అన్వేషించండి

Munugode Bypoll : టీఆర్ఎస్ కు ఈసీ షాక్, కేసు నమోదు చేయాలని ఆదేశం!

Munugode Bypoll : యాదాద్రి ఘటనపై అందించిన ఫిర్యాదుపై ఈసీ స్పందించింది. టీఆర్ఎస్ పై కేసు నమోదు ఆదేశించింది.

Munugode Bypoll : 300 మందిని యాదాద్రికి తీసుకెళ్లి ప్రమాణం చేయించిన వ్యవహరంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినందుకు టీఆర్ఎస్ పై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ కేసులో ఖర్చును టీఆర్ఎస్ అభ్యర్థి ఖాతాలో వెయ్యాలని ఈసీ ఆదేశించింది. మునుగోడు మాజీ రిటర్నింగ్‌ అధికారి జగన్నాథరావుపై చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. లేని అధికారంతో గుర్తు మార్చి, విధి నిర్వహణలో వైఫల్యం చెందినందుకు మునుగోడు మాజీ రిటర్నింగ్‌ అధికారి జగన్నాథరావుపై చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది. జగన్నాథరావుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ తెలంగాణ ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ఈవీఎం బ్యాలెట్‌లో బోటు గుర్తుకు బదులు మరో గుర్తు ముద్రించిన చౌటుప్పల్‌ ఎమ్మార్వోపై సస్పెన్షన్‌ వేటు పడింది.  

గుర్తు మార్పుపై ఈసీ ఆగ్రహం 

మునుగోడు రిటర్నింగ్ అధికారిపై కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసింది. రోడ్డు రోలర్‌ గుర్తు మార్పు విషయంలో ఆర్వో నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుబట్టింది. ఆ గుర్తును ఎందుకు మార్చుకోవాల్సి వచ్చిందో వివరణ తీసుకోవాలని సీఈవోకు ఆదేశాలు ఇచ్చింది. ఆర్వో వివరణపై నివేదిక పంపాలని ఆదేశించింది. అదే సమయంలో మునుగోడు అభ్యర్థుల గుర్తుల జాబితా సవరించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. 

రిటర్నింగ్ అధికారిపై వేటు 

ఈసీ ఆదేశాల మేరకు ఫారం 7(ఎ) సవరణ చేస్తూ అభ్యర్థి శివ కుమార్‌కు తిరిగి రోడ్డు రోలర్‌ గుర్తు కేటాయిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మారిన గుర్తులతో బ్యాలెట్‌ ముద్రణకు ఈసీ చర్యలు తీసుకోనుంది. నామినేషన్ దాఖలు చేసిన యుగతులసి అనే పార్టీకి చెందిన శివ కుమార్ తనకు మొదట రోడ్డు రోలర్ గుర్తు కేటాయించారని, ఆ తర్వాత దాన్ని మార్చేసి బేబీ వాకర్ గుర్తు ఇచ్చారని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించిన కాపీని కూడా జత చేశారు. మరో స్వతంత్ర అభ్యర్థి, తెలంగాణ సకల జనుల పార్టీ నుంచి పోటీ చేస్తున్న జానయ్య కూడా గుర్తుల కేటాయింపులో గందరగోళం నెలకొందని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయాన్ని పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం ఆ గుర్తులు మార్చడంపై రిటర్నింగ్ అధికారిపై ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేసింది. ఈ గుర్తుల కేటాయింపుపై ఎన్నికల సంఘం అధికారులు కలెక్టర్ వినయ్ క్రిష్ణారెడ్డి వివరణ కూడా కోరారు. అయితే, గుర్తులు మార్చాలని తాను ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే, బ్యాలెట్ పేపర్లు ప్రచురణకు పంపామని, ఈసీ ఏవైనా మార్పులు సూచిస్తే మారుస్తామని చెప్పారు. 

ఆర్వోగా మిర్యాలగూడ ఆర్డీవో

 మునుగోడు ఉప ఎన్నిక నూతన ఆర్వోగా మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్ కు కేంద్ర ఎన్నికల కమిషన్ బాధ్యతలు అప్పగించింది. ఇప్పటి వరకూ ఉన్న జగన్నాథ రావును తప్పించి  రోహిత్ సింగ్ ను నియమించారు.  ఉప ఎన్నికలో రోడ్డు రోలర్ గుర్తును నిబంధనలకు విరుద్ధంగా మార్చిన ఘటనలో జగన్నాథరావుపై వేటు పడింది. యుగతులసీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న శివకుమార్ కు  రోడ్డు రోలర్ గుర్తును మొదట కేటాయించారు. తరవాత మార్చి  బేబీవాకర్‌ను కేటాయించారు. దీనిపై శివకుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో తిరిగి రోడ్డు రోలర్ గుర్తును శివకుమార్‌కు కేటాయించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని సీఈసీ ఆదేశించింది.  

Also Read : గ్రామాలకు గ్రామాలు "దత్తత" తీసేసుకుంటున్న టీఆర్ఎస్ నేతలు - మునుగోడులో కొత్త వ్యూహం వర్కవుట్ అవుతుందా ?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ABP Desam Smart Ed Conclave 2026: స్కిల్ ఉంటే ప్రపంచం నీ జేబులో ఉన్నట్టే: ABP Desam Smart Ed Conclave 2026లో నెక్ట్స్‌ వేవ్‌ సీఈవో రాహుల్‌!
స్కిల్ ఉంటే ప్రపంచం నీ జేబులో ఉన్నట్టే: ABP Desam Smart Ed Conclave 2026లో నెక్ట్స్‌ వేవ్‌ సీఈవో రాహుల్‌!
Hyderabad Fire Accident: బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 35దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!
బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 35దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!
Telangana CPM: తెలంగాణ సీపీఎం గతమెంతో ఘనం - ఇప్పుడు నిర్వీర్యం - అంతా వీరభద్రమే చేశారా?
తెలంగాణ సీపీఎం గతమెంతో ఘనం - ఇప్పుడు నిర్వీర్యం - అంతా వీరభద్రమే చేశారా?

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
US Shooting: అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
Palamaner Latest News:తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
Kerala BJP: కేరళలో కమలం లక్ష్యం కింగ్ మేకర్ - మోదీ, అమిత్ షా వ్యూహాలు వర్కవుట్ అవుతాయా?
కేరళలో కమలం లక్ష్యం కింగ్ మేకర్ - మోదీ, అమిత్ షా వ్యూహాలు వర్కవుట్ అవుతాయా?
Hyderabad Fire Accident: బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 35దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!
బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 35దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!
Vijayawada- Visakha High Speed Rail: విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
Embed widget