అన్వేషించండి

MP Arvind: కేసీఆర్ రెండో కొడుకు రేవంత్, అప్పటికల్లా సీఎం మనవడు ముసలోడు అయితడు.. ఎంపీ సంచలన వ్యాఖ్యలు

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేశారు. వివిధ అంశాలపై తీవ్రమైన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో దళితులకు సమ న్యాయం కల్పించడం లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. రాష్ట్రంలో 75 లక్షలకు పైగా దళితులు ఉన్నారని సాక్షాత్తూ ముఖ్యమంత్రే చెబుతున్నారని.. అలాంటప్పుడు మంత్రి వర్గంలో కేవలం ఒకే ఒక దళిత మంత్రికి చోటు కల్పించారని విమర్శించారు. కరోనా వల్ల దళిత బంధు ఆపేశారన్న సీఎం కేసీఆర్ మాటలను కూడా అర్వింద్ తప్పు బట్టారు. కరోనా కాలంలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు పెట్టారని, దళిత బంధు ఇచ్చేందుకు అది ఎలా అడ్డొచ్చిందని ప్రశ్నించారు. ఇప్పటి నుండి గ్యాప్ లేకుండా కేసీఆర్‌ను నిద్ర పోనివ్వబోమని హెచ్చరించారు. 25 ఏళ్ల కింద సిద్దిపేటలో దళిత చైతన్య జ్యోతితో సిద్దిపేట దళితులు కోటీశ్వరులు అయ్యారా? అని నిలదీశారు. సీఎం కేసీఆర్‌కి 2023 వరకు రెండో కొడుకు రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. కరీంనగర్‌లో ధర్మపురి అర్వింద్ మీడియాతో మాట్లాడారు.

కాళ్లు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకో..: అర్వింద్
‘‘ఇండియా టుడే సర్వేలో టాప్ 10 సీఎంల స్థానాల్లో కేసీఆర్ లేడు. నీ స్థానం ఎలా దిగజారుతోందో చూసుకో. అవినీతి పెరిగిపోయింది. తెలంగాణ ట్రాన్స్‌ కో ఇప్పటిదాకా రూ.లక్షా 10 వేల కోట్ల అప్పుల పాలైంది. కొన్న ప్రతి యూనిట్‌కి రూపాయి కమీషన్ నీ కొడుకే తీసుకుంటున్నాడు. సీఎం సిగ్గు లేనోడు. చెప్పిన అబద్దమే మల్ల మల్ల చెప్తడు. ఎస్సీలకు ఎందుకు రాజ్యాధికారం ఇవ్వలేదు. నీకు సిగ్గు మానం లేదు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఒక్కరికే మంత్రి పదవి ఇస్తవా. రాష్ట్రంలో 75 లక్షల దళిత జనాభా ఉందని నువ్వే చెప్తివి. ఇదేనా నీ పవిత్రత. కేంద్ర కేబినెట్‌లో సామాజిక న్యాయం ఉంది. 12 మంది ఎస్సీలు, 8 మంది ఎస్టీలు, 27 మంది బీసీలు, 11 మంది మహిళలు ఉన్నారు. నీ మంత్రి వర్గంలో 11 మంది ఓసీలు ఉన్నారు. నరేంద్ర మోదీ పాదాలు కడిగి నీళ్ళు నెత్తిమీద చల్లుకో కేసీఆర్. MP Arvind: కేసీఆర్ రెండో కొడుకు రేవంత్, అప్పటికల్లా సీఎం మనవడు ముసలోడు అయితడు.. ఎంపీ సంచలన వ్యాఖ్యలు

బొంద పెట్టడమే నా కర్తవ్యం
దళిత బంధు ఇవ్వకుండా ఒక్క దళిత కుటుంబం మిగిలినా నీకు తిప్పలు తప్పవు. బద్దలు బాసింగాలు అవుతయ్. దళితులకు లక్షా డెబ్భై వేల కోట్లు ఇవ్వాలంటే కేసీఆర్ మనువడు ముసలోడు కావాలె. కేసీఆర్ పతనం చూసే వరకు నిద్ర పోయేది లేదు 2023లో టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడం నా కర్తవ్యం. రైతులకు మీటర్లు పెట్టాలని ఎక్కడ చెప్పలేదు. రైతుల ఇండ్లలో కూడా మీటర్లు పెట్టొద్దు. హుజూరాబాద్ బస్ స్టాండ్ కూర్చోండి.. కేంద్రం డ్రాఫ్ట్ బిల్లు లో మీటర్లు బిగించాలని ఎక్కడో ఉందో చుపెట్టు అని ఎద్దేవా చేశారు.

అంబేడ్కర్ విగ్రహం ఏమైంది?
ఓటమి భయనికే పథకాలు పెడుతున్నవ్. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళితులకు దళిత బంధు, హుజూరాబాద్‌లో కులసంఘాలకు భూమి, జర్నలిస్ట్‌కి భూమి లాంటి హామీలన్నీ హుజూరాబాద్ ఎన్నికల కంటే ముందే ఇవ్వాలి. బెవకూఫ్ సీఎం నీకు వివరం ఉందా? పంటలకు బోనస్ లేదు. ఎంఎస్పీ కేంద్రం ఇస్తుంది కాబట్టే రైతులు వరి పంట పండిస్తున్నారు. లక్ష రూపాయల రుణ మాఫీ ఏమైంది? రాష్ట్రంలో 25 వేల దళిత ప్రజా ప్రతినిధులు ఉన్నారు అన్నావు.. ఇదంతా అంబేడ్కర్ గారి పుణ్యం. మరి ఆయన విగ్రహం ఏది? 125 అడుగులు అన్నావు ఏమైంది. దళిత బంధుకు రూ.1.7 లక్షల కోట్లు పెద్ద విషయం కాదు అంటున్నవు.. ఆయుష్మాన్ భవ, ఆవాస్ యోజనకి ఎందుకు కిస్తీలు కట్టడం లేదు. నీ కుటుంబం బాగు పడింది తప్ప ప్రజలు కాదు. నువ్వు తెచ్చిన అప్పుల్లో రూ.4.5 లక్షల కోట్లలో 30 శాతం కమీషన్ తీసుకొని రూ.1.70 లక్షల కోట్లను నీ కుటుంబం జేబులో వేసుకుంది.’’ అని అర్వింద్ మండిపడ్డారు.

కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణ రెడ్డి, హుజురాబాద్ మండల బీజేపీ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ, కరీంనగర్ జిల్లా జెడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమ, మైలార్ దేవ్ పల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి, కరీంనగర్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

సీతానవమి రోజు కవిత కొత్త పార్టీ ఆవిర్భావం! సవాళ్లు దాటుకుని సత్తాచాటుతారా? ఈ ముహూర్తం వెనుక రహస్యమేంటి?
Kavitha : సీతానవమి రోజు కవిత కొత్త పార్టీ ఆవిర్భావం! సవాళ్లు దాటుకుని సత్తాచాటుతారా? ఈ ముహూర్తం వెనుక రహస్యమేంటి?
Kavitha New Party: సర్వోదయ తెలంగాణ - కవిత పార్టీ నినాదం - ఏప్రిల్ 25న ప్రకటన
సర్వోదయ తెలంగాణ - కవిత పార్టీ నినాదం - ఏప్రిల్ 25న ప్రకటన
Telangana Praja Jagruthi: కవిత ప్రజా జాగృతి బీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు గండం - గులాబీ శ్రేణుల్లో గుబులు!
కవిత ప్రజా జాగృతి బీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు గండం - గులాబీ శ్రేణుల్లో గుబులు!
Telangana SSC Exams: తెలంగాణలో టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు చేస్తున్నారా? విద్యా కమిషన్ చేసిన సిఫార్సులివే
తెలంగాణలో టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు చేస్తున్నారా? విద్యా కమిషన్ చేసిన సిఫార్సులివే

వీడియోలు

Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam
Shubman Gill Message to Critics | విమర్శకులకు శుభ్‌మన్ గిల్ స్ట్రాంగ్ కౌంటర్ | ABP Desam
Pat Cummins Update on IPL 2026 Return | SRH ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
White Ball Turns Pink in PSL 2026 | పాక్ క్రికెట్ పరువు తీసిన పింక్ బాల్ | ABP Desam
Preity Zinta apologises to Jitesh Sharma | జితేశ్‌ శర్మకు సారీ చెప్పిన ప్రీతి జింటా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Meeting CMs: నిత్యావసరాల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు! రాష్ట్రాలకు ప్రధానమంత్రి కీలక ఆదేశాలు!
నిత్యావసరాల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు! రాష్ట్రాలకు ప్రధానమంత్రి కీలక ఆదేశాలు!
Harshaveena: న్యాయం చేయకపోతే జనసేన కార్యాలయం ముందే ఆత్మహత్య- అరవ శ్రీధర్ బాధితురాలి సంచలన వీడియో
న్యాయం చేయకపోతే జనసేన కార్యాలయం ముందే ఆత్మహత్య- అరవ శ్రీధర్ బాధితురాలి సంచలన వీడియో
Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం చట్టవిరుద్ధం కాదు - అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం చట్టవిరుద్ధం కాదు - అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
PM E-Drive Schemes:పీఎం ఈడ్రైవ్ స్కీమ్‌ గురించి తెలుసా? 2 లక్షల పెట్టుబడితో నెలకు 5 లక్షల వరకు సంపాదన!ఈవీ ఛార్జింగ్ స్టేషన్లపై కేంద్రం సబ్సిడీ!
పీఎం ఈడ్రైవ్ స్కీమ్‌ గురించి తెలుసా? 2 లక్షల పెట్టుబడితో నెలకు 5 లక్షల వరకు సంపాదన!ఈవీ ఛార్జింగ్ స్టేషన్లపై కేంద్రం సబ్సిడీ!
Tunguska Missile System: భారత రక్షణ రంగం మరింత బలోపేతం, రష్యా నుంచి తుంగస్కా క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు ఒప్పందం!
భారత రక్షణ రంగం మరింత బలోపేతం, రష్యా నుంచి తుంగస్కా క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు ఒప్పందం!
Nellore Latest News: నెల్లూరు టీడీపీ నేతల వీడియోలు వైరల్‌! గెస్ట్‌ హౌస్‌లో నాగినీ డ్యాన్స్‌! సోషల్ మీడియాలో విమర్శలు!
నెల్లూరు టీడీపీ నేతల వీడియోలు వైరల్‌! గెస్ట్‌ హౌస్‌లో నాగినీ డ్యాన్స్‌! సోషల్ మీడియాలో విమర్శలు!
Commercial gas: హర్మూజ్ నుంచి వస్తున్న నౌకలు - కమర్షియల్ గ్యాస్ సరఫరా70 శాతానికి పెంపు - పరిస్థితి చక్కబడినట్లేనా?
హర్మూజ్ నుంచి వస్తున్న నౌకలు - కమర్షియల్ గ్యాస్ సరఫరా70 శాతానికి పెంపు - పరిస్థితి చక్కబడినట్లేనా?
Bellamkonda Sai Sreenivas : ఏప్రిల్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య ఎంగేజ్మెంట్ - పెళ్లి ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
ఏప్రిల్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య ఎంగేజ్మెంట్ - పెళ్లి ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
Embed widget