అన్వేషించండి

Munugode Bypoll : మునుగోడు బైపోల్ కు టీఆర్ఎస్ రెడీ, కాంగ్రెస్ తోనే మాకు పోటీ - మంత్రి జగదీశ్ రెడ్డి

Munugode Bypoll : మునుగోడు బైపోల్ కు టీఆర్ఎస్ సిద్ధంగా ఉందని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు.

Munugode Bypoll : మునుగోడు ఉపఎన్నిక‌కు నగారా మోగింది. కేంద్ర ఎన్నిక సంఘం ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. దీంతో ప్రధాన పార్టీలు ప్రచార వేగాన్ని పెంచాయి. మునుగోడు ఉపఎన్నికకు టీఆర్ఎస్ పార్టీ రెడీగా ఉందని మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి స్పష్టం చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు, నిత్యవసరాలు ధరలు పెంచి ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్న బీజేపీకి బుద్ధి చెప్పడానికి మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. దేశాభివృద్ధికి కొత్త నమూనాతో ముందుకు వస్తున్న కేసీఆర్ ను బలపరచడానికి  ప్రజలు సిద్ధంగా ఉన్నార‌ని చెప్పారు.  ప్రభుత్వ రంగ సంస్థల‌ను ప్రైవేట్ పరం చేస్తున్న బీజేపీ దుష్ట ఆలోచనలను అడ్డుకోడానికి మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నార‌న్నారు. దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కొరుకుంటున్నార‌ని తేల్చి చెప్పారు.

కాంగ్రెస్ తోనే పోటీ 

తెలంగాణ సంక్షేమ పథకాలు తమకు కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను జాతీయ రాజకీయాలకు పంపుతున్నారని తెలిపారు. తెలంగాణ సంక్షేమం దేశ‌ం మొత్తం  విస్తరించాలని కోరుకుంటున్నారన్నారు. సీఎం కేసీఆర్ నిన్నటి సమావేశం చూసి ప్రధాని మోదీ, అమిత్ షాలకు రాత్రి నిద్ర ప‌ట్టక ఇవాళ మునుగోడు ఉపఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారని ఆరోపించారు. మునుగోడులో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ అని తెల్చేశారు.  ఈ ఎన్నికల్లో త‌ప్పకుండా టీఆర్ఎస్ గెలుస్తుందని మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 

ఓటమి భయంతోనే నోటిఫికేషన్ ఆలస్యం

"మునుగోడు ఉపఎన్నికకు టీఆర్ఎస్ సిద్ధంగా ఉంది. దేశానికి ద్రోహం చేస్తూ, రైతాంగాన్ని ముంచుతూ, మరో వైపు నిత్యవసరాల ధరలు అడ్డగోలుగా పెంచి వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతూ, పేద, మధ్య తరగతి ప్రజల పొట్టగొడుతున్న బీజేపీకి బుద్ధి చెప్పేందుకు మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఓ కోవర్టును కొనుక్కోవడం ద్వారా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్యాన్ని మునుగోడు ప్రజలు అర్థం చేసుకున్నారు. ప్రజల మనసుల్లోని బాధను స్వయంగా తెలుసుకుని, ఆ బాధల నుంచి విముక్తి చేయడానికి అనేక నూతన పథకాలు తీసుకొస్తున్న కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వ్యవసాయ రంగంలో అద్భుతమైన ప్రగతి సాధించేలా చేస్తున్న సీఎం కేసీఆర్ ఆలోచనలు అడ్డుకునేందుకు కేంద్రం కుట్రలు చేస్తుంది. తప్పకుండా మునుగోడులో టీఆర్ఎస్ గెలిచితీరుతుంది.  ఈ నోటిఫికేషన్ ముందే రావాల్సిఉంది. కావాలనే ఆలస్యంచేశారు. ఓటమి భయంతోనే బీజేపీ మునుగోడు ఉపఎన్నిక నోటిఫికేషన్ ఆలస్యం చేశారు. కేసీఆర్ రోజురోజుకు బలపడుతున్నారని భయంతో ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు. రాజకీయాలను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో కేసీఆర్ దిట్ట. "- మంత్రి జగదీశ్ రెడ్డి 

Also Read : BJP Plan : వేరే పనుల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ - మునుగోడు షెడ్యూల్‌ బీజేపీకి అడ్వాంటేజ్ ?

Also Read : Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల - పోలింగ్ డేట్, కౌంటింగ్ ఎప్పుడంటే

టాప్ హెడ్ లైన్స్

Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Cheyutha Pensions: తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget