగోడు ఉపఎన్నిక పోలింగ్‌ చిన్న చిన్న ఘటనల మినహా ప్రశాంతంగా ముగిసింది. నియోజకవర్గ వ్యాప్తంగా 119 కేంద్రాల్లోని 298 బూత్‌లలో గురువారం సాయంత్రం 6 గంటలకు పోలింగ్‌ ముగిసింది. అయితే కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్‌లో ఉన్న వారికి టోకెన్లు ఇచ్చి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 2,41,855 మంది ఓటర్లు ఉండగా సాయంత్రం 5 గంటల వరకు 1,87,527 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని ఎన్నికల అధికారులు తెలిపారు. సాయంత్రం 5 గంటల వరకు 77.55 శాతం పోలింగ్‌ నమోదైందని వెల్లడించారు. గత ఎన్నికల్లో 91.30 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈసారి అంతకంటే ఎక్కువ పోలింగ్ శాతం నమోదు అయ్యే అవకాశముందని ప్రధాన పార్టీలు భావిస్తున్నారు. చివరి గంటలో ఎక్కువ మంది పోలింగ్‌ కేంద్రాలకు వస్తుండడంతో పలు కేంద్రాల వద్ద చెదురు మదురు ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పూర్తిస్థాయి పోలింగ్‌ శాతంపై స్పష్టత వచ్చేందుకు కొంత సమయం పట్టే అవకాశముందని ఎన్నికల అధికారులు అంటున్నారు. 

ప్రశాంతంగా పోలింగ్ 

"మునుగోడు ఉపఎన్నికల పోలింగ్ చాలా ప్రశాంతంగా సాగింది. ఇంకా చాలా ప్రాంతాల్లో క్యూ లైన్ లో ఓటర్లు వేచి ఉన్నారు. మూడు ఈవీఏంలు మార్చారు, నాలుగు వీవీప్యాట్ లు మార్చారు.  ఇప్పటి వరకూ 6100 లీటర్లు మద్యం స్వాధీనం చేసుకున్నారు. రూ.8.27 కోట్ల నగదు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నాం. 3.29 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నాం. ఈరోజు 98 ఫిర్యాదులు వచ్చాయి. 70 మందిని స్థానికేతరులను గుర్తించారు. వారిని బయటకి పంపారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్ట భద్రత ఉంటుంది. లెక్కింపు సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చాం. లెక్కింపు కోసం మైక్రో అబ్జర్వర్ లను నియమిస్తాం.  స్థానికేతరలను అబ్జర్వర్ల బృందాలల్లో నియమిస్తాం"- వికాస్ రాజ్, ప్రధాన ఎన్నికల అధికారి 

ఓటర్ నాడిపై ఉత్కంఠ 

మునుగోడులో టీఆర్ఎస్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ ఆరోపించారు. పోలింగ్ ముగిశాక ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చెప్పిన మాట వినాలంటూ అధికారులను టీఆర్ఎస్‌ నేతలు బెదిరించారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మునుగోడులో బీజేపీ  గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌, బీఎస్పీ తోపాటు వివిధ పార్టీలు, స్వతంత్రులు కలిపి మొత్తం 47 మంది మునుగోడు ఉపఎన్నికలో పోటీ పడ్డారు. ముఖ్యంగా టీఆర్ఎస్,  బీజేపీ, కాంగ్రెస్‌ మధ్యే పోటీ నడిచింది. పోలింగ్ ప్రక్రియ ముగిసినప్పటికీ ప్రధాన పార్టీల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ఉపఎన్నికలో గెలుపు తమదే విజయమని ఆయా పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఫలితం ఎలా ఉంటుందోనని లోలోపల మాత్రం టెన్షన్ పడుతున్నారు అభ్యర్థులు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు మునుగోడు ఉపఎన్నికను సెమీఫైనల్‌గా భావిస్తున్నారు. దీంతో మునుగోడు ఫలితంపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది.

Also Read : KA Paul: పోలింగ్ బూత్‌ల వద్ద కేఏ పాల్ ఉరుకులు, ఆయన సమాధానం వింటే నవ్వుకోవాల్సిందే!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Septic Tank Dump in Gandipet Lake : తాగునీటి చెరువులో సెప్టిక్ ట్యాంక్ డంపింగ్- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పబ్లిక్! క్రిమినల్ కేసులు నమోదు!
తాగునీటి చెరువులో సెప్టిక్ ట్యాంక్ డంపింగ్- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పబ్లిక్! క్రిమినల్ కేసులు నమోదు!
Bangladesh Protest: భారత రాయబార కార్యాలయం వెలుపల విధ్వంసం! ఉస్మాన్ హదీ మరణంతో పలు ప్రాంతాల్లో రాళ్ల దాడులు!
భారత రాయబార కార్యాలయం వెలుపల విధ్వంసం! ఉస్మాన్ హదీ మరణంతో పలు ప్రాంతాల్లో రాళ్ల దాడులు!
Bondi Beach Attack Case Update : 27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
Jagruti Kavitha: కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?

వీడియోలు

G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Septic Tank Dump in Gandipet Lake : తాగునీటి చెరువులో సెప్టిక్ ట్యాంక్ డంపింగ్- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పబ్లిక్! క్రిమినల్ కేసులు నమోదు!
తాగునీటి చెరువులో సెప్టిక్ ట్యాంక్ డంపింగ్- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పబ్లిక్! క్రిమినల్ కేసులు నమోదు!
Bangladesh Protest: భారత రాయబార కార్యాలయం వెలుపల విధ్వంసం! ఉస్మాన్ హదీ మరణంతో పలు ప్రాంతాల్లో రాళ్ల దాడులు!
భారత రాయబార కార్యాలయం వెలుపల విధ్వంసం! ఉస్మాన్ హదీ మరణంతో పలు ప్రాంతాల్లో రాళ్ల దాడులు!
Bondi Beach Attack Case Update : 27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
Jagruti Kavitha: కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్ అడే భారత్ జట్టు ఇదేనా? సూర్యకుమార్ సారథ్యంలో తుది జట్టుపై బిగ్ అప్డేట్!
టి20 ప్రపంచ కప్ అడే భారత్ జట్టు ఇదేనా? సూర్యకుమార్ సారథ్యంలో తుది జట్టుపై బిగ్ అప్డేట్!
Ram Charan : 'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Embed widget