అన్వేషించండి

Munugode Bypoll : మునుగోడు బైపోల్ కు టీఆర్ఎస్ రెడీ, కాంగ్రెస్ తోనే మాకు పోటీ - మంత్రి జగదీశ్ రెడ్డి

Munugode Bypoll : మునుగోడు బైపోల్ కు టీఆర్ఎస్ సిద్ధంగా ఉందని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు.

Munugode Bypoll : మునుగోడు ఉపఎన్నిక‌కు నగారా మోగింది. కేంద్ర ఎన్నిక సంఘం ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. దీంతో ప్రధాన పార్టీలు ప్రచార వేగాన్ని పెంచాయి. మునుగోడు ఉపఎన్నికకు టీఆర్ఎస్ పార్టీ రెడీగా ఉందని మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి స్పష్టం చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు, నిత్యవసరాలు ధరలు పెంచి ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్న బీజేపీకి బుద్ధి చెప్పడానికి మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. దేశాభివృద్ధికి కొత్త నమూనాతో ముందుకు వస్తున్న కేసీఆర్ ను బలపరచడానికి  ప్రజలు సిద్ధంగా ఉన్నార‌ని చెప్పారు.  ప్రభుత్వ రంగ సంస్థల‌ను ప్రైవేట్ పరం చేస్తున్న బీజేపీ దుష్ట ఆలోచనలను అడ్డుకోడానికి మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నార‌న్నారు. దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కొరుకుంటున్నార‌ని తేల్చి చెప్పారు.

కాంగ్రెస్ తోనే పోటీ 

తెలంగాణ సంక్షేమ పథకాలు తమకు కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను జాతీయ రాజకీయాలకు పంపుతున్నారని తెలిపారు. తెలంగాణ సంక్షేమం దేశ‌ం మొత్తం  విస్తరించాలని కోరుకుంటున్నారన్నారు. సీఎం కేసీఆర్ నిన్నటి సమావేశం చూసి ప్రధాని మోదీ, అమిత్ షాలకు రాత్రి నిద్ర ప‌ట్టక ఇవాళ మునుగోడు ఉపఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారని ఆరోపించారు. మునుగోడులో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ అని తెల్చేశారు.  ఈ ఎన్నికల్లో త‌ప్పకుండా టీఆర్ఎస్ గెలుస్తుందని మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 

ఓటమి భయంతోనే నోటిఫికేషన్ ఆలస్యం

"మునుగోడు ఉపఎన్నికకు టీఆర్ఎస్ సిద్ధంగా ఉంది. దేశానికి ద్రోహం చేస్తూ, రైతాంగాన్ని ముంచుతూ, మరో వైపు నిత్యవసరాల ధరలు అడ్డగోలుగా పెంచి వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతూ, పేద, మధ్య తరగతి ప్రజల పొట్టగొడుతున్న బీజేపీకి బుద్ధి చెప్పేందుకు మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఓ కోవర్టును కొనుక్కోవడం ద్వారా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్యాన్ని మునుగోడు ప్రజలు అర్థం చేసుకున్నారు. ప్రజల మనసుల్లోని బాధను స్వయంగా తెలుసుకుని, ఆ బాధల నుంచి విముక్తి చేయడానికి అనేక నూతన పథకాలు తీసుకొస్తున్న కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వ్యవసాయ రంగంలో అద్భుతమైన ప్రగతి సాధించేలా చేస్తున్న సీఎం కేసీఆర్ ఆలోచనలు అడ్డుకునేందుకు కేంద్రం కుట్రలు చేస్తుంది. తప్పకుండా మునుగోడులో టీఆర్ఎస్ గెలిచితీరుతుంది.  ఈ నోటిఫికేషన్ ముందే రావాల్సిఉంది. కావాలనే ఆలస్యంచేశారు. ఓటమి భయంతోనే బీజేపీ మునుగోడు ఉపఎన్నిక నోటిఫికేషన్ ఆలస్యం చేశారు. కేసీఆర్ రోజురోజుకు బలపడుతున్నారని భయంతో ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు. రాజకీయాలను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో కేసీఆర్ దిట్ట. "- మంత్రి జగదీశ్ రెడ్డి 

Also Read : BJP Plan : వేరే పనుల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ - మునుగోడు షెడ్యూల్‌ బీజేపీకి అడ్వాంటేజ్ ?

Also Read : Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల - పోలింగ్ డేట్, కౌంటింగ్ ఎప్పుడంటే

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hinduja Group: ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
Constable Suicide: తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
Nara Lokesh: ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
Accident Politics:   చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
Advertisement

వీడియోలు

Kavitha Janambata Interview | ఆదిలాబాద్ జిల్లాలో కవిత జనం బాట వెనుక మతలబు ఇదేనా.? | ABP Desam
Smrithi Mandhana Jemimah Gesture | ఆడి వరల్డ్ కప్ సాధించారు..ప్రత్యర్థులను ఓదార్చి హృదయాలు గెలిచారు | ABP Desam
Tribute to Mithali Raj Jhulan Goswami | ప్రపంచకప్ గెలిచి మిథాలీ, ఝులన్ గోస్వామికి ట్రిబ్యూట్ | ABP Desam
India vs South Africa Final | Deepti Sharma | మ్యాచ్‌ని మలుపు తిప్పిన దీప్తి శర్మ
Women's ODI Final | Smriti Mandhana | చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hinduja Group: ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
Constable Suicide: తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
Nara Lokesh: ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
Accident Politics:   చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
Pawan Kalyan: ప్రముఖ ఆలయాల్లో కార్తీక మాసం రద్దీ తగ్గ ఏర్పాట్లు -భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
ప్రముఖ ఆలయాల్లో కార్తీక మాసం రద్దీ తగ్గ ఏర్పాట్లు -భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
Vidadala Rajani: ఉద్యోగాల పేరుతో రూ. రూ.5 కోట్లు మోసం - మాజీ మంత్రి విడదల రజని పీఏలు, అనుచరులపై ఆరోపణలు
ఉద్యోగాల పేరుతో రూ. రూ.5 కోట్లు మోసం - మాజీ మంత్రి విడదల రజని పీఏలు, అనుచరులపై ఆరోపణలు
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో .. పత్తి రైతులతో కవిత
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో .. పత్తి రైతులతో కవిత
Youngest Self Made Billionaires: ముగ్గురు స్నేహితులు ఏఐ కంపెనీ పెట్టి 20 ఏళ్లకే బిలియనీర్లు అయ్యారు - వారిలో ఇద్దరు ఇండియన్ కుర్రాళ్లు!
ముగ్గురు స్నేహితులు ఏఐ కంపెనీ పెట్టి 20 ఏళ్లకే బిలియనీర్లు అయ్యారు - వారిలో ఇద్దరు ఇండియన్ కుర్రాళ్లు!
Embed widget