అన్వేషించండి

Rajgopal Reddy : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై చెప్పుతో దాడి, పాల్వాయి స్రవంతి కాన్వాయ్ పై దాడికి రివేంజ్!

Rajgopal Reddy : మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ దగ్గరకు వస్తుండడంతో ప్రధాన పార్టీ కార్యకర్తలు ప్రత్యక్ష దాడులకు దిగుతున్నారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్త చెప్పుతో దాడి చేశాడు.

Rajgopal Reddy : మునుగోడు పోలింగ్ టైమ్ దగ్గర పడేకొద్దీ పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం పెరుగుతోంది. ఇప్పటి వరకూ ప్రచారాల్లో తిట్లదండకాలతో సరిపెట్టిన పార్టీలు ఇప్పుడు ప్రత్యక్ష ఫైట్ లకు దిగుతున్నాయి. ఆదివారం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పాల్వాయి స్రవంతి కాన్వాయ్ పై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు రివేంజ్ గా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై చెప్పుతో దాడి జరిగింది.   

రాజగోపాల్ రెడ్డిపై చెప్పుతో దాడి 

మునుగోడు ఉపఎన్నికల ప్రచారం మరింత జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు రోడ్ షోలు, ఇంటింటా ప్రచారాలతో ఓటర్లను ప్రసన్నం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే అధికార, విపక్ష పార్టీల నేతల మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. నేతల మధ్య మాటల యుద్ధం కాస్త దాడులు చేసుకునే స్థాయికి చేరింది. ఆదివారం కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డి కాన్వాయ్‌పై బీజేపీ కార్యకర్తల దాడికి పాల్పడ్డారు. నాంపల్లి మండలంలో స్రవంతి ప్రచారానికి వెళుతుండగా కొందరు బీజేపీ కార్యకర్తలు ఆమె వాహనాన్ని అడ్డుకున్నారు.  నాంపల్లి అంబేడ్కర్ చౌరస్తా వద్ద పాల్వాయి స్రవంతి, ఎమ్మెల్యే సీతక్క, కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో ఓ కాంగ్రెస్ కార్యకర్త కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై దాడికి పాల్పడ్డాడు. ఎన్నికల ప్రచారంలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతుండగా కాంగ్రెస్ కార్యకర్త చెప్పుతో ప్రచార వాహనంపైకి ఎక్కి కొట్టేందుకు యత్నించాడు. అప్రమత్తమైన రాజగోపాల్ రెడ్డి పక్కకు జరిగారు. బీజేపీ కార్యకర్తలు అతడిని పక్కకోవడంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

పోలీసులపై రాజగోపాల్ రెడ్డి ఫైర్ 

మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోలీసులపై ఫైర్ అయ్యారు. మంత్రి కేటీఆర్ కాన్వాయ్ కోసం హైవే బ్లాక్ చేశారని మండిపడ్డారు. ట్రాఫిక్ లో రెండు అంబులెన్స్ లు చిక్కుకున్న పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి మంత్రి కేటీఆర్ చౌటుప్పల్ నుంచి గట్టుప్పల్ వెళుతున్న సమయంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. అదే సమయంలో అటుగా వస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్రాఫిక్ లో అంబులెన్స్ ఆగిపోయిన విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రి కేటీఆర్ కోసం అంబులెన్స్ ఆపారంటూ ఆయన ఆరోపించారు. కానీ పోలీసులు మాత్రం తాము వాటిని గమనించలేదని చెప్పారు. ఒకవేళ గమనిస్తే వెంటనే రూట్ క్లియర్ చేసేవాళ్లమని పేర్కొన్నారు. దీంతో రాజగోపాల్ రెడ్డికి పోలీసులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. కేటీఆర్ ముఖ్యమంత్రా? మీరు ఎందుకు హైవేని బ్లాక్ చేశారంటూ పోలీసులపై రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. మీ వల్ల రెండు అంబులెన్స్ లో పేషెంట్లు ఇబ్బంది పడ్డారని పోలీసు ఉన్నతాధికారిని నిలదీశారు.  

కేటీఆర్ కోసం హైవే బ్లాక్ చేస్తారా? 

"మూడు అంబులెన్స్ లు ఆగిపోయాయి. మీకు తెలియడంలేదా? అందులో పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. కేటీఆర్ ఏమైనా ముఖ్యమంత్రా? ట్రాఫిక్ ఎందుకు ఆపారు. పోలీసులంటే నాకు ఎంతో గౌరవం. కానీ మీరు చేసింది సరికాదు. కేటీఆర్ కోసం హైవే బ్లాక్ చేస్తారా? . ఎవరొచ్చినా హైవే ఆపుతారా? హైవే పై ట్రాఫిక్ ఆపే హక్కు మీకెవ్వరిచ్చారు." -రాజగోపాల్ రెడ్డి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Delhi Election Exit Poll: ఢిల్లీ ఎన్నికల్లో హోరాహోరీ - బీజేపీకే ఎడ్జ్ అంటున్న ఎగ్జిట్ పోల్స్
ఢిల్లీ ఎన్నికల్లో హోరాహోరీ - బీజేపీకే ఎడ్జ్ అంటున్న ఎగ్జిట్ పోల్స్
Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు వైరల్ ఫీవర్ - గురువారం కేబినెట్ భేటీకి కూడా దూరం !
పవన్ కల్యాణ్‌కు వైరల్ ఫీవర్ - గురువారం కేబినెట్ భేటీకి కూడా దూరం !
Teenmar Mallanna:  తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీస్ - కాంగ్రెస్ నాయకత్వంపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు - వేటు తప్పదా ?
తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీస్ - కాంగ్రెస్ నాయకత్వంపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు - వేటు తప్పదా ?
YS Jagan Latest News: వైసీపీ కార్యకర్తలకు ఫుల్‌ జోష్‌ ఇచ్చే న్యూస్ చెప్పిన జగన్‌- ఇక ర్యాంపేజ్ తప్పదని ప్రత్యర్థులకు వార్నింగ్
వైసీపీ కార్యకర్తలకు ఫుల్‌ జోష్‌ ఇచ్చే న్యూస్ చెప్పిన జగన్‌- ఇక ర్యాంపేజ్ తప్పదని ప్రత్యర్థులకు వార్నింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Naga Chaitanya Thandel Real Story Ramarao | చైతూ రిలీజ్ చేస్తున్న తండేల్ కథ ఇతనిదే | ABP DesamTrump on Gaza Strip | ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధంలోకి అమెరికా | ABP DesamPawan Kalyan South Indian Temples Tour | పవన్ కళ్యాణ్ ఎందుకు కనిపించటం లేదంటే.! | ABP DesamErrum Manzil Palace | నిర్లక్ష్యానికి బలైపోతున్న చారిత్రక కట్టడం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Election Exit Poll: ఢిల్లీ ఎన్నికల్లో హోరాహోరీ - బీజేపీకే ఎడ్జ్ అంటున్న ఎగ్జిట్ పోల్స్
ఢిల్లీ ఎన్నికల్లో హోరాహోరీ - బీజేపీకే ఎడ్జ్ అంటున్న ఎగ్జిట్ పోల్స్
Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు వైరల్ ఫీవర్ - గురువారం కేబినెట్ భేటీకి కూడా దూరం !
పవన్ కల్యాణ్‌కు వైరల్ ఫీవర్ - గురువారం కేబినెట్ భేటీకి కూడా దూరం !
Teenmar Mallanna:  తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీస్ - కాంగ్రెస్ నాయకత్వంపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు - వేటు తప్పదా ?
తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీస్ - కాంగ్రెస్ నాయకత్వంపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు - వేటు తప్పదా ?
YS Jagan Latest News: వైసీపీ కార్యకర్తలకు ఫుల్‌ జోష్‌ ఇచ్చే న్యూస్ చెప్పిన జగన్‌- ఇక ర్యాంపేజ్ తప్పదని ప్రత్యర్థులకు వార్నింగ్
వైసీపీ కార్యకర్తలకు ఫుల్‌ జోష్‌ ఇచ్చే న్యూస్ చెప్పిన జగన్‌- ఇక ర్యాంపేజ్ తప్పదని ప్రత్యర్థులకు వార్నింగ్
Vizag Railway Zone: విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌, ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం - 4 డివిజన్లతో కొత్త రైల్వే జోన్
విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌, ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం - 4 డివిజన్లతో కొత్త రైల్వే జోన్
Case On Actor Venu: సినీ హీరో వేణుపై కేసు పెట్టిన సీఎం రమేష్ - కాంట్రాక్టుల్లో వచ్చిన తేడాలే కారణం !
సినీ హీరో వేణుపై కేసు పెట్టిన సీఎం రమేష్ - కాంట్రాక్టుల్లో వచ్చిన తేడాలే కారణం !
PM Modi Holy Dip: మహా కుంభమేళాలో మోదీ, త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన ప్రధాని
మహా కుంభమేళాలో మోదీ, త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన ప్రధాని
Baby John OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన కీర్తి సురేష్ ఫస్ట్ హిందీ మూవీ... 'బేబీ జాన్' చూడాలంటే కండిషన్స్ అప్లై
ఓటీటీలోకి వచ్చేసిన కీర్తి సురేష్ ఫస్ట్ హిందీ మూవీ... 'బేబీ జాన్' చూడాలంటే కండిషన్స్ అప్లై
Embed widget